India-China: చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుదలపై విదేశాంగ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనా- భారత్ మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంటుంది. సరిహద్దుల్లో చైనాతో ఘర్షణలు కొనసాగుతున్నప్పటికీ.. వాణిజ్యం ఎందుకు పెరుగుతోందనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ సమాధానమిచ్చారు. చైనాతో సాధారణ ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ.. సరిహద్దుల్లో శాంతియుత వాతావరణంపైనే ఆధారపడి ఉందని ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు. సరిహద్దుల్లో గస్తీ హక్కులు సహా పలు అంశాలపై ఇంకా సయోధ్య కుదరాల్సిన అవసరం ఉందని తెలిపారు.
READ MORE: Elections 2024: రేపే నాల్గో విడత పోలింగ్.. ఏపీ, తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో పోలింగ్..
Also Read
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
ప్రధాని ఇటీవల ఓ ఛానెల్ కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారత్-చైనా సరిహద్దు సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈ దేశాల మధ్య సయోధ్య అవసరమని.. ఇరుదేశాల మధ్య సంబంధాలు కేవలం భారత్, చైనాకే కాకుండా యావత్ ప్రపంచానికి చాలా కీలకమని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎప్పటి వరకు రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు నెలకొంటాయన్న ప్రశ్నకు జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దుల్లో అసాధారణ పరిస్థితులు ఉన్నప్పుడు చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం ఎందుకు పెరుగుతోందన్న ప్రశ్నకూ జైశంకర్ స్పందించారు. 2014కి ముందు తయారీ రంగానికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవటం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కుండబద్దలు గొట్టారు. 2020లో గల్వాన్లో సైనిక ఘర్షణ తర్వాత భారత్-చైనా మధ్య సంబంధాలు క్షీణించిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య పలు దఫాల్లో చర్చలు జరిగినప్పటికీ.. ఇంకా అనేక అంశాలపై సయోధ్య కుదరలేదు. భారత్ వైఖరి న్యూట్రల్ గానే ఉన్న చైనా మాత్రం ఖయ్యానికి కాలుదువ్వుతోంది.
తాజావార్తలు
-
Ishan Kishan Emotional: అతడి కోసం మ్యాచ్ గెలవాలనుకున్నా.. అదే నా మోటివేషన్!
-
Karuppu : వీరవిహారం చేస్తున్న వీరభద్రుడు.. వర్కింగ్ డే రోజు భారీ వసూళ్లు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
-
US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!