POK: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో స్వేచ్ఛ కోసం పోరాటం.. భారీగా నిరసనలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
POK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ‘ఆజాదీ’ నినాదాలు మిన్నంటుతున్నాయి. పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలంటూ పీఓకే ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే, ఈ నిరసనలను అణిచివేసేందుకు పాకిస్తాన్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. పాక్ రేంజర్లు, స్థానిక పోలీసులుతో దాడులు చేయిస్తోంది. ఇప్పటికే ఈ నిరసనల్లో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన ఘర్షనల్లో ఒక పోలీస్ అధికారితో పాటు మరో 90 మంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే ఈ నిరసనల్లో భారత జెండాను ప్రదర్శించడంపై పాకిస్తాన్ మరింత అప్రమత్తమైంది.
Read Also: Amit Shah: పాక్ వద్ద అణుబాంబులు ఉంటే పీఓకేని వదిలేయాలా..? కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్..
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
ద్రవ్యోల్భణం, అధిక పన్నులు, విద్యుత్ కొరతకు వ్యతిరేకంగా పీఓకే ప్రాంతంలోని ప్రజలు భారీ ఆందోళనలు చేస్తున్నారు. తమ దగ్గర ఉత్పత్తి అవుతున్న విద్యుత్ని పాకిస్తాన్లోని ఇతర ప్రాంతాలకు, నగరాలకు తరలిస్తున్నారని పీఓకే ప్రజలు ఆరోపిస్తున్నారు. ముజఫరాబాద్తో పాటు గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పోలీసులు, భద్రతా సంస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. నిరసనల్లో ముఖ్యంగా వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
శుక్రవారం సమ్మెకు పిలుపునివ్వడంతో చాలామంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దద్యాల్ లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ నుంచి తమకు విముక్తి కోరతున్న స్థానికుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు 2023 ఆగస్టులో కూడా ఇలాగే పీఓకే అంతటా భారీ నిరసనలు జరిగాయి. విద్యుత్ బిల్లులపై పన్నులు విధించడాన్ని తాము తిరస్కరిస్తున్నామని, ఈ ప్రాంతంలోని హైడల్ విద్యుత్ ఉత్పత్తి ధరకు అనుగుణంగా వినియోగదారులు విద్యుత్ అందించాలని మేము డిమాండ్ చేస్తున్నామని ముజఫరాబాద్ ట్రేడర్స్ అసోసియేషన్ ఛైర్మన్ సౌకత్ నవాజ్ మీర్ తెలిపారు. ఇటీవల బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు పీఓకే భారత్లో చేరుతుందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ నిరసనలు వ్యక్తం కావడం గమనార్హం.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!