ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ లో ఏర్పాటు చేసేందుకు తలపెట్టిన ఎయిర్పోర్టు నిర్మాణానికి పౌరవిమానాశ్రయానికి భారత వాయుసేన (IAF) అంగీకరించింది. భారత ఎయిర్ ఫోర్స్ నుంచి అనుమతులు రావడంపై జిల్లా వాసుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, పౌరవిమాన సేవలను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరిగణలోకి తీసుకుంది.
IAF Air Show : కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఆకాశంలో వైమానిక ప్రదర్శన కనువిందు చేసింది. ఆదివారం నాడు ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ ఉత్కంఠభరితమైన విన్యాసాలను తిలకించేందుకు పెద్ద ఎత్తున జనాలు తరలివచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దేవాదాయ శాఖ…
Tejas MK1A: స్వదేశీ తయారీ యుద్ధ విమానం తేజస్ MK1A కోసం ఇంజిన్లను అందించే అమెరికన్ కంపెనీ జీఈ ఏరోస్పేస్ కంపెనీపై భారత్ భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. జనరల్ ఎలక్ట్రిక్(GE) ఏరోస్పేస్ తేజస్ కోసం F404-IN20 ఇంజిన్లను అందించడంలో విఫలమైంది. నిజానికి జీఈ 2023లోనే ఇంజిన్ల డెలివరీ ప్రారంభించాలి. చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటనల సందర్భంగా ఆలస్యాన్ని లేవనెత్తినట్లు నివేదికలు తెలిపాయి.
C-295 Military Aircraft: ప్రధాని నరేంద్రమోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ సోమవారం సంయుక్తంగా టాటా ఎయిర్క్రాఫ్ట్ని ప్రారంభించారు. గుజరాత్ వడోదరలోని టాటా ఫెసిటిలీలో 40 సైనిక వ్యూహాత్మక రవాణా విమానాలైన C-295 ఎయిర్క్రాఫ్ట్లను నిర్మించనున్నారు. ఏవియేషన్ దిగ్గజం ఎయిర్ బస్ నేరుగా 16 విమానాలను డెలివరీ చేస్తుంది. C-295 ఎయిర్ క్రాఫ్ట్ ప్రత్యేకతలు: C-295 ఎయిర్క్రాఫ్ట్ వైమానిక దళానికి ఎంతో కీలకమైనది. ఈ విమానాలకు 5-10 టన్నుల సామర్థ్యం ఉంటుంది. C-295 అనేది 71 మంది…
Indian Air Force: ఇండియన్ ఎయిర్ ఫోర్స్(ఐఏఎఫ్) కీలకమైన విన్యాసాన్ని నిర్వహించింది. 15 కిలోమీటర్ల ఎత్తుకు పైన ఎగురుతున్న చైనా గూఢచారి బెలూన్ లాంటి లక్ష్యాన్ని విజయవంతంగా కూల్చేసింది
Indian Air Force: జమ్మూ కాశ్మీర్లోని వైమానికి దళ స్టేషన్లో వింగ్ కమాండర్గా పనిచేసే అధికారి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపించడం సంచలనంగా మారింది. అత్యాచారం, మానసిక వేధింపులు, నిరంతర వేధింపులకు పాల్పడినట్లు మహిళా అధికారి ఆరోపించడంతో ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) ఇంటర్నల్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
Tarang Shakti 2024: భారత గగనతలంలో పాల్గొనే దేశాలు తమ సైనిక పరాక్రమాన్ని ప్రదర్శించేందుకు వేదికను ఏర్పాటు చేస్తూ, తరంగ్ శక్తి విన్యాసాల రెండవ దశ శుక్రవారం రాజస్థాన్లోని జోధ్పూర్లో ప్రారంభమైంది.
త్వరలో సమర్ 2 (SAMAR 2) ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పరీక్షించేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇది శత్రువులను ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణి. దీనిని స్థానికంగా తయారు చేస్తున్నారు. ఈ క్షిపణి పరిధి దాదాపు 30 కిలోమీటర్లు. కాగా.. ఈ క్షిపణి గురించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మంగళవారం ఈ సమాచారాన్ని అందించారు.
India’s fighter Aircraft: బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో భారత గగనతలంలోకి ఆ దేశానికి చెందిన ఎయిర్క్రాఫ్ట్ ప్రవేశించడం తీవ్ర కలకలం రేపుతుంది. బంగ్లాదేశ్ వాయుసేనకు చెందిన సీ-130 ఎయిర్క్రాఫ్ట్ భారత గగనతలంలోకి ప్రవేశించిన వెంటనే ఇండియన్ ఎయిర్ఫోర్స్ అలర్ట్ అయింది.