టీ 20 వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లలో భాగంగా ఇవాళ టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెల్సిందే. అయితే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే… ముగిసింది. ఇందులో టాస్ నెగ్గిన ఆసీస్… మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బౌలింగ్ చేయనుంది టీమిండియా జట్టు. ఇక జట్ల వివరాల్లోకి వెళితే… ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (సి), మిచెల్ మార్ష్, స్టీవెన్…
శీతాకాలం ఆరంభానికి ముందే హిమాచల్ ప్రదేశ్, హిమాలయ ప్రాంతాల్లో మంచు కురుస్తున్నది. మంచుదుప్పట్లు కప్పేయడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక, ఇండియా చైనా బోర్డర్లో శీతాకాలంలో ఉష్ణోగ్రతలు మైనస్ కి పడిపోతాయి. అలాంటి సమయంలో అక్కడ పహారా నిర్వహించడం అంటే చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది. ఎంతటి కఠినమైన, దుర్భరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ తట్టుకొని భారత సైనికులు కాపలా కాస్తుంటారు. అయితే, ఇటీవలే ఇండియా చైనా దేశాల మధ్య 13వ విడత సైనిక కమాండర్ల స్థాయి…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్లో వేగంగా జరుగుతోంది. వ్యాక్సిన్ పంపిణీలో అరుదైన రికార్డుకు భారత్ అడుగు దూరంలో ఉంది. దేశంలో ఇప్పటి వరకు 99కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 99 కోట్ల డోసులు దాటినట్లు… కేంద్ర మంత్రి మన్సుక్ మాండవీయ ట్వీట్ చేశారు. ఇవాల్టితో..1 00కోట్ల డోసులు పూర్తి కానున్నాయి. అదే జరిగితే చైనా తర్వాత 100కోట్ల డోసులు పంపిణీ చేసిన రెండో దేశంగా భారత్ అరుదైన…
భారత్లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 14,623 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 197 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు.. ఇదే సమయంలో 19,446 మంది పూర్తిస్థాయిలో కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు బులెటిన్లో పేర్కొంది కేంద్రం.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,41,08,996కు చేరుకోగా.. కోలుకున్నవారి సంఖ్య 3,34,78,247గా ఉంది..…
బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతున్న పట్టించుకోవడం లేదని ఆదేశ రచయిత్రి తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా పై మండిపడ్డారు. బంగ్లాదేశ్లో ఇస్లామిక్ మత చాంధస్స వాదులు హిందువుల ఇళ్లను, షాపులను నాశనం చేశారన్నారు. వారికి న్యాయం చేయాలన్నారు. ప్రధాని షేక్ హసీనా మత చాంధస్స వాదంలోకి వెళ్తున్నారని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు. బంగ్లాదేశ్లో హిందువులు, బౌద్ధులు ఉన్నారని వారిపై దాడులు సరికాదన్నారు. బంగ్లాదేశ్లో కేవలం ముస్లింలే కాకుండా ఇతర మతాల వారు…
టీ 20 ప్రపంచకప్లో టీమిండియా కూర్పు ఎలా ఉంటుందో అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. యూఏఈలో పిచ్లు స్పిన్కు ఎక్కువగా అనుకూలిస్తున్న నేపథ్యంలో ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలా లేదా ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలా అన్న అంశంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లండ్తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మను ఆడించకుండా ఇషాన్ కిషన్ను పరీక్షించారు. ఈ టెస్టులో నూరు శాతం ఇషాన్ పాసయ్యాడు. ముఖ్యంగా…
దేశంలో కరోనా వైరస్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. దీంతో దేశమంతటా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ కరోనా టీకాను తప్పనిసరిగా తీసుకుంటున్నారు. రేపటితో భారత్లో కరోనా టీకాల డోసులు 100 కోట్లకు చేరుకోనున్నాయి. 130 కోట్ల భారతావనిలో ఇప్పటివరకు 70 కోట్ల మంది ప్రజలు కరోనా టీకా తొలి డోస్, 29 కోట్ల మంది ప్రజలు సెకండ్ డోస్లను వేయించుకున్నారు. భారత్లో జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన…
దేశ వ్యాప్తంగా టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో టమోటా పంటలు దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా టమోటా పంటలు ఎక్కువగా పండే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ఈ నేపథ్యంలో రైతులు తమ నష్టాన్ని ధరలు పెంచి భర్తీ చేసుకుంటున్నారు. అకాల వర్షాల వల్ల టమోటాల సరఫరా తక్కువ కావడంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యమైన వెజిటబుల్…
కాలాన్ని సూచించడానికి మన పూర్వీకుల దగ్గరి నుంచి నేటి జనరేషన్ వరకు కూడా క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని మాట్లాడేవాళ్లు. అయితే ఎప్పుడైతే కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఆ పిలుపుకు బ్రేక్ పడినట్లే కన్పిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా మహమ్మరి ఎప్పుడైతే ఆ దేశాన్ని వీడి ప్రపంచానికి పాకిందో అప్పటి నుంచి కరోనా పేరు మార్మోమోగిపోయింది. ఇది సృష్టించిన బీభత్సం తలుచుకుంటేనే వెన్నులో వణుకుపట్టడం ఖాయం. కోవిడ్-19 ఎఫెక్ట్ తో ఇప్పుడంతా కరోనాకు…
రానున్న మూడు రోజులు 20 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించిది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో… రానున్న రెండు మూడు రోజుల్లో వాయువ్య, ఈశాన్య రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిస్తాయని తెలిపింది. అక్టోబరు 18 నుంచి 20 మధ్య నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీవర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రాంతాల్లో గంటకు 40…