Operation Sindoor: పాకిస్తాన్ను బకరా చేసిన భారత్.. ఇలాంటి మోసం నేనెప్పుడూ చూడలేదు..
- భారత్ చేతిలో బకరా అయిన పాకిస్తాన్..
- రాఫెల్ X-గార్డ్ వ్యవస్థతో బోల్తా కొట్టిన పాక్ ఎయిర్ ఫోర్స్..
- భారత యుద్ధ తంత్రంపై అమెరికా మాజీ సైనికుడి ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’లో భారత్, పాకిస్తాన్ పై సాధించిన విజయం ఇప్పుడు పలు వార్ కాలేజీల్లో, పలు దేశాల ఆర్మీల్లో అధ్యయన అంశంగా మారింది. పాకిస్తాన్ వైమానిక దళాన్ని కేవలం 4 రోజుల్లోనే భారత్ సైన్యం అచేతనంగా మార్చింది. అయితే, ఈ సంఘర్షణ సమయంలో భారత్, పాకిస్తాన్ని బకరా చేసిందని ఇప్పుడు అమెరికా వైమానిక దళ మాజీ F-15E, F-16 పైలట్ అయిన ర్యాన్ బోడెన్హైమర్ చెప్పారు. భారత్ నిర్వహించిన వైమానిక పోరాటం ఆధునిక ఎయిర్ కాంబాట్లో ఒక పురోగతిగా అభివర్ణించారు.
ముఖ్యంగా, భారత్ ‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)’’ ఆధారిత సాంకేతికతను ఉపయోగించినట్లు బోడెన్ హైమర్ చెప్పారు. రాఫెల్ X-గార్డ్ డెకాయ్ వ్యవస్థతో పాకిస్తాన్ వైమానికి ముప్పును తప్పించినట్లు పేర్కొన్నారు. X-గార్డ్ వ్యవస్థను రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది. ఇది 500-వాట్, 360-డిగ్రీల జామింగ్ సిగ్నల్ను ఉత్పత్తి చేయడానికి ఏఐ ఉపయోగిస్తుంది. ఈ పరికరం 30 కిలోలు ఉంటుంది. వంద మీటర్ల ఫైబర్ అప్టిక్ కేబుల్ సాయంతో విమానం వెనక ఉంటుంది. ఇది రాఫెట్ జెల్ రాడార్ సిగ్నల్స్, డాప్లర్ ఎఫెక్ట్ని కాపీ చేస్తుంది. దీంతో శత్రు దేశాల రాడార్ వ్యవస్థలు, క్షిపణులు నిజమైన విమానాన్ని గుర్తించడంతో విఫలమవుతాయి.
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
Read Also: Guru Purnima 2025: రేపే గురు పూర్ణిమ.. ఈ ఒక్క పనిచేస్తే చాలు మీ కష్టాలన్నీ తీరినట్టే!
ర్యాన్ బోడెన్ హైమర్ ప్రకారం, మనం ఇప్పటి వరకు చూసిన అత్యుత్తమ స్పూఫింగ్, మోసం అని, ఈ ఎలక్ట్రానిక్ యుద్ధ నియమాలను పునర్నిర్వచించిందని ఆయన భారత్ని ప్రశంసించారు. ఈ డెకోయ్ శత్రువుల రాడార్లను గందరగోళపరిచింది. పాకిస్తాన్ నిజమైన జెట్ ఏదో తెలుసుకోలేకపోయింది. చైనా నుంచి పాక్ దిగుమతి చేసుకున్న PL-15E క్షిపణికి స్పూఫింగ్ను ఎదుర్కొనే టెక్నాలజీ లేదు. దీంతో X-గార్డ్ పాకిస్తాన్ J-10C ఫైటర్ జెట్లలో ఉన్న KLJ-7A AESA రాడార్ను గందరగోళానికి గురిచేసింది. దీంతో పాకిస్తాన్ తాము రాఫెల్ జెట్లను కూల్చామని భ్రమపడి ఉండొచ్చని అమెరికన్ నిపుణుడు చెప్పాడు.
X-గార్డ్ పాత యూఎస్ వ్యవస్థల కన్నా వేగంగా పనిచేస్తుంది. దీని మూలంగానే పాకిస్తాన్ తాము రాఫెల్ జెట్లను కూల్చామని చెప్పి ఉండొచ్చు. ఈ వ్యవస్థ విమానం వెనక 100 మీటర్ల దూరంలో ఉంటుంది. దీని వల్ల శత్రువులు దీనినే విమానంగా పొరబడి కాల్పులు జరుపుతారు. విమానం, డెకాయ్ వ్యవస్థ మధ్య ఉండే ఫైబర్ ఆప్టిక్ ద్వారా రియల్ టైమ్లో మిస్సైల్ యాక్టివిటీని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.
తాజావార్తలు
-
NIA Raids : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. రామగుండంలో NIA మెరుపు దాడులు
-
Off The Record: ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు కేటీఆర్ వార్నింగ్..?
-
AP Liquor Scam Case: కారుమూరి అరెస్ట్పై ఈడీ కీలక ప్రకటన
-
Chairmans Desk : కాంగ్రెస్లో పాతకథ పునరావృతమౌతోందా.. రేవంత్ తక్షణ కర్తవ్యమేంటి..?
-
OTR: ప్రభాకర్ చౌదరి ఆరోపణలకు స్పందించని ఎమ్మెల్యే దగ్గుబాటి.. కారణం ఇదేనా..?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!