Ripudaman Singh Malik: 1985 ఎయిర్ ఇండియా బాంబ్ దాడి.. దారుణ హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1985 ఎయిర్ఇండియా ఫ్లైట్ బాంబ్ దాడిలో ఆరోపణలు ఎదుర్కొని, ప్రధాన నిందితుడనే ఆరోపణలు ఉన్న రిపుదమన్ సింగ్ మాలిక్ దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా సర్రే ప్రాంతంలో ఆయన్న దుండగుడు కాల్చిచంపాడు. ఈ విషయాన్ని రిపుదమన్ సింగ్ కొడుకు జస్ప్రీత్ మాలిక్ ధ్రువీకరించారు. ఎయిర్ఇండియా బాంబు దాడిలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తిగా మా తండ్రిని ఎప్పడూ మీడియా సూచిస్తుందని.. తన తండ్రిపై జరిగిన దాడితో దానికి సంబంధి లేదని ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. 1985 ఎయిర్ ఇండియా బాంబు దాడి ఘటనలో నిర్దోషులుగా విడుదలైన ఇద్దరిలో రిపుదమన్ సింగ్ మాలిక్ ఒకరు.
ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఓ తుపాకీ పేలిన శబ్ధం విన్నానని.. వచ్చి చూసేసరికి రిపుదమన్ సింగ్ కారులో అపస్మారక స్థితిలో పడిఉన్నాడని తెలిసింది. ఈ హత్య టార్గెట్ చేసి చంపినట్లు కనిపిస్తుందని అక్కడి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసును పోలీసులు విచారిస్తున్నారు.
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
Read Also: CM YS Jagan: గోదావరి ఉగ్రరూపం.. సీఎం జగన్ ఏరియల్ సర్వే..
జూన్ 23, 1985న మాంట్రియల్-లండన్-ఢిల్లీ-ముంబై ఎయిర్ ఇండియా విమానాన్ని మార్గం మధ్యలో ఉండగా, బాంబు దాడి చేసి కూల్చివేసిన ఘటనలో మాలిక్ తో పాటు అజైబ్ సింగ్ బగ్రీ ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే వీరిద్దరిని మార్చి 2005న కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 మాంట్రియల్ నుంచి లండన్ మార్గంలో 31 వేల ఫీట్ల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఐర్లాండ్ తీరంలో అట్లాంటిక్ మహాసముద్రంలో కూల్చివేయబడింది. ఈ ఘటనలో మొత్తం 331 మంది చనిపోయారు.
తాజావార్తలు
-
Ramayana: ఇలాంటి పాత్ర చేయడం పూర్వ జన్మ సుకృతం… ‘రామాయణం’ వేదికపై సాయి పల్లవి ఎమోషనల్
-
Two US Soldiers Killed: ఇరాన్ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మృతి.. “మరచిపోలేని గుణపాఠం చెబుతాం” అంటూ ఖమేనీ హెచ్చరిక
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!