Gajendra Singh Shekhawat: గతంలో ఇండియా అంటే గాంధీ.. ఇప్పుడు మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ దేశాలకు గతంలో ఇండియా అంటే గాంధీ గుర్తుకు వచ్చేవారు.. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గుర్తుకు వస్తున్నారని తెలిపారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు.. కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. నరేంద్ర మోడీ లాంటి నేత మరెవరూ లేరన్న ఆయన.. ప్రపంచంలోనే అతి పెద్ద పొలిటికల్ పార్టీ బీజేపీ అన్నారు. అతి చిన్న పార్టీగా ప్రస్ధానం మొదలు పెట్టి.. అతి పెద్ద పార్టీగా అవతరించిందని.. అతి పెద్ద పార్టీగా అవతరించినా సిద్ధాంతాలను ఏనాడూ వదల్లేదని.. చివరి వరుసలో కూర్చొన్న వాళ్లకూ సంక్షేమ ఫలాలు అందేలా చూడడం మోడీ లక్ష్యంగా తెలిపారు గజేంద్ర సింగ్ షెకావత్.
Read Also: Venkaiah Naidu: చట్టసభల గౌరవాన్ని కాపాడండి..
Also Read
- Indrakeeladri: ఆషాఢ సారె ఉత్సవాలు.. ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు..
- AP Covid Cases: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. నేటికి ఆ సంఖ్య ఎంతకు చేరిందంటే..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ప్రపంచమంతా భారత్ వైపే చూస్తోందన్నారు షెకావత్.. ప్రపంచ దేశాలకు గతంలో ఇండియా అంటే గాంధీ గుర్తొచ్చే వారని.. ఇప్పుడు మోడీ గుర్తొస్తున్నారని తెలిపారు. మోడీ ప్రధాని కాక ముందు ప్రతి రోజూ బాంబ్ బ్లాస్టులు జరిగేవి.. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదన్న ఆయన.. గ్రామ, రైతులు, పీడిత ప్రజల అభివృద్ధే లక్ష్యంగా మోడీ పని చేస్తున్నారని తెలిపారు.. కేంద్ర పథకమైన జల్ జీవన్ మిషన్ పథకం అమలు ఏపీలో సరిగా జరగడం లేదని.. జల్ జీవన్ మిషన్ పథకం కింద ఏపీకి రూ. 7 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని తెలిపారు. ఇందులో కేంద్రం వాటా రూ. 3800 కోట్లు.. ఇప్పటి వరకూ జల్ జీవన్ మిషన్ కింద ఏపీ కేవలం రూ. 190 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని.. కేవలం 20 శాతం మాత్రమే జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఏపీలో అమలు చేశారన్నారు.. జల్ జీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు..? అని ప్రశ్నించిన కేంద్ర మంత్రి.. బెంగళూరులో జరిగే దక్షిణాది రాష్ట్రాల సదస్సులో ఈ అంశంపై ఏపీని ప్రశ్నిస్తాం అన్నారు. ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఇలాంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్న ఆయన.. నరేగా కింద రూ. 70 వేల కోట్ల నిధులను ఏపీకి ఇచ్చారని.. రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 64 వేల కోట్లు ఏపీకి ఇచ్చామని.. పేదలు మోడీ నాయకత్వం పట్ల మొగ్గు చూపుతున్నారని.. అద్భుతమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసింది మోడీ ప్రభుత్వమేనని.. దేశంలోని నూటికి నూరు శాతం గ్రామాల్లో విద్యుత్ వెలుగులు విరజిమ్ముతున్నాయని తెలిపారు.
తాజావార్తలు
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Prabhas: ఒకేసారి మూడు భారీ సినిమాలు.. మూడు డిఫరెంట్ పాత్రలు.. ఇదే డార్లింగ్ స్టామినా!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు
-
Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
-
Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!