India-Maldives: భారత్కు తిరిగొచ్చిన మాల్దీవుల్లో నివసిస్తున్న సైనికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Maldives Tension: మాల్దీవుల్లో నివసిస్తున్న భారత సైనికులంతా ఇప్పుడు స్వదేశానికి చేరుకున్నారు. మాల్దీవుల నుంచి భారత్ తన సైనికులందరినీ ఉపసంహరించుకున్నట్లు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మే 10వ తేదీలోగా దేశం నుంచి భారత సైనికులందరినీ వెళ్లిపోవాలని గడువు విధించారు. నిన్నటితో( మే10) ఈ గడువు ముగిసింది. ఇక, ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీలో చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ బలగాల ఉపసంహరణ జరిగింది.
Read Also: Uttarpradesh: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య.. అనంతరం నిందితుడు ఆత్మహత్య
Also Read
- West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- TDP Mahanadu: అందుకే హైబ్రిడ్ మహానాడు.. నెల్లూరు సభ రద్దుపై పల్లా శ్రీనివాస్ వివరణ..
- Sugar Free Lassi Recipe: చక్కెర లేకుండానే తియ్యటి లస్సీ.. ఈ చిట్కాతో క్రీమీ టేస్ట్ గ్యారంటీ!
కాగా, మాల్దీవులలో మోహరించిన చివరి బ్యాచ్ భారత సైనికులను వెనక్కి పంపినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ ప్రధాన ప్రతినిధి హీనా వలీద్ తెలిపారు. అయితే, భారత సైనికుల సంఖ్యపై ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. ఎంతమంది సైనికులు తిరిగి వెళ్లిపోయారనేది తర్వాత తెలియజేస్తామని వలీద్ చెప్పుకొచ్చింది. భారతదేశం బహుమతిగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, డోర్నియర్ విమానాలను నిర్వహించడానికి మాల్దీవులలో భారతీయ సైనిక సిబ్బందిని నియమించారు. అయితే, తొలి విడతలో 51 మంది సైనికులను భారత్కు పంపినట్లు మాల్దీవుల ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
Read Also: CM YS Jagan: పిఠాపురంలో ప్రచారాన్ని ముగించనున్న సీఎం జగన్.. నేటి షెడ్యూల్ ఇదే..
అయితే, అధికారిక పత్రాలను ఉటంకిస్తూ మాల్దీవుల్లో 89 మంది భారతీయ సైనికులు ఉన్నట్లు మాల్దీవులు తెలియజేసింది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం నాడు విలేకరులతో మాట్లాడుతూ.. మొదటి, రెండవ బ్యాచ్ భారతీయ సైనిక సిబ్బంది తిరిగి వచ్చారన్నారు. ఇప్పుడు మూడు భారతీయ విమానయాన ప్లాట్ఫారమ్లను, సాంకేతిక సిబ్బందిని కూడా వెనక్కి తిరిగి వచ్చారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
IBomma Piracy: ఐబొమ్మ కథ ముగిసిందనుకుంటే.. మళ్లీ మొదలైందా? బాంబ్ పేల్చిన రవి!
-
Gold Theft: లవర్ సంతోషం కోసం అమ్మ నగలు అమ్మేశాడు.. అసలేం జరిగిందంటే!
-
West Bengal: టీఎంసీ ఆఫీస్లో వందలాది ఆధార్ కార్డులు.. బెంగాల్లో సంచలనం!
-
Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
-
KamalHaasan : నాకు రజనీకాంత్కు మధ్య పోటీ మాత్రమే ఉంది.. విజయ్ నుండి ఎక్కువ ఆశించకూడదు
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..