ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ టెన్షన్ కాస్త తగ్గిపోయింది… భారత్లోనూ అన్ని ఆంక్షలు ఎత్తివేసింది ప్రభుత్వం.. పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతూ పోవడంతో.. కరోనా సమయంలో విధించిన రకరాల ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తూ వచ్చింది.. అయితే, భారత్లో కొత్తగా వెలుగు చూసిన కరోనా వేరియంట్ కలకలం సృష్టిస్తోంది.. ఒమిక్రాన్ రూపంలో భారత్లో థర్డ్ వేవ్ ప్రారంభమై మరోసారి కలవరపెట్టిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ముంబైలో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్ఈ తొలి కేసు నమోదైంది. దీంతో.. కేంద్ర ఆరోగ్య శాఖ…
గత నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ముద్ర గతంలో ఎన్నడూ లేనంత అల్ప స్థాయికి పడిపోయింది. దాంతో 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన రాజకీయ పార్టీ తన జాతీయ ప్రాముఖ్యతను కోల్పోతోందని అనిపిస్తోంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీల విస్తరణతో దశాబ్దాలుగా భారత రాజకీయాలపై గల తన ఆధిపత్య శక్తిని కోల్పోతోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ…
కరోనాకు పుట్టినిల్లయిన చైనా ఇప్పుడు మళ్ళీ కరోనా టెన్షన్ తో అతలాకుతలం అవుతోంది. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. చైనాలో సోమవారం 13 వేలకు పైగా కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. షాంఘైలోనో 70 శాతం కేసులు వెలుగులోకి రావడంతో చైనా అప్రమత్తం అయింది. కేసుల నివారణకు 2 వేల మంది సైన్యం, 15 వేలమంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు రంగంలోకి దిగారు. యుద్ధ ప్రాతిపదికన ఒక్కొక్కరికి రెండు పరీక్షలు…
మహిళల వరల్డ్ కప్ ముగియడంతో టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనపరిచిన ఆటగాళ్లతో ఐసీసీ ప్రత్యేకంగా ఓ జట్టును రూపొందించింది. ఈ మేరకు ఈ జట్టు వివరాలను సోమవారం ఐసీసీ ప్రకటించింది. అయితే ఐసీసీ జట్టులో భారత మహిళలకు చోటు దక్కలేదు. చివరకు బంగ్లాదేశ్ మహిళలకు కూడా ఈ జట్టులో చోటు దక్కడం గమనార్హం. ఐసీసీ ప్రకటించిన జట్టులో అత్యధికంగా ఆస్ట్రేలియా నుంచి నలుగురు ఆటగాళ్లకు.. ఇంగ్లండ్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఆటగాళ్లకు స్థానం…
కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య వరిధాన్యం విషయంలో యుద్ధం సాగుతూనే వుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు వ్యతిరేకంగా లోకసభలో ప్రివిలైజ్ మోషన్ నోటీస్ ఇచ్చారు టీఆర్ఎస్ ఎంపీలు. వరి ధాన్యం కొనుగోలు విషయమై పార్లమెంటు ను, దేశ ప్రజలని, రైతులను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుదోవ పెట్టించారని సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం (ప్రివిలేజ్ మోషన్) నోటీసులో పేర్కొన్నారు. నోటీసును స్పీకర్ ఓంబిర్లాకు అందజేశారు టీఆర్ ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు,కొత్త ప్రభాకర్…
మునుపెన్నడూ లేని విధంగా సూరీడు మండిపోతున్నాడు. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రంగా వుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. ఇవాళ్టి నుంచి 4 రోజులు తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత నెలలో 122 ఏళ్ల ఉష్ణోగ్రతల రికార్డు బద్దలయ్యాయి. ఈ నెలలో తొలి 10-15 రోజులు ఎండలు మండిపోయే అవకాశం ఉందని, ఆదివారం నుంచి బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. హిమాలయ పర్వతాల్లోనూ ఈసారి ఉన్నట్టుండి…
సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన శ్రీలంక. దేశవ్యాప్తంగా వివిధ సోషల్ మీడియా అకౌంట్లు బ్లాక్ ఏపీలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీల నియామకం రేపటి నుంచి అమలులోకి రానున్న కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు పాకిస్తాన్ లో ఇవాళ ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం. తేలనున్న భవితవ్యం విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం నిర్వహించనున్న మంత్రి అవంతి శ్రీనివాస్. ఈరోజు మత్స్య జయంతి. ఇవాళ్టి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం. నేటితో…
ఇండియాలో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 నుంచి 5 వరకు బెన్నెట్ భారత్లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో ఈ పర్యటన వాయిదా పడిందని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బెన్నెట్ ఐసోలేషన్లో ఉన్నారని.. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. తమ ప్రధాని భారత్లో పర్యటించే కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు కాగా ప్రధాని మోదీ…
టీమిండియా మాజీ ఆటగాడు, స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్లో మార్చి 29వ తేదీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే సెహ్వాగ్ తన తొలి ట్రిపుల్ సెంచరీని సాధించింది ఈరోజే. ఈ ట్రిపుల్ సెంచరీ సెహ్వాగ్కే కాదు టీమిండియాకు కూడా తొలి ట్రిపుల్ సెంచరీ. పాకిస్థాన్లోని ముల్తాన్ వేదికగా మార్చి 29, 2004న ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా మళ్లీ…
అంతా అయిపోయింది. మనం ఇక సేఫ్ అనుకోవడానికి అవకాశం లేదు. ప్రపంచాన్ని వణికించిన కరోనా…అదుపులోనే ఉందా? అంటే ఇంకా లేదనే చెప్పాలి. కొవిడ్ సృష్టించిన విలయం నుంచి దేశాలు కోలుకోలేకపోతున్నాయి. వైరస్ సోకిన వారిలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సమస్యలు వస్తున్నాయని నిపుణుల అధ్యయనాల్లో తేలింది. చైనాలో కోవిడ్ కేసులు 50 వేలకు పైగా నమోదవడం మరో మృత్యుఘంటికలు మోగిస్తోంది. యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి వణికించింది. ప్రస్తుతం కేసులు అదుపులోనే ఉన్నప్పటికీ… అది సృష్టించిన విలయం…