మనదేశంలో తొలి బుల్లెట్ బండిని వాడింది ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు ఎక్కడ చూసినా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి కనిపిస్తోంది. ఈ బండిపై వస్తున్న పాటలు ఫేమస్ అవుతున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి వచ్చిన ఈ బుల్లెట్ బండ్లు మొదట తయారైంది ఇంగ్లాండ్ దేశంలో. ఇంగ్లాండ్ లోని రెడిచ్ పట్టణంలోని హంట్ ఎండ్ అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో సూదులు, సైకిల్ సీట్లు, పెడళ్లు వంటి వాటిని తయారు చేసే జార్జి టౌన్సెండ్ అండ్ కో అనే కంపెనీ ఉండేది. 1891 వరకు బాగా నడిచిన కంపెనీ ఆ తరువాత అప్పులపాలైంది. అప్పులు పాలవ్వడంతో ది ఈడీ మ్యానుఫ్యాక్చరింగ్ అనే కంపెదీ దానిని కొనుగోలు చేసింది.
ఆ తరువాత ఆ కంపెనీకి బ్రిటన్ నుంచి ఆయుధాలు తయారు చేసే ఆర్డర్లు రావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఆయుధాలు తయారు చేసే కర్మాగారంగా మారడంతో ది ఈడీ కంపెనీ పేరును రాయల్ ఎన్ఫీల్డ్ గా మార్చేశారు. ఆయుధాలతో పాటుగా నాలుగు చక్రాలతో కూడిన రాయల్ ఎన్ఫీల్డ్ను తయారు చేశారు. అంతగా ఫేమస్ కాకపోవడంతో మూడు చక్రాలతో కూడిన బండిని తయారు చేశారు. ఆ తరువాత రెండు చక్రాల బండి అందుబాటులోకి వచ్చింది. 1907 లో వివిధ రకాల ద్విచక్రవాహనాలను తయారు చేశారు. ద్విచక్రవాహానాలు ఆకట్టుకోవడంతో బ్రిటన్ ప్రభుత్వం తమ సైనికుల కోసం పెద్ద ఎత్తున వీటిని కోనుగోలు చేసింది.
Also Read
Read: కరెన్సీ నోట్లపై ముద్రించే గాంధీ బొమ్మ ఎక్కడిదో తెలుసా?
1930 వ వరకు వచ్చేసరికి 13 రకాల మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. అందులో నాలుగు వాల్వ్లు, సింగిల్ సిలిండర్తో కూడిన బండి అందుబాటులోకి వచ్చింది. దానికి బుల్లెట్ అని పేరు పెట్టారు. బుల్లెట్ బండి సౌండ్ ఆకట్టుకోవడంతో విపరీతమైన క్రేజ్ వచ్చింది. 1948లో మద్రాస్ మోటార్స్ సంస్థ ఇంగ్లాండ్కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్తో టైఅప్ అయ్యింది. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను ఇండియాకు తీసుకొచ్చింది ఈ కంపెనీ. ఈ బండి ఇండియాలోకి రాకముందు ట్రయంఫ్, బీఎస్ఏ వంటి మోటార్ సైకిళ్లను సైన్యం వినియోగించేది. అయితే, ఈ బండ్లు బొర్డర్ రోడ్లపై పహారా కాసేందుకు అనుకూలంగా ఉండేవి కాదు. రాయల్ ఎన్ఫీల్డ్కు చెందిన బుల్లెట్ బండి అందుబాటులోకి వచ్చిన తరువాత ఇండియన్ ఆర్మీ కోసం ఈ బండ్లను భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటిని భారత జవానులు తొలిసారిగా వినియోగించారు.
తాజావార్తలు
-
Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
-
AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
-
Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
-
Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..