Drinking: మందు.. మంచిదే. ఆరోగ్యానికి. అందరికీ కాదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మందు తాగటం మంచి అలవాటు కాదంటారు. కానీ 40 ఏళ్ల వయసు దాటినవారు స్వల్పంగా ఆల్కహాల్ తీసుకోవటం ఆరోగ్యానికి లాభిస్తుందని లాన్సెట్ స్టడీ తెలిపింది. రెడ్ వైన్ని రెండు, మూడు పెగ్గులేస్తే గుండె జబ్బులు, గుండెపోటు, షుగర్ లెవల్స్ వంటి హెల్త్ రిస్కులు తగ్గుతాయని పేర్కొంది. 39 ఏళ్ల లోపువారు మందుకొడితే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనమూ ఉండదని, పైగా అనారోగ్యానికి గురవుతారని హెచ్చరించింది. మన దేశంలో గత 30 ఏళ్లలో ఆల్కహాల్ వినియోగం కొంచెం పెరిగినట్లు వెల్లడించింది.
దేశంలో దాదాపు 54 లక్షల మంది (15-39 ఏజ్ గ్రూప్) మహిళలకు ఈ అలవాటు ఉందని పేర్కొంది. 1990లతో పోల్చితే ఇప్పుడు 0.08 శాతం పెరిగినట్లు విశ్లేషించింది. 40-64 ఏజ్ గ్రూప్ ఆడవాళ్లలో ఈ హ్యాబిట్ 0.15 శాతం పెరిగింది. 65 ఏళ్లు పైబడ్డ మహిళలు మందు తాగటం తగ్గించారని లాన్సెట్ మెటా అనాలసిస్ స్పష్టం చేసింది. మగవాళ్ల విషయానికొస్తే అన్ని వయసులవారిలోనూ డ్రింకింగ్ అలవాటు పెరిగింది. దేశవ్యాప్తంగా ఎనిమిది కోట్ల మంది పురుషులు పూటుగా తాగుతున్నారు.
Also Read
- Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
- Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
- Virgin Girl Consent: కన్య మౌనం అంగీకారమే.. ఆఫ్ఘనిస్తాన్లో బాల్య వివాహాలకు తాలిబన్ ఆమోదం
- WHO Ebola Emergency: కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాప్తి.. ఇంటర్నేషనల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ
40-64 ఏజ్ గ్రూపులో ఇది మరీ ఎక్కువగా ఉంటోంది. ఈ వయసువాళ్లల్లో 5.63 శాతం, 15-39 ఏజ్ గ్రూప్లో 5.24 శాతం మద్యం అలవాటు పెరగ్గా 65 ఏళ్లు పైబడ్డవారిలో 2.88 శాతం పెరిగింది. ఆసియా ఖండంలోని ఇతర దేశాల సంగతి పరిశీలిస్తే.. పాకిస్థాన్లోనూ ఇండియా మాదిరిగానే ఆడవాళ్లు, మగవాళ్లు ఇద్దరూ తాగుబోతులే. నేపాల్లో మగవాళ్లు ఎక్కువగా, ఆడవాళ్లు తక్కువగా ఆల్కహాల్ తీసుకుంటున్నారు. బంగ్లాదేశ్, భూటాన్లో ఆడ, మగ ఇద్దరూ తక్కువ సంఖ్యలోనే డ్రింకేస్తున్నారు.
ఇండియా, పాకిస్థాన్లలో మద్యం వాడకం పెరగటానికి పట్టణీకరణే ప్రధాన కారణమని తేలింది. అర్బనైజేషన్ వల్ల ఆదాయం పెరిగి పబ్లిక్ లైఫ్ స్టైల్ మారిపోతోందని అభిప్రాయపడింది. రెండేళ్ల కిందట ఏకంగా 59.1 శాతం మంది జనాలు (ఇందులో 76.7 శాతం మంది పురుషులు) అధిక మోతాదులో మద్యం సేవించినట్లు లాన్సెట్ వెల్లడించింది. అందువల్ల చిన్న వయసులోనే మద్యానికి బానిసవుతున్నవారి సంఖ్యను తగ్గించటానికి కఠిన నిబంధనలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Chhattisgarh Congress: ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ ఆఫీస్లో వింతైన ఘటన.. నల్లాలు దొంగిలించి.. నేలపై ‘లవ్ యూ’ నోట్!
-
Iran: మసీదుల్లో ఆయుధ శిక్షణ.. 3 కోట్ల మంది పేర్లు నమోదు..
-
Bhojshala Case: “భోజ్శాల ఆలయం కాదు”.. హైకోర్టు తీర్పుపై కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
-
Full Body Checkup : 30 ఏళ్లు దాటాయా? ఈ టెస్టులు మిస్ అయితే రిస్క్.!
-
Bangladesh: ‘‘గంగా నది’’పైనే భారత సంబంధాలు ఆధారపడుతాయి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..