Fact-check: భారత వైమానిక స్థావరాలపై పాకిస్తాన్ దాడి.. నిజం ఏంటంటే..
- భారత వైమానిక స్థావరాలపై దాడి చేశామని పాక్ తప్పుడు వాదన..
- పాత శాటిలైట్ ఇమేజెస్తో నమ్మించే ప్రయత్నం..
- అసలు నిజాలు చెప్పిన తర్వాత నోరు మూసుకున్న దాయాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fact-check: ఆపరేషన్ సిందూర్లో భారత దాడిని తట్టుకోలేక కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ ఇంకా తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదు. 11వైమానిక స్థావరాలు , కీలక ఆయుధ వ్యవస్థలు నాశనమైనప్పటికీ తామే విజయం సాధించామంటూ ప్రగల్భాలకు పోతోంది. భారత్ చేతితో చావు దెబ్బ తిన్నప్పటికీ, విక్టరీ ర్యాలీల పేరుతో పాకిస్తాన్లోని ప్రముఖులు, ఆర్మీ సంతోష పడుతోంది. అక్కడి ప్రజల్ని బకరాలను చేయడానికి ఇదంతా చేస్తోంది.
ఇదిలా ఉంటే, తాము భారత వైమానిక స్థావరాలపై దాడులు చేశామంటూ కొన్ని పాకిస్తాన్ నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే, వీటిని జియో ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ కొట్టిపారేశాడు. పాకిస్తాన్, భారత్లోని ఆడంపూర్ ఎయిర్బేస్పై దాడులు చేసినట్లు చెప్పుకుంటోంది. ఈ స్థావరంలోని సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాన్ని ధ్వంసం చేసినట్లు చెబుతోంది. సైమన్ అసలు నిజాన్ని వెలుగులోకి తేవడంతో ఇప్పుడు పాకిస్తాన్ మళ్లీ సైలెంట్ అయింది. నిజానికి పాక్ పేర్కొంటున్న శాటిలైట్ ఇమేజ్ భారత్-పాక్ సంఘర్షణకు రెండు నెలల ముందు అంటే మార్చి 2025లో తీసింది. మిగ్-29 మెయింటనెన్స్ సమయంలో తీసిన ఫోటోగా తేల్చారు. ఇంజిన్ టెస్ట్ ప్యాడ్ దగ్గర నల్లటి మసి కనిపించడం సాధారణమని చెప్పారు.
Also Read
Read Also: Asian Suniel : ఏషియన్ సునీల్ సంచలనం..ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడి పదవికి రాజీనామా
పాకిస్తాన్ ఇలాగే గుజరాత్ లోని భుజ్ ఎయిర్బేస్ లోని S-400 రాడార్ వ్యవస్థను నాశనం చేసినట్లు మరొక ఫోటోని ప్రసారం చేసింది. అయితే, ఈ చిత్రంలో మిలిటరీ అఫ్రాన్పై నల్లటి మరకల్ని చూపిస్తుంది. ఇది వాహన మెయింటనెన్స్ యార్డ్ దగ్గర ఉన్న ఆయిల్ మరకలుగా తేలింది. ఇది కూడా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కన్నా ముందే తీసినట్లు తేలింది. ఇక నలియా ఎయిర్బేస్పై కూడా తాము దాడి చేసినట్లు పాకిస్తాన్ చెప్పుకుంది. రన్వేపై ఉన్న చీకటిని బాంబు దాడిగా పేర్కొంది. నిజానికి అది మేఘం అని విశ్లేషకులు తేల్చారు.
ఆదంపూర్ ఎయిర్బేస్ ప్రాముఖ్యత..
పాకిస్తాన్ తో గతంలో జరిగిన ఘర్షణల్లో ఆదంపూర్ ఎయిర్బేస్ కీలక పాత్ర పోషించింది. పాక్ సరిహద్దు నుంచి ఇది కేవలం 100 కి.మీ దూరంలో ఉంది. 1965 భారత్-పాక్ యుద్ధంలో పాక్ దీనిని టార్గెట్ చేసింది. ఈ వైమానిక స్థావరంలో సుఖోయ్ -7, మిగ్-21 వంటి కీలకమైన విమానాలు ఉన్నాయి. మొదటి ఎస్ -400 వైమానిక రక్షణ యూనిట్ 2022లో ఆడంపూర్ వైమానిక స్థావరంలో మోహరించబడింది. ప్రస్తుతం, ఇది మిగ్ -29లు మరియు సు -30 ఎంకెఐలతో సహా IAF యొక్క కొన్ని ప్రధాన ఫైటర్ స్క్వాడ్రన్లను కలిగి ఉంది.
New report alleges a direct hit at India's Adampur Air Base by Pakistan damaged a Su-30, however a review reveals this image taken in March 2025, pre-conflict actually shows a MiG-29 undergoing maintenance, the dark soot near the engine test pad is routine, not battle damage pic.twitter.com/GOC1NVRX9I
— Damien Symon (@detresfa_) June 8, 2025
An image is being circulated now as a Pakistan destroyed S-400 radar in India, a review however indicates it's likely just oil stains at Bhuj military base's vehicle service yard, also the image predates the recent Indo-Pak conflict as it was taken in February 2025 pic.twitter.com/Y850jfk4n9
— Damien Symon (@detresfa_) June 6, 2025
A new image of Naliya Airbase in India, dated 12 May 2025 is being circulated highlighting the darkening of soil around the runway as damage, however verification of the image reveals a shadow of a cloud overhead as the reason behind this apparent discoloration on ground pic.twitter.com/Xt0YyHFV1o
— Damien Symon (@detresfa_) May 15, 2025
An image now circulating claims to show damage at Srinagar Airport as a result of the recent India-Pakistan conflict, however, a review with multiple recent images shows inconsistencies, no such damage is found at the airport, this image was likely manipulated or misinterpreted pic.twitter.com/MwMYBwRnUg
— Damien Symon (@detresfa_) June 2, 2025
తాజావార్తలు
-
Vizag: విశాఖలో ఘోర విషాదం.. పెళ్లి దండలతోనే నవ వధువు మృతి
-
Pawan Kalyan : పొదుపు చర్యలపై ప్రజలకు ఇబ్బంది కలగొద్దు..!
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?