Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. కేవలం నాలుగు రోజుల్లోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. అయితే, ఈ ఆపరేషన్ గురించిన వివరాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. భారత్ చెప్పినదాని కన్నా దాడి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు పాకిస్తాన్ పత్రాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం సాధించి ఒక నెల గడవడంతో నేషనల్ సెక్యూరిటీ ప్లానర్స్, మిలిటరీ అధిపతులు శనివారం సాయంత్రం వేడుకలు చేసుకున్నారు.
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా, భారతదేశం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. పాక్కి చెందిన అనేక సైనిక, ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. మే 6-7 రాత్రి నుంచి మే 10 వరకు భారత వైమానిక దళం (IAF) జరిపిన దాడుల్లో పాకిస్థాన్ భారీ నష్టాలను చవిచూసింది. ఈ దాడిలో పాకిస్థాన్కు చెందిన 6 పీఏఎఫ్ యుద్ధ విమానాలు, 2 AWACS, 1 C-130 విమానం, 30 క్షిపణులు, అనేక డ్రోన్లు (UCAV)లు…
Air Chief AP Singh: ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం సత్తా చాటింది. ముఖ్యంగా, అత్యంత ఖచ్చితత్వంతో మిస్సైల్ అటాక్స్ చేసింది. అయితే, తాజాగా వైమానిక దళ అధిపతి అమర్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. రక్షణ రంగ ప్రాజెక్టుల్లో ఆలస్యంపై తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.”చాలాసార్లు, ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు ఆ వ్యవస్థలు ఎప్పటికీ రావని మాకు తెలుసు. కాలపరిమితి ఒక పెద్ద సమస్య.…
Pakistan: పాకిస్తాన్ చిరకాల మిత్రులు చైనా మరోసారి భారత్కి వ్యతిరేకంగా కుట్రలకు తెర తీసింది. ‘‘ఆపరేషన్ సిందూర్’’ తర్వాత చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ ఆర్మీకి శాటిలైట్ సపోర్ట్ అందించేందు డ్రాగన్ కంట్రీ ముందుకు వచ్చింది. దీనిపై ఇరు దేశాల మధ్య గత వారం చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. చైనా తన బీడౌ ఉపగ్రహ వ్యవస్థలను పాకిస్తాన్ సైన్యం యాక్సెస్ చేయడానికి మే 16న చైనా, పాకిస్తాన్ సైనిక అధికారుల మధ్య వ్యూహాత్మక సమావేశం జరిగింది.
భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో ప్రధాని మోడీ ఏ అవకాశాన్ని వదిలిపెట్టలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశాన్ని సురక్షితంగా ఉంచే పని ప్రధాని మోడీ చేశారన్నారు. గాంధీనగర్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 2014 కి ముందు, ప్రతిరోజూ ఉగ్రవాద దాడులు జరిగాయని.. కానీ అప్పటి ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని విమర్శించారు. కానీ ఇప్పుడు అలా కాదని శత్రు దేశానికి తగిన సమాధానం చెబుతామన్నారు. సైన్యం ఇటుకలకు రాళ్లతో ప్రతిస్పందించిందని…
Viral Video: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్ని చావు దెబ్బ తీసింది. ఉగ్రవాదుల శిబిరాలపై భారత్ దాడి చేసిన తర్వాత, మన దేశ భూభాగాల్లోని పౌరులు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, విమానాలు, మిస్సైళ్లతో దాడులకు పాల్పడింది. అయితే, భారత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా వీటిని అడ్డుకున్నాయి.
Operation Sindoor: “ఆపరేషన్ సింధూర్” తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాలలో ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే, అమెరికా మధ్యవర్తిత్వం వహింపుతో ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు సమ్మతించాయి. అయితే, ఈ కాల్పుల విరమణ చేపట్టిన కొద్ది సేపటికే పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని బయటపెట్టింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆ దాడులను తిప్పికోట్టింది. ఇకపోతే పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత బోలెడు అబ్దాలు చెప్పింది. ఆ అబద్దాలను భారత సైన్యం ఆధారాలతో సహా నిరూపించింది.…
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్లో పాకిస్తాన్కి చెందిన ఫైటర్ జెట్లను భారత్ కూల్చివేసినట్లు ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్(డీజీఏం) ఆదివారం తెలిపారు. ఫైటర్ జెట్లు ఏ జనరేషన్ అని ఖచ్చితంగా చెప్పకున్నా, హైటెక్ ఫైటర్ జెట్లను కూల్చేసినట్లు తెలిపారు. పాక్ విమానాలు మన సరిహద్దుల్లోకి ప్రవేశించకుండా నిరోధించామని,
Indian Navy: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ జరిపిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ గురించి ఈ రోజు త్రివిధ దళాల అధికారులు మీడియాకు వెల్లడించారు. ఉగ్రదాడి తర్వాత అరేబియన్ సముద్రంలో భారత నేవీని మోహరించినట్లు వెల్లడించారు. కరాచీతో సహా సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను చేధించేందుకు పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నట్లు నేవీ వైస్ అడ్మినరల్ ఎఎన్ ప్రమోద్ తెలిపారు.
Operation Sindoor:‘ఆపరేషన్ సిందూర్’’ ఘటన అనంతరం తొలిసారిగా భారత త్రివిధ దళాలు మీడియా సమావేశంలో పాల్గొన్నాయి. ఈ సమావేశంలో భారతదేశ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ డీజీఎంఓ పాల్గొని అనేక ప్రశ్నలకు సమాధానాలను తెలిపారు. ఈ కీలక సమావేశంలో భారత్ పాకిస్తాన్ కు హెచ్చరిక జారీ చేసింది. అమెరికా దేశ మధ్యవర్తంగా శనివారం సాయంత్రం ఇరు దేశాల మధ్య ఏర్పడిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఉల్లంఘనల పట్ల భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం…