ఈరోజు మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ కీలకం కానున్నాడు. ఇప్పటికే 44 పరుగులు చేసి.. క్రీజులో ఉన్న కోహ్లీ పైనే క్రికెట్ అభిమానుల ఆశలు ఉన్నాయి. ఈ ఏడాదంతా మంచి ఫాం కనబరుస్తున్న కోహ్లీ.. అదే ఫామ్ ను కంటిన్యూ చేయాలని కోరుతున్నారు.
Aadhaar Card: భారతదేశ పౌరులకు ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన పత్రం అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆసుపత్రుల నుంచి బ్యాంకులు, కళాశాలలు, రేషన్ దుకాణాలు ఇలా ప్రతిచోటా ఆధార్ కార్డు తప్పనిసరి.
మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే భారతదేశ సుపుత్రుడు (సపుత్) అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. గాడ్సే భారతదేశంలోనే జన్మించాడు.. అతను బాబర్, ఔరంగజేబుల మాదిరిగా విదేశీ దురాక్రమణదారుడు కాదని అన్నారు.
కోహ్లీ ప్రదర్శనపై క్రికెట్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఈ క్రమంలో ఆయనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ ఔటైన వెంటనే తన జట్టు సభ్యులతో కలిసి డ్రెస్సింగ్ రూమ్లో భోజనం చేస్తున్న ఫోటోను షేర్ చేసుకోవడం అభిమానులకు అస్సలు నిద్రపట్టడం లేదు. టెస్టుల్లో అతని కమ్ బ్యాక్ గురించి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న క్రికెట్ లవర్స్.. అతని పేలవ ప్రదర్శనతో షాక్ అయ్యారు.
Sini Shetty: 2023లో మిస్ వరల్డ్ పోటీలకు ఇండియాకు ప్రాతినిధ్యం ఇవ్వనుంది. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అందాల పోటీ 27 ఏళ్ల తరువాత భారత్ లో మళ్లీ నిర్వహించబోతోంది.
మొన్నటిదాకా ఐపీఎల్ లో ఫుల్ ఫాంలో ఉన్న గిల్.. ఇప్పుడేమైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అటు ఐపీఎల్ లోనే కాకుండా.. ఈ ఏడాది జరిగిన మ్యాచ్ ల్లో.. మూడు ఫార్మట్లలో బాగానే ఆడాడు. అంతేకాకుండా సెంచరీల మీద సెంచరీల బాదాడు. ఈ ఏడాది న్యూజిలాండ్ పై వన్డేలలో డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఐపీఎల్ అయితే ఏకంగా 3 సెంచరీలు కొట్టి మంచి ఫాంలో ఉన్న గిల్.. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో తుస్సుమనిపించాడు. దీంతో ఏడాది కాలమంతా…
ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 469 పరుగులు చేసి.. టీమిండియాకు భారీ ఆధిక్యాన్ని ముందుంచుంది. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ దిగిన టీమిండియా ఓపెనర్స్ రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్ తక్కువ స్కోరుకే పెవిలియన్ బాట పట్టారు. రోహిత్ శర్మ (15), గిల్ (13) పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో భారత్ కష్టాల్లోకి వెళ్లిపోయింది.
రియల్మీ మరోసారి భారతీయ స్మార్ట్ఫోన్ను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్మీ 11 ప్రో సిరీస్ను ప్రారంభించింది. రియల్మీ 11ప్రో, రియల్మీ 11 ప్రో ప్లస్ సిరీస్ ఫోన్లు గురువారం భారత మార్కెట్లోకి వచ్చాయి.
భారత్ - ఆస్ట్రేలియా మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా బ్యాటర్లు దుమ్ములేపుతున్నారు. భారీ స్కోరు మీద కన్నేసిన ఆసీస్.. ఫస్ట్ డే 327-3 వద్ద ఆట ముగియగా.. రెండో రోజు ఆట ఆరంభించి అదే దూకుడు ప్రదర్శన కొనసాగిస్తున్నారు.
ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతున్నాయి. ఏడాది కాలంలో స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ రేట్లలో మళ్లీ మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలను తగ్గించాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.