ఇండియా వర్సెస్ పాక్ హైటెన్షన్ మ్యాచ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏ జట్ల మధ్య మ్యాచ్ కోసం… యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తుందో… ఆ క్షణం వచ్చేసింది. దాయాదుల మధ్య సమరానికి సమయం ఆసన్నమైంది. రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే.. ఆ రెండు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే ఆసక్తి చూపుతారు. కానీ… ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ జరుగుతుంటే… క్రికెట్ రుచి తెలియని దేశాలు సైతం టీవీలకు అతుక్కుపోయి చూస్తాయి. మిగతా దేశాలతో మ్యాచ్ ఆడితే గెలుపోటములను సమానంగా స్వీకరిస్తారు. కానీ.. దాయాది దేశంతో మ్యాచ్ అంటే.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగాల్సిందే. ఓ టీమ్ ఓడినా… యావత్ దేశం పరువు గంగలో కలిసినట్టుగా ఫీల్ అవుతారు. అదే… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ క్రికెట్ మ్యచ్.
రెండేళ్ల తర్వాత ఇండియా పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్. చివరగా జూన్ 16, 2019 లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్లో ఇండియా, పాక్ మధ్య మ్యాచ్ జరిగింది. క్వార్టర్ ఫైనల్ లో ఇండియా… పాక్ను చిత్తుగా ఓడించింది. 89 రన్స్ తేడాతో… పాక్ పై ఇండియా విజయం సాధించింది. ఆ మ్యాచ్ తర్వాత… ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ దాయాది దేశాలు తలపడబోతున్నాయి.
Also Read
- Prasidh Krishna: మేము బాగా బౌలింగ్ చేస్తే సరిపోదు.. ప్రసిద్ధ్ కృష్ణ కీలక వ్యాఖ్యలు!
- IND vs SL 2nd Test: భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలవొచ్చు.. ఎలా అంటే?
- Dhruv Jurel Tattoo: ‘జై జవాన్.. జై కిసాన్’ టాటూ.. అసలు విషయం చెప్పేసిన ధ్రువ్ జురెల్!
- Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ 'మెధావి బిధూరి'.?
ఈనెల 24వ తేదీ కోసం యావత్ క్రీడా లోకం ఎదురుచూస్తోంది…. ఈ సూపర్ సండే కోసం క్రికెట్ లవర్స్ తెగ తొందరపడుతున్నారు… !! ఎందుకు… ఏమిటి… ఏం జరగనుంది అనుకుంటున్నారా..! దుబాయ్ వేదికగా దాయాదుల మధ్య సమరం జరగబోతోంది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా.. ఇండియా పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
పాకిస్తాన్ ఇప్పటి వరకు వరల్డ్ కప్ మ్యాచ్లలో ఇండియాని ఓడించింది లేదు. వరల్డ్ కప్లో ఇండియా పాక్ 7 సార్లు తలపడగా… పాక్ ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేదు. ఏడు మ్యాచ్ల్లోనూ ఇండియాదే విజయం. టీ20 వరల్డ్ లో భాగంగా ఇప్పటివరకు రెండు దేశాలు 5 సార్లు హెడ్ టు హెడ్ తలపడగా… ఇండియా 4-0 తో ఆధిక్యం లో ఉంది. మరో మ్యాచ్ రద్దైంది. ఇప్పుడు మరోసారి ఈ రెండు దేశాలు తలపడనున్నాయి.
ఈనెల 24న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికంగా జరగనున్న ఇండియా పాక్ మ్యచ్ టికెట్లను ఐసీసీ 4వ తేదీ నుంచి అందుబాటులో ఉంచింది. సైట్ లో ఉంచిన గంటలోపే టికెట్లన్నీ ఐపోయాయి అంటేనే తెలుస్తోంది… ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారో.
తాజావార్తలు
-
Asim Munir: ఇరాన్ ముందు కీలక ప్రతిపాదనలు.. హార్ముజ్పై అమెరికా ఆఫర్ ఇదేనా?
-
Dr Priyanka హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులను కలిసిన కుటుంబ సభ్యులు!
-
Kiss Car: బాయ్ ఫ్రెండ్ కారుకు 3,400 ముద్దులు.. షాకిచ్చిన పోలీసులు
-
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్ట్పై రేవంత్ స్పీడ్.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Rafale vs J-16: రఫేల్తో చైనీస్ J-16 పోరాటం.. నిశితంగా గమనిస్తున్న భారత్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!