India-China: చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుదలపై విదేశాంగ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా- భారత్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో గస్తీ హక్కులు సహా పలు అంశాలపై ఇంకా సయోధ్య కుదరాల్సిన అవసరం ఉందని తెలిపారు.
READ MORE: Elections 2024: రేపే నాల్గో విడత పోలింగ్.. ఏపీ, తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్..
Also Read
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
ప్రధాని ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్-చైనా సరిహద్దు సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ దేశాల మధ్య సయోధ్య అవసరమని.. ఇరుదేశాల మధ్య సంబంధాలు కేవలం భారత్, చైనాకే కాకుండా యావత్ ప్రపంచానికి చాలా కీలకమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎప్పటి వరకు రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొంటాయన్న ప్రశ్నకు జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం ఎందుకు పెరుగుతోందన్న ప్రశ్నకూ జైశంకర్ స్పందించారు. 2014కి ముందు తయారీ రంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కుండబద్దలు గొట్టారు. 2020లో గల్వాన్లో సైనిక ఘర్షణ తర్వాత భారత్-చైనా మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య పలు దఫాల్లో చర్చలు జరిగినప్పటికీ.. ఇంకా అనేక అంశాలపై సయోధ్య కుదరలేదు. భారత్ వైఖరి న్యూట్రల్ గానే ఉన్న చైనా మాత్రం ఖయ్యానికి కాలుదువ్వుతోంది.
తాజావార్తలు
-
Bethlehem Family Unit: రూ. 250 కోట్ల దిశగా మలయాళ మూవీ.. తెలుగులోనూ రిలీజ్కు రెడీ!
-
YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!