Indian Air Force: భారతదేశంలో మరో రోడ్ ‘రన్ వే’ని ఈ రోజు ప్రారంభించనున్నారు. భారత వైమానిక దళం ఉత్తర్ ప్రదేశ్ షాజహాన్పూర్ జిల్లాలోని గంగా ఎక్స్ప్రెస్వే పై నిర్మించిన 3.5 కి.మీ పొడవైన ఎయిర్ స్ట్రిప్ని శుక్రవారం ప్రారంభించనుంది. ఇది దేశ రక్షణను మరింత పెంచుతుంది. అధునాతన లైటింగ్, నావిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేశారు. ఈ ఎయిర్ స్ట్రిప్పై యుద్ధ విమానాలు పగలు, రాత్రి ల్యాండింగ్ చేయవచ్చు. భారత్లో ఇలాంటి సదుపాయం ఉన్న ఎయిర్స్ట్రిప్లో ఇదే మొదటిది.
మీరట్-ప్రయాగ్ రాజ్లను కలిపే 594 కి.మీ పొడవైన గంగా హైవేపై జలాలాబాద్లో ఈ ఎయిర్ స్ట్రిప్ ఉంది. ఈ ఎయిర్ స్ట్రిప్ పనులు దాదాపుగా 85 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే, యూపీలోని ఆగ్రా-లక్నో, పూర్వాంచల్, బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్వేలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్స్ దిగేందుకు అనువుగా రన్వేలు రూపొందించారు. గంగా ఎక్స్ప్రెస్వే రన్ వే నాలుగోది.
Read Also: Minister Nara Lokesh: వంద పాకిస్థాన్లకు సమాధానం చెప్పే మిస్సైల్ మనదగ్గర ఉంది..అందేంటో తెలుసా?
షాజహాన్పూర్ ఎయిర్స్ట్రిప్లో IAF రెండు దశల్లో ఫైటర్ జెట్ విన్యాసాలు నిర్వహిస్తుంది.ఈ విన్యాసాలలో రాఫెల్, సుఖోయ్-30 MKI, మిరాజ్-2000, MiG-29, జాగ్వార్, C-130J సూపర్ హెర్క్యులస్, AN-32 రవాణా విమానం మరియు MI-17 V5 హెలికాప్టర్లు వంటి విమానాలు ఉంటాయి. యుద్ధం లేదా ఇతర జాతీయ అత్యవసర పరిస్థితుత్లో ఈ రన్వే సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఐఏఎఫ్ విన్యాసాలు నిర్వహిస్తోంది. విజిబులిటీ తక్కుగా ఉన్న రాత్రి సమయాల్లో సురక్షిత ల్యాండింగ్, టేకాఫ్ నిర్ధారించేందుకు ప్రెసిషన్ అప్రోచ్ లైటింగ్, రీన్ఫోర్స్డ్ పేవ్మెంట్ స్ట్రెంగ్త్, CAT II ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ILS) సాంకేతికతను కలిగి ఉంది.
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో గంగా ఎక్స్ప్రెస్ రన్వే ప్రారంభించడం గమనార్హం. ఈ కార్యక్రమం కోసం యూపీ సర్కార్ విస్తృతఏర్పాటు చేసింది. దాదాపుగా 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. గురువారం నుంచే ఈ మార్గాన్ని ఎయిర్ఫోర్స్ తన నియంత్రణలోకి తీసుకుంది.