హైదరాబాద్ వేదికగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో.. టాస్ గెలిచిన ఇంగ్లీష్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది. కాగా.. మొదటి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. మొదటి రోజు 119 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. ఓవర్ నైట్ స్కోరుతో రెండవ రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఈరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ పై 175 పరుగుల ఆధిక్యంలో భారత్ ఉంది. ప్రస్తుతం క్రీజులో రవీంద్ర జడేజా (81), అక్షర్ పటేల్ (35) పరుగులతో ఉన్నారు.
Read Also: Salesforce: ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించిన మరో దిగ్గజ కంపెనీ..
కాగా.. టీమిండియా బ్యాటింగ్ లో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 80, రోహిత్ శర్మ 24 పరుగులు చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన శుభ్ మాన్ గిల్ 23, కేఎల్ రాహుల్ 86, శ్రేయాస్ అయ్యర్ 35, శ్రీకర్ భరత్ 41, రవిచంద్రన్ అశ్విన్ 1 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్లీ 2, జో రూట్ 2 వికెట్లు పడగొట్టారు. జాక్ లీచ్, రెహన్ అహ్మద్ కు తలో వికెట్ దక్కింది.
Read Also: Akhilesh Yadav: ఆయన ఇండియా కూటమిలో ఉండి ఉంటే ప్రధాని అయ్యేవారు..