Adani: భారత్లో వారసత్వ పన్ను విధిస్తే..ధనవంతులంతా విదేశాలకు వెళ్తారు
భారతదేశం వారసత్వ పన్ను విధిస్తే.. దేశంలోని చాలా మంది ధనవంతులు దేశాన్ని విడిచిపెట్టి, పన్ను లేని దేశానికి తరలిపోతారని రాజకీయ ఆర్థికవేత్త గౌతమ్ అదాని అన్నారు. గతంలో స్వీడన్లో భారీ వారసత్వ పన్ను ఉండేదని.. అయితే చాలా మంది ధనవంతులు ఆ దేశం నుంచి పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించిందని చెప్పారు. దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు. అంబానీ, అదానీ, టాటా వంటి భారతదేశంలోని అత్యంత ధనవంతులు పన్ను లేని ఇతర దేశాలకు తరలివెళ్లే అవకాశం ఉందని.. ఫలితంగా భారతదేశానికి భారీ సంపద నష్టం జరుగుతుందని ఆయన సూచించారు.
READ MORE: Arvind Kejriwal: కేజ్రీవాల్ విడుదల.. ఎన్నికల సీజన్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి?
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
- 3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
భారతదేశంలో వారసత్వపు పన్నును ప్రవేశపెట్టే ప్రతిపాదనపై తన వివరణ ఇచ్చారు. ఎఎన్ఐ (ANI)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. చాలా మంది ధనవంతులు భారతదేశం నుంచి దుబాయ్కి తరలిపోతారని సేన్ అన్నారు. ఇప్పటికే చాలా మంది భారతీయ మిలియనీర్లు వాస్తవానికి దుబాయ్కి వెళ్లారని తెలిపారు. దుబాయ్లో ఆదాయపు పన్ను లేనందున వారు యుఏఈలో తమ వ్యాపారాలను ప్రారంభించేందుకు దేశాన్ని విడుస్తున్నారన్నారు. స్వీడన్ చాలా ఎక్కువ వారసత్వ పన్నును కలిగి ఉందన్నారు. స్వీడన్ ఒకప్పుడు అత్యధిక పన్ను విధించిన దేశమని.. అక్కడి నుంచి చాలా మంది ధనికులు పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించారన్నారు. ఉదాహరణకు ఐకియా(Ikea) యజమానులు స్వీడన్ నుంచి తరలివెళ్లారని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఇటీవల USలో ప్రబలంగా ఉన్న వారసత్వ పన్ను మాదిరిగానే భారతదేశం వారసత్వ పన్నును అనుసరించాలని సూచించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను అదాని సమాధానమిచ్చారు. అమెరికా ను భారత్ కు ఉదాహరణగా తీసుకోవడం సరికాదన్నారు. నిజానికి భారతదేశంలో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వెయ్యి సంవత్సరాలలో జరగలేదన్నారు. మొట్టమొదటిసారిగా గ్రామీణ భారతదేశం సంక్షేమంలో భారీ పెరుగుదలను చూశామని తెలిపారు.
తాజావార్తలు
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
Hardik Pandya: హార్దిక్ను నట్టేట ముంచేస్తోన్న రోహిత్, సూర్య.. మీకు పాండ్య ఎంత చేశాడో గుర్తుందా బ్రోస్!
-
Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!