Japanese Encephalitis: అస్సాంలో జేఈ వ్యాధి కల్లోలం.. 15 రోజుల్లో 23 మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరదలు, భారీ వర్షాలతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అస్సాం రాష్ట్రాన్ని జపనీస్ ఎన్సెఫాలిటిస్ ( జేఈ ) వ్యాధి కలవరపెడుతోంది. దోమల ద్వారా వ్యాపించే ఈ వ్యాధి మనుషుల్లో తీవ్రమైన మెదడు వాపుకు కారణం అవుతుంది. తీవ్రమైన జ్వరం, తలనొప్పితో బాధితులు బాధపడుతుంటారు. సరైన సమయంలో వైద్యం అందకపోతే వ్యాధి చికిత్సకు లొంగే పరిస్థితి ఉండదు. తాజాగా ఈ వ్యాధి అస్సాం రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులకు కారణం అవుతోంది.
ఇప్పటి వరకు జపనీస్ ఎన్సెఫాలిటిస్ వ్యాధి కారణంగా 15 రోజుల్లో 23 మంది చనిపోయారని జాతీయ ఆరోగ్య మిషన్ శుక్రవారం వెల్లడించింది. ఈ వ్యాధి కారణంగా శుక్రవారం మరో నలుగురు మరణించారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16 కేసులు నమోదు అయ్యాయి. బార్ పేట, కామరూప్ మెట్రోపాలిటిిన్, కర్బీ అంగ్లాంగ్ ఈస్ట్, హోజాయ్ ప్రాంతాల్లో ఒక్కో కేసు నమోదు అవ్వగా..నాగావ్ లో 4, శివసాగర్ లో రెండు, నల్బరీ, ఉదల్ గురి జిల్లాల్లో ఒక్కో కేసు నమోదు అయినట్లు నేషనల్ హెల్త్ మిషన్ వెల్లడించింది. జూలై 1 నుంచి అస్సాంలో ఇప్పటి వరకు మొత్తం 160 కేసులు నమోదు అయ్యాయి.
Also Read
- MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
- Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
- Mohali Office Murder: ఆ కారణంతోనే చంపాడు.. మొహాలి ఘటన చెప్పిన చేదు నిజం!
- NEET UG 2026: నీట్ రీ-ఎగ్జామ్ కు ముందు.. పేపర్ లీక్ వదంతులపై విద్యార్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి..
Read Also: Telangana Floods: రేపు తెలంగాణ గవర్నర్ తమిళసై భద్రాచలం పర్యటన
గత నెలలో అస్సాంలో భారీగా వర్షాలు, వరదలు సంభవించాయి. 28 జిల్లాల్లో ప్రజలు వీటి వల్ల ప్రభావితం అయ్యారు. చాలా రోజుల వరకు గ్రామాలు నీటిలో ఉన్నాయి. దీంతో అపరిశుభ్ర వాతావరణం ఏర్పడింది. దీంతోనే దోమల పెరగడం జేఈ వ్యాధి విస్తరణకు కారణం అయినట్లుగా తెలుస్తోంది. వ్యాధి వ్యాపించకుండా రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ఫాగింగ్ కార్యక్రమాలు, దోమ తెరలను పంపిణీ చేస్తున్నారు అధికారులు.
జేఈ ఇన్ఫెక్షన్ కు ప్రధానంగా దోమలు కారణం అవుతాయి. వ్యాధికారక ఫ్లావీవైరస్ ను పందుల నుంచి మనుషులకు వ్యాపింప చేస్తుంది. దోమలు కుట్టడం ద్వారా మనుషులు, ఇతర జంతువుల శరీరాల్లోకి వైరస్ చేరుతుంది. ఫలితంగా జేఈ వ్యాధి వస్తుంది. సెంట్రల్ నర్వ్ సిస్టమ్, మెదడు, వెన్నుపాముపై ప్రభావాన్ని చూపిస్తుంది. త్వరగా వ్యాధిని గుర్తించి చికిత్స తీసుకోకుంటే మరణం సంభవిస్తుంది.
తాజావార్తలు
-
Kings and Queens Pub: కూకట్పల్లిలోని కింగ్స్ అండ్ క్వీన్స్ పబ్పై పోలీసుల ఆకస్మిక దాడులు.. 9 మంది అదుపులోకి
-
Raviteja : ‘ఇరుముడి’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!