India-Maldives: భారత్కు తిరిగొచ్చిన మాల్దీవుల్లో నివసిస్తున్న సైనికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Maldives Tension: మాల్దీవుల్లో నివసిస్తున్న భారత సైనికులంతా ఇప్పుడు స్వదేశానికి చేరుకున్నారు. మాల్దీవుల నుంచి భారత్ తన సైనికులందరినీ ఉపసంహరించుకున్నట్లు మాల్దీవుల ప్రభుత్వం ప్రకటించింది. అయితే, అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జూ మే 10వ తేదీలోగా దేశం నుంచి భారత సైనికులందరినీ వెళ్లిపోవాలని గడువు విధించారు. నిన్నటితో( మే10) ఈ గడువు ముగిసింది. ఇక, ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు న్యూఢిల్లీలో చర్చలు జరుపుతున్న తరుణంలో ఈ బలగాల ఉపసంహరణ జరిగింది.
Read Also: Uttarpradesh: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య.. అనంతరం నిందితుడు ఆత్మహత్య
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
కాగా, మాల్దీవులలో మోహరించిన చివరి బ్యాచ్ భారత సైనికులను వెనక్కి పంపినట్లు మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ ప్రధాన ప్రతినిధి హీనా వలీద్ తెలిపారు. అయితే, భారత సైనికుల సంఖ్యపై ఖచ్చితమైన సమాచారం ఇవ్వలేదు. ఎంతమంది సైనికులు తిరిగి వెళ్లిపోయారనేది తర్వాత తెలియజేస్తామని వలీద్ చెప్పుకొచ్చింది. భారతదేశం బహుమతిగా ఇచ్చిన రెండు హెలికాప్టర్లు, డోర్నియర్ విమానాలను నిర్వహించడానికి మాల్దీవులలో భారతీయ సైనిక సిబ్బందిని నియమించారు. అయితే, తొలి విడతలో 51 మంది సైనికులను భారత్కు పంపినట్లు మాల్దీవుల ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
Read Also: CM YS Jagan: పిఠాపురంలో ప్రచారాన్ని ముగించనున్న సీఎం జగన్.. నేటి షెడ్యూల్ ఇదే..
అయితే, అధికారిక పత్రాలను ఉటంకిస్తూ మాల్దీవుల్లో 89 మంది భారతీయ సైనికులు ఉన్నట్లు మాల్దీవులు తెలియజేసింది. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం నాడు విలేకరులతో మాట్లాడుతూ.. మొదటి, రెండవ బ్యాచ్ భారతీయ సైనిక సిబ్బంది తిరిగి వచ్చారన్నారు. ఇప్పుడు మూడు భారతీయ విమానయాన ప్లాట్ఫారమ్లను, సాంకేతిక సిబ్బందిని కూడా వెనక్కి తిరిగి వచ్చారని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!