CAATSA: అమెరికా ఆంక్షల నుంచి ఇండియాకు మినహాయింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా విధానాలకు వ్యతిరేకంగా లావాదేవీలు నిర్వహించే దేశాలపై విధించే కాట్సా(సీఏఏటీఎస్ఏ) చట్టం నుంచి భారత్ కు మినహాయింపు లభించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా ఈ చట్టం నుంచి భారత్ ను మినహాయిస్తూ యూఎస్ ప్రతినిధుల సభ తీర్మాణాన్ని గురువారం ఆమోదించింది. ధీంతో రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింత బలపడుతుందని.. ఇది చైనా దురాక్రమనను అరికట్టడంతో ఉపయోగపడుతుందని అమెరికా చట్ట సభ ప్రతినిధులు భావిస్తున్నారు. నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ (ఎన్డీఏఏ) సవరణల ప్రకారం.. భారతీయ-అమెరికన్, హైజ్ ఆర్మ్డ్ సర్వీసెస్ యాక్ట్ లో సభ్యుడైన డెమొక్రాటిక్ ప్రతినిధి రో ఖన్నా తీర్మాణాన్ని సభ ఆమోదించింది. అయితే ఈ సవరణలు పూర్తిగా చట్టంగా మారాలంటే మాత్రం వివిధ దశల్ని దాటుకొని వెళ్లాలి.
చైనా నుంచి పెరుగుతున్న సవాళ్లను ఎదుర్కోవాలంటే భారత్ కు అమెరికా అండగా నిలబడాలని భావిస్తోంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలు నెరవేరాలంటే భారత్- అమెరికా బంధం కీలకమని అక్కడి ప్రతినిధులు భావిస్తున్నారు. కాట్సా నుంచి పూర్తిస్థాయిలో మినహాయింపు లభిస్తే అమెరికా శత్రు దేశాలైన రష్యా, ఇరాన్ దేశాలతో భారత్ మరింతగా రక్షణ, వాణిజ్య సంబంధాలను కొనసాగించే అవకాశం లభిస్తుంది. కాట్సా చట్టం ప్రకారం ఇరాన్, ఉత్తర కొరియా, రష్యా దేశాలతో లావాదేవీలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలు విధిస్తోంది.
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
Read Also: Telangana Rains: బ్రేక్ తీసుకున్న వరుణుడు.. మళ్ళీ 18 తర్వాత జల్లులు
స్వాతంత్య్రం తరువాత నుంచి ఇండియా ఎక్కువగా రష్యా ఆయుధాలు, సైనిక వ్యవస్థలపైనే ఆధారపడుతోంది. రానున్న రోజుల్లో డిఫెన్స్ కు సంబంధించి యుద్ధవిమానాలు, ఇతర రక్షణ వ్యవస్థల ఆధునీకీకరణపై రష్యాపై భారత్ ఆధారపడి ఉంది. దీంతో పొరుగుల చైనా, పాకిస్తాన్ దేశాలతో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వీటన్నింటి మధ్య భారత్ రష్యాతో తన స్నేహాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో అత్యుత్తమ క్షిపణి రక్షణ వ్యవస్థ అయిన ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత్ రష్యా నుంచి 5.34 బిలియన్ డాలర్ల వ్యయంతో కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అయితే భారత్ ఈ చర్య వల్ల అమెరికా కాట్సా ఆంక్షల్లోకి వస్తుందని గతంలో పలువురు అమెరికా ప్రతినిధులు హెచ్చరించారు. కాగా భారత్ ఇవేవీ పట్టించుకోకుండా రష్యా నుంచి ఎస్ – 400 కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపింది.
తాజావార్తలు
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
-
China: 75 ఏళ్ల వృద్ధురాలి షాకింగ్ వ్యవహారం.. రూ.4 కోట్లతో బ్యూటీ ట్రీట్మెంట్!
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!