Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Destruction In Pakistan With 19 Brahmos Missiles And S 400 Systems Operation Sindoor Continued Like This

Operation Sindoor: 19 బ్రహ్మోస్ మిస్సైల్స్, S-400 సిస్టమ్స్‌లతో పాకిస్తాన్‌లో విధ్వంసం.. ‘‘సిందూర్’’ సాగింది ఇలా..

Published Date :June 8, 2025 , 4:56 pm
By BV Reddy
  • 19 బ్రహ్మోస్ క్షిపణులు, ఎస్-400తో పాకిస్తాన్‌లో విధ్వంసం..
  • పాక్ ఎయిర్ బేస్‌లతో సహా ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు..
  • ఆపరేషన్ సిందూర్‌లో సంచలన విషయాలు..
Operation Sindoor: 19 బ్రహ్మోస్ మిస్సైల్స్, S-400 సిస్టమ్స్‌లతో పాకిస్తాన్‌లో విధ్వంసం.. ‘‘సిందూర్’’ సాగింది ఇలా..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. కేవలం నాలుగు రోజుల్లోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. అయితే, ఈ ఆపరేషన్ గురించిన వివరాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. భారత్ చెప్పినదాని కన్నా దాడి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు పాకిస్తాన్ పత్రాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం సాధించి ఒక నెల గడవడంతో నేషనల్ సెక్యూరిటీ ప్లానర్స్, మిలిటరీ అధిపతులు శనివారం సాయంత్రం వేడుకలు చేసుకున్నారు.

ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 6 క్రిస్టల్ మేజ్ క్షిపణులతో పాకిస్తాన్ మురిడ్కేలోని లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. బహవల్పూర్‌లోని జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని 6-7 స్కాల్ప్ క్షిపణులతో భారత్ నేలమట్టం చేసినట్లు తెలిసింది. ఆపరేషన్ సమయంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) యుద్ధ విమానాలు, సర్ఫేస్ టూ ఎయిర్(ఎస్ఏఎం) క్షిపణులు, ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థలు నాలుగు పాకిస్తాన్ నిర్మిత యుద్ధ విమానాలను, రెండు పెద్ద విమానాలు (బహుశా సీ-130జే, సాబ్ 2000 అవాక్స్ సిస్టమ్)ని కూల్చివేసినట్లు తెలుస్తోంది.

పాకిస్తాన్‌లోని సర్గోద, రఫికి, జకోబాబాద్, నూర్ ఖాన్ (చక్లాలా, రావల్పిండి)తో సహా 11 పాక్ ఎయిర్ బేస్‌లపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జరిపిన దాడుల్లో 2 ఎఫ్-16 యుద్ధ విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సంఘర్షణలో ఎస్-400 సిస్టమ్ మూడు శత్రు విమానాలను కూల్చేసింది. మే 10న జరిగిన ప్రతీకార దాడిలో పాకిస్తాన్ చక్లాలా నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌లోని ఒక చైనీస్ LY-80 ఫైర్ రాడార్, రెండు AN/TPQ-43 US-నిర్మిత ఆటోమేటిక్ ట్రాకింగ్ రాడార్‌లు మరియు చైనీస్ HQ-9 రాడార్ యొక్క ఒక ఫైర్ యూనిట్‌ను ధ్వంసమైనట్లు సమాచారం.

Read Also: Tragedy : సె*క్స్‌కు ఒప్పుకోలేదు.. అందుకే చంపేశాం.. సూట్‌కేస్‌లో బాలిక మృతదేహం కేసులో సంచలనం

పాకిస్తాన్ భారత్‌పైకి చైనీస్ తయారీ 180 కి.మీ పరిధిని కలిగి ఉన్న PL-15 ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని ప్రయోగించింది. అయితే, భారత రక్షణ వ్యవస్థలు వీటిని అడ్డుకున్నాయి. భారత్ 19 బ్రహ్మోస్ క్షిపణులను ఉపయోగించిందని, అంతే సంఖ్యలో స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణలను ప్రయోగించినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా పాకిస్తాన్ చైనీస్ తయారీ JF-17 యుద్ధ విమానాలను ఉపయోగించి భారత వైమానిక స్థావరాలపై CM-400 AKG వైమానిక-ప్రయోగించిన సూపర్‌సోనిక్ క్షిపణులను ప్రయోగించారు. అయితే, ఇవి మనకు ఎలాంటి నష్టాలను కలిగించలేకపోయాయి.

పాకిస్తాన్ పెద్ద సంఖ్యలో ప్రయోగించిన టర్కీ-నిర్మిత YIHA లాయిటరింగ్ మందుగుండు సామగ్రిని భారత ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్ జామ్ చేసింది. దీంతో వాటి లక్ష్యాలు తప్పిపోయాయి. భారతదేశ వైమానిక రక్షణ వ్యవస్థలు వీటిని కూల్చేశాయి. పాకిస్తాన్ ప్రయోగించిన ఫతే-1 క్షిపణిని కూడా మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయి.

మే 7న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ జరిపిన దాడిలో మర్కజ్-ఎ-తైబా (మురిడ్కేలోని ఎల్‌ఇటి ప్రధాన కార్యాలయం) నాలుగు నుండి ఐదు క్రిస్టల్ మేజ్ క్షిపణులను ఉపయోగించింది. మర్కజ్-ఎ-సుభాన్ అల్లాహ్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ స్థావరంపై రాఫెల్ యుద్ధ విమానాల నుండి ప్రయోగించబడిన ఆరు స్కాల్ప్ క్షిపణులు దాడి చేశాయి, బంకర్-బస్టింగ్ పద్ధతులను ఉపయోగించి అత్యంత ఖచ్చితత్వంతో జరిపిన దాడిలో పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి. మే 7న ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడానికి భారత వైమానిక దళం, భారత నేవీ ఇజ్రాయెల్ లాయిటరింగ్ మందుగుండు సామగ్రిని ఉపయోగించాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Air Defence System
  • Indian Air Force
  • loitering ammunition
  • Operation Sindoor
  • Pahalgam terror attack

తాజావార్తలు

  • Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

  • Off The Record : తంబళ్లపల్లి టీడీపీలో వర్గపోరు.. ఇంచార్జ్ పోస్ట్ కోసం ఫైట్..!!

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

  • Tragedy : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి..!

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions