Operation Sindoor: శభాష్ భారత సైన్యం.. చిటికెడు సింధూరం ఎంత విలువైందో పాకిస్థాన్కు అర్థమైంది?
- భారత్ దెబ్బకు పాకిస్థాన్కు చుక్కలు
- నవ వధువుల బొట్టు చెరిపేసిన ఉగ్రవాదులు
- ప్రతీకారం తీర్చుకున్న భారత సైన్యం
- పాకిస్థాన్ ఉగ్రవాదులను మట్టి కరిపించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడితో భారత్ రగిలిపోయింది. దీని ప్రతీకార చర్యను పాకిస్థాన్ గుర్తించలేక పోయింది. కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ఉగ్రవాదులను అంతం చేయడంలో భారత్ సఫలమైంది. భారత సైన్యం దూకుడు విధానాన్ని పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోదు. ఈ వైమానిక దాడి సంవత్సరాల తరబడి పాకిస్థాన్లో ప్రతిధ్వనిస్తుంది. ఈ దాడిలో అత్యంత భయంకరమైన ఉగ్రవాది మౌలానా మసూద్ అజార్ కుటుంబీకుల రక్తం చిందింది. వందలాది మందిని పొట్టన బెట్టుకున్న ఈ మూర్ఖుడు తన కుటుంబీకుల్లో పది మందిని పోగొట్టుకోగానే కన్నీరు కారుస్తున్నాడు.
READ MORE: Mock Drill: సైరన్ మోగిన వెంటనే ఏం చెయ్యాలంటే?
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ఈ దాడి తర్వాత.. చిటికెడు సింధూరం ఖరీదు పాకిస్థాన్లో ఊహకు కూడా అంద లేదు. భారతీయ మహిళల జీవితాల్లో ఈ బొట్టు ప్రాముఖ్యతను భారత సైన్యం పాకిస్థాన్కు తెలిసేలా చేసింది. చిటికెడు సింధూరం ఉగ్రవాదంపై యుద్ధానికి నాంది పలికిందనే చెప్పాలి. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు హిందువులను ఎంచుకుని చంపారు. చాలా మంది మహిళలను వితంతువులుగా చేశారు. ఒక నవవధువు భర్తను ఆమె ముందే కాల్చి చంపారు. ఉగ్రవాదులు ఆ మహిళతో ‘వెళ్లి మోడీకి చెప్పు’ అన్నారు. దీనిని మోడీ సీరియస్గా తీసుకున్నారు. సిందూరానికి హిందూ మతంతో విడదీయరాని సంబంధం ఉంది. అంతేకాకుండా.. ఉగ్రవాదులు మహిళల నుదుటన సిందూరాన్ని చెరిపేశారు. పెళ్లై నెలలు కూడా గడవక ముందే నవ వధువులు వితంతువులుగా మారారు. దీనిని భారత్ భరించలేకపోయింది. అందుకే ఈ ఆపరేషన్కు సిందూర్ అని పేరు పెట్టారు.
READ MORE: Pakistan: భారత్పై యుద్ధానికి సిద్ధమైన పాక్.. దేశాన్ని ఉద్దేశించి పీఎం షెహబాజ్ షరీఫ్ ప్రసంగం..
అలాగే ఈ ఆపరేషన్లో మరో విశేషం ఉంది. ఈ ఆపరేషన్ వివరాలను కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్లు వెల్లడించారు. చరిత్రలో తొలిసారి మిలిటరీ ఆపరేషన్ సంగతులను మహిళా అధికారులు వెల్లడించడం విశేషం. ఈ ఆపరేషన్కు కూడా ‘సిందూర్’ అని పేరు పెట్టి బలమైన సందేశం ఇచ్చారు. ఈ ఉగ్ర దాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీనిని చూడొచ్చు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!