India-Maldives Row: ఉద్రిక్తతల మధ్య.. భారత్కి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన మాల్దీవులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Maldives Row: ఇండియా, మాల్దీవుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇటీవల లక్షద్వీప్ పర్యటనను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్రమోడీపై అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇండియా ప్రజలు మాల్దీవులపై తీవ్రం ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మాల్దీవ్స్ పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ చైనా అనుకూలంగా వ్యవహరించడం, భారత్ను ఉద్దేశించి పరోక్షంగా వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదం అయ్యాయి.
Read Also: Viral Video : బెంగుళూరు ట్రాఫిక్ లో ఇరుక్కున్న పెళ్లి కూతురు.. మెట్రోలో ఫోటోలు వైరల్..
Also Read
ఇదిలా ఉంటే తాజాగా మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు శుక్రవారం భారతదేశానికి 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మాల్దీవుల అధ్యక్షుడి కార్యాలయం ఓ ప్రకటనలో ‘‘పరస్పర గౌరవం మరియు లోతైన బంధుత్వ భావనపై స్థాపించబడిన శతాబ్ధాల నాటి స్నేహం’’ అంటూ ఇండియాను ఉద్దేశించి ప్రస్తావించారు. భారత 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ భారత రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రికి శుభాకాంక్షలు మరియు శుభాకాంక్షలు పంపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వేర్వేరు సందేశాలలో, అధ్యక్షుడు ముయిజ్జూ శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోయే సంవత్సరాల్లో భారత్, దాని ప్రజలు శాంతి, పురోగతిని కొనసాగించాలని కోరారు. ఆ దేశ అధ్యక్షుడితో పాటు మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రెందు దేశాల మధ్య విభేదాల తర్వాత తొలిసారిగా మాల్దీవ్స్, భారత్కి సందేశాన్ని పంపింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!
-
Ragi Biscuits : హెల్తీ రాగి బిస్కెట్లు ఎయిర్ ఫ్రైయర్లో 10 నిమిషాల్లో ఇలా చేసుకోండి.!
-
Kitchen Tips : నల్లబడిన వెండి ఆభరణాలు, వస్తువులు కొత్త వాటిలా మెరవాలా..? ఈ కిచెన్ ట్రిక్ సూపర్!
-
మళ్లీ అందుబాటులోకి Telegram.. కానీ వారికీ మాత్రం.!