Tejas MK1A: తేజస్ ఇంజిన్ డెలివరీ ఆలస్యం.. అమెరికన్ కంపెనీకి భారత్ భారీ జరిమానా..
- తేజస్ విమానాలకు ఇంజిన్లు ఆలస్యం..
- జీఈ ఏరోస్పేస్ కంపెనీపై భారత్ భారీ ఫెనాల్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejas MK1A: స్వదేశీ తయారీ యుద్ధ విమానం తేజస్ MK1A కోసం ఇంజిన్లను అందించే అమెరికన్ కంపెనీ జీఈ ఏరోస్పేస్ కంపెనీపై భారత్ భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. జనరల్ ఎలక్ట్రిక్(GE) ఏరోస్పేస్ తేజస్ కోసం F404-IN20 ఇంజిన్లను అందించడంలో విఫలమైంది. నిజానికి జీఈ 2023లోనే ఇంజిన్ల డెలివరీ ప్రారంభించాలి. చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్రమోడీతో పాటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటనల సందర్భంగా ఆలస్యాన్ని లేవనెత్తినట్లు నివేదికలు తెలిపాయి.
తేజస్ విమానాల తయారీ వేగంపై భారత వైమానిక దళం (IAF) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆగస్టులో పలు నివేదికలు పేర్కొన్నాయి. మొదటి విమానం మార్చి 31, 2024 నాటికి ఐఏఎఫ్కి అందించాలి. అయితే, తేజస్ తయారీదారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) నవంబర్ 2024కి డెలివరీని అంచనా వేసింది. ఆగస్టు నాటికి జీఈ ఏరోస్పేస్ F404 ఇంజిన్ల డెలివరీ ఒక సంవత్సరం పాటు ఆలస్యం చేసింది. సప్లై చైన్ సమస్యల వల్ల ఆలస్యం అయినట్లు కంపెనీ నివేదించింది. అయితే, మార్చి 2023 నాటికే ఇంజిన్ల డెలివరీ ప్రారంభించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మార్చి లేదా ఏప్రిల్ 20254 నాటికి డెలివరీ ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది.
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
Read Also: PM Modi: ఢిల్లీ-బెంగాల్ సీనియర్ సిటిజన్లకు ప్రధాని క్షమాపణ..
ఇంజిన్ల డెలివరీలో జాప్యం కారణంగా ఐఏఎఫ్ పోరాట సంసిద్ధతపై ప్రభావం పడుతోంది. తేజస్ విమానాల తయారీ వేగాన్ని పెంచాలని హెచ్ఏఎల్ని కోరింది. ఈ నేపథ్యంలోనే జీఈ కంపెనీకి వ్యతిరేకంగా భారత్ భారీ ఫెనాల్టీ విధించినట్లు తెలుస్తోంది. ఒప్పందంలోని నిబంధనల ప్రకారమే ఆలస్యానికి పలుమార్లు ఫెనాల్టీలనున వేసినట్లు తెలుస్తోంది. జీఈ, హెచ్ఏఎల్ 2021 ఆగస్టు ఒప్పందం ప్రకారం.. 99 ఇంజిన్లను సరఫరా చేయాల్సి ఉంది.
డెలివరీల జాప్యంలో అమెరికా ఒత్తిడి వ్యూహాలు ఏమీ లేవని ప్రభుత్వ వర్గాలు తెలపుతున్నాయి. ఈజీ టై-అప్ అయిన దక్షిణ కొరియా సంస్థ ఆర్థిక సమస్యల కారణంగా ఇంజిన్ విడిభాగాలను అందించలేకపోయిందని చెప్పారు. దీనికి పరిష్కారంగా ఆ టెక్నాలజీని భారత్కి అందించాలని, వాటిని ఇక్కడే తయారు చేయవచ్చని ప్రభుత్వం జీఈకి తెలిపింది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..