Indian Air Force: గంగా ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్.. ఉద్రిక్తల వేళ ఐఏఎఫ్ సత్తా..
- భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ సత్తా చాటిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్..
- గంగా ఎక్స్ప్రెస్వే రన్ వే ప్రారంభానికి అంతా సిద్ధం..
- హైవేపై యుద్ధవిమానాల విన్యాసాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Air Force: భారతదేశంలో మరో రోడ్ ‘రన్ వే’ని ఈ రోజు ప్రారంభించనున్నారు. భారత వైమానిక దళం ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్పూర్ జిల్లాలోని గంగా ఎక్స్ప్రెస్వే పై నిర్మించిన 3.5 కి.మీ పొడవైన ఎయిర్ స్ట్రిప్ని శుక్రవారం ప్రారంభించనుంది. ఇది దేశ రక్షణను మరింత పెంచుతుంది. అధునాతన లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ స్ట్రిప్పై యుద్ధ విమానాలు పగలు, రాత్రి ల్యాండింగ్ చేయవచ్చు. భారత్లో ఇలాంటి సదుపాయం ఉన్న ఎయిర్స్ట్రిప్లో ఇదే మొదటిది.
మీరట్-ప్రయాగ్ రాజ్లను కలిపే 594 కి.మీ పొడవైన గంగా హైవేపై జలాలాబాద్లో ఈ ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఈ ఎయిర్ స్ట్రిప్ పనులు దాదాపుగా 85 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే, యూపీలోని ఆగ్రా-లక్నో, పూర్వాంచల్, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ దిగేందుకు అనువుగా రన్వేలు రూపొందించారు. గంగా ఎక్స్ప్రెస్వే రన్ వే నాలుగోది.
Also Read
- Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
- Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
- Firing: హర్యానాలో దారుణం.. జిమ్ యజమానిపై బుల్లెట్ల వర్షం.. 5 సెకండ్లలో 10 రౌండ్ల కాల్పులు..
Read Also: Minister Nara Lokesh: వంద పాకిస్థాన్లకు సమాధానం చెప్పే మిస్సైల్ మనదగ్గర ఉంది..అందేంటో తెలుసా?
షాజహాన్పూర్ ఎయిర్స్ట్రిప్లో IAF రెండు దశల్లో ఫైటర్ జెట్ విన్యాసాలు నిర్వహిస్తుంది.ఈ విన్యాసాలలో రాఫెల్, సుఖోయ్-30 MKI, మిరాజ్-2000, MiG-29, జాగ్వార్, C-130J సూపర్ హెర్క్యులస్, AN-32 రవాణా విమానం మరియు MI-17 V5 హెలికాప్టర్లు వంటి విమానాలు ఉంటాయి. యుద్ధం లేదా ఇతర జాతీయ అత్యవసర పరిస్థితుత్లో ఈ రన్వే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఐఏఎఫ్ విన్యాసాలు నిర్వహిస్తోంది. విజిబులిటీ తక్కుగా ఉన్న రాత్రి సమయాల్లో సురక్షిత ల్యాండింగ్, టేకాఫ్ నిర్ధారించేందుకు ప్రెసిషన్ అప్రోచ్ లైటింగ్, రీన్ఫోర్స్డ్ పేవ్మెంట్ స్ట్రెంగ్త్, CAT II ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS) సాంకేతికతను కలిగి ఉంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో గంగా ఎక్స్ప్రెస్ రన్వే ప్రారంభించడం గమనార్హం. ఈ కార్యక్రమం కోసం యూపీ సర్కార్ విస్తృతఏర్పాటు చేసింది. దాదాపుగా 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. గురువారం నుంచే ఈ మార్గాన్ని ఎయిర్ఫోర్స్ తన నియంత్రణలోకి తీసుకుంది.
తాజావార్తలు
-
MLA Chirri Balaraju: పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కార్యాలయంలో ఉద్రిక్తత..
-
Bengal: అసాంఘిక శక్తులకు అడ్డగా బెంగాల్ స్కూల్స్.. భారీగా నగదు, కండోమ్స్ స్వాధీనం
-
Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
-
KC Venugopal: కాంగ్రెస్లో టీఎంసీ విలీనంపై కీలక వ్యాఖ్యలు.. సోనియా-మమత భేటీపై కేసీ.వేణుగోపాల్ క్లారిటీ
-
Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు నలుగురు సభ్యులు ఏకగ్రీవ ఎన్నిక.. అధికారిక ప్రకటన
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!