Amazon Satellite internet services in india: దేశంలో మరో టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం దేశంలో ప్రతి ఇంటికి ఇంటర్నెట్ సాధారణంగా మారిపోయింది. ఇంటర్నెట్ లేని ఇల్లు అనేది కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ అమెజాన్ మన దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసును అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సుమారు రూ. 80 వేల కోట్ల వ్యయంతో మొత్తంగా 3,236 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి వాటి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్…
ప్రపంచంలోని పలు దేశాల్లో మంకీపాక్స్ ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లో 14 వేల మంకీపాక్స్ కేసులు నమోదైనట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ బుధవారం చెప్పారు.
Alcohol Abusers in india: దేశవ్యాప్తంగా ఆల్కహాల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మేరకు దేశంలో ఎంతమంది మద్యం తాగుతున్నారు అన్న విషయంపై సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖకు చెందిన నషా ముక్తి అభియాన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది మద్యం తాగుతున్నట్లు సర్వే ద్వారా వెల్లడైంది. అంతేకాకుండా 3 కోట్ల మంది గంజాయి, 9.4 లక్షల మంది కొకైన్, 15.47 లక్షల మంది ఏటీఎస్ వాడుతున్నట్లు…
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ట్విటర్ వేదికగా ప్రధానిపై వ్యంగాస్త్రాలు సంధించారు. ద్రవ్యోల్భవణాన్ని నియంత్రిచలేని ప్రధానిని మీరేమంటారని ప్రశ్నించారు. అంతే కాకుండా దేశంలో చొరబాటును నియంత్రించలేక పోతున్న ఇలాంటి ప్రధానిని మీరేమని పిలుస్తారని నాలుగు ఆప్షన్లను కేటీఆర్ ట్వీటర్ వేదిగా ప్రశ్నించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా రెండో గ్రామాన్ని నిర్మించిందని, శాటిలైట్ ఫోటోలతో సహా మీడియా ప్రచురించిన కథనాలను కేటీఆర్ ట్వీట్ చేసారు. అయితే.. 2021లొ…
భారత త్రివిధ దళాల్లో ఉన్న ఖాళీలను కేంద్రం ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలి ఖాళీగా ఉన్నట్లు తెలిపింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా.. నేవీలో 13,537, ఎయిర్ఫోర్స్లో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది.
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. భారతదేశంలో 200 కోట్ల వ్యాక్సినేషన్లను అందించడంలో మరో మైలురాయిని సాధించినందుకు గానూ అభినందించారు. కొవిడ్ ప్రభావాన్ని తగ్గించినందుకు భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు, ప్రభుత్వంతో కొనసాగుతున్న భాగస్వామ్యానికి బిల్గేట్స్ ట్విట్టర్లో కృతజ్ఞతలు తెలిపారు.