Indian Air Force: గంగా ఎక్స్ప్రెస్ వేపై యుద్ధ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్.. ఉద్రిక్తల వేళ ఐఏఎఫ్ సత్తా..
- భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ సత్తా చాటిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్..
- గంగా ఎక్స్ప్రెస్వే రన్ వే ప్రారంభానికి అంతా సిద్ధం..
- హైవేపై యుద్ధవిమానాల విన్యాసాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Air Force: భారతదేశంలో మరో రోడ్ ‘రన్ వే’ని ఈ రోజు ప్రారంభించనున్నారు. భారత వైమానిక దళం ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్పూర్ జిల్లాలోని గంగా ఎక్స్ప్రెస్వే పై నిర్మించిన 3.5 కి.మీ పొడవైన ఎయిర్ స్ట్రిప్ని శుక్రవారం ప్రారంభించనుంది. ఇది దేశ రక్షణను మరింత పెంచుతుంది. అధునాతన లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ స్ట్రిప్పై యుద్ధ విమానాలు పగలు, రాత్రి ల్యాండింగ్ చేయవచ్చు. భారత్లో ఇలాంటి సదుపాయం ఉన్న ఎయిర్స్ట్రిప్లో ఇదే మొదటిది.
మీరట్-ప్రయాగ్ రాజ్లను కలిపే 594 కి.మీ పొడవైన గంగా హైవేపై జలాలాబాద్లో ఈ ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఈ ఎయిర్ స్ట్రిప్ పనులు దాదాపుగా 85 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే, యూపీలోని ఆగ్రా-లక్నో, పూర్వాంచల్, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ దిగేందుకు అనువుగా రన్వేలు రూపొందించారు. గంగా ఎక్స్ప్రెస్వే రన్ వే నాలుగోది.
Also Read
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
- Abhijeet Dipke: సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- EPFO గుడ్ న్యూస్.. PF ఖాతాల్లో వడ్డీ జమ.. మీ ఖాతాలో పడిందా? వెంటనే చెక్ చేసుకోండి
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
Read Also: Minister Nara Lokesh: వంద పాకిస్థాన్లకు సమాధానం చెప్పే మిస్సైల్ మనదగ్గర ఉంది..అందేంటో తెలుసా?
షాజహాన్పూర్ ఎయిర్స్ట్రిప్లో IAF రెండు దశల్లో ఫైటర్ జెట్ విన్యాసాలు నిర్వహిస్తుంది.ఈ విన్యాసాలలో రాఫెల్, సుఖోయ్-30 MKI, మిరాజ్-2000, MiG-29, జాగ్వార్, C-130J సూపర్ హెర్క్యులస్, AN-32 రవాణా విమానం మరియు MI-17 V5 హెలికాప్టర్లు వంటి విమానాలు ఉంటాయి. యుద్ధం లేదా ఇతర జాతీయ అత్యవసర పరిస్థితుత్లో ఈ రన్వే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఐఏఎఫ్ విన్యాసాలు నిర్వహిస్తోంది. విజిబులిటీ తక్కుగా ఉన్న రాత్రి సమయాల్లో సురక్షిత ల్యాండింగ్, టేకాఫ్ నిర్ధారించేందుకు ప్రెసిషన్ అప్రోచ్ లైటింగ్, రీన్ఫోర్స్డ్ పేవ్మెంట్ స్ట్రెంగ్త్, CAT II ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS) సాంకేతికతను కలిగి ఉంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో గంగా ఎక్స్ప్రెస్ రన్వే ప్రారంభించడం గమనార్హం. ఈ కార్యక్రమం కోసం యూపీ సర్కార్ విస్తృతఏర్పాటు చేసింది. దాదాపుగా 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. గురువారం నుంచే ఈ మార్గాన్ని ఎయిర్ఫోర్స్ తన నియంత్రణలోకి తీసుకుంది.
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?