Delhi: కోవిడ్ నుండి భారతదేశంలో విమాన ఛార్జీలు 41% పెరిగాయి.. కారణమేంటంటే..!
Delhi: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికి తెలుసు. కరోనా అన్నీ సంస్థలను దెబ్బతీయగా.. దాని ప్రభావం విమానాశ్రయ ఛార్జీలపై కూడా పడింది. విమానాశ్రయ ఛార్జీలు స్థిరంగా ఉన్నప్పటికీ ఆసియా-పసిఫిక్ మరియు మిడిల్ ఈస్ట్ లో విమాన ఛార్జీలు బాగా పెరిగాయి. ఈ ప్రాంతాల్లో విమాన ఛార్జీల ట్రెండ్స్పై జరిపిన అధ్యయనంలో అత్యధిక విమాన ఛార్జీలు భారతదేశంలో (41 శాతం), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (34 శాతం), సింగపూర్ (30 శాతం), ఆస్ట్రేలియా (23 శాతం) పెరిగినట్లు నివేదిక తెలిపింది.
Read Also: Ariyana Glory : ఉప్పొంగే ఎద అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ..
Also Read
2023లో భారతదేశం, ఇండోనేషియా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా మరియు జపాన్లతో సహా పలు మార్కెట్లలో దేశీయ విమాన ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయని అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్గాల్లో మాత్రమే స్వల్పంగా తగ్గినట్లు పేర్కొంది. అయితే మహమ్మారి సమయంలో సంభవించిన నష్టాలను తిరిగి పొందేందుకు ఛార్జీలు పెంచుతున్నట్లుగా ACI ఆసియా-పసిఫిక్ విమానయాన సంస్థలు తెలిపాయి. మరోవైపు విమానాశ్రయాలు ల్యాండింగ్, పార్కింగ్ మరియు ప్రయాణీకుల రుసుములతో సహా విమానాశ్రయ ఛార్జీలను తగ్గించాయి.
Read Also: Adipurush Free tickets: ప్రకటనలేనా, చేతల్లో సాధ్యమయ్యే పనేనా?
విమాన ఛార్జీల పెరుగుదలలో ప్రధాన కారణమేంటంటే.. గణనీయంగా ఇంధన ధరలు మరియు ద్రవ్యోల్బణం పెరగడం. 2019తో పోలిస్తే 2022లో ఇంధన ధరలు 76 శాతం పెరిగాయి. అదే కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 10 శాతం పెరగడంతో ఎయిర్లైన్స్ ఖర్చులు పెరిగాయి. మరోవైపు విమాన ఛార్జీల పెరుగుదలపై కాంగ్రెస్ నాయకుడు కెసి వేణుగోపాల్ మరియు యూనియన్ సివిల్ ఏవియేషన్ జ్యోతిరాదిత్య సింధియా మధ్య ట్విట్టర్ యుద్ధం జరిగింది. ఈ విపరీతమైన విమాన ఛార్జీలు మధ్యతరగతి ప్రజలను విధ్వంసం సృష్టిస్తున్నాయని వేణుగోపాల్ తెలిపారు. దీనిపై ప్రభుత్వం జోక్యం చేసుకోదా అని ప్రశ్నించారు. వేణుగోపాల్ వ్యాఖ్యలకు స్పందించిన సింధియా.. గతంలో ఒత్తిడిలో ఉన్న GoFirst ద్వారా సేవలందిస్తున్న మార్గాల్లో కొంత భాగాన్ని ఇప్పటికే ఇతర విమానయాన సంస్థలకు కేటాయించామని తెలిపారు.
తాజావార్తలు
-
Nayanthara: బాలయ్య ‘NBK 111’ నుంచి నయనతార అవుట్? రెమ్యునరేషన్ వల్లేనా?
-
Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
-
Kavitha New Party: నేడే కవిత కొత్త పార్టీ ప్రకటన.. గన్ పార్క్ నుంచి మేడ్చల్ వరకు భారీ ర్యాలీ!
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Iran-US Talks: నేడు ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య కీలక చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!