Adani: భారత్లో వారసత్వ పన్ను విధిస్తే..ధనవంతులంతా విదేశాలకు వెళ్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం వారసత్వ పన్ను విధిస్తే.. దేశంలోని చాలా మంది ధనవంతులు దేశాన్ని విడిచిపెట్టి, పన్ను లేని దేశానికి తరలిపోతారని రాజకీయ ఆర్థికవేత్త గౌతమ్ అదాని అన్నారు. గతంలో స్వీడన్లో భారీ వారసత్వ పన్ను ఉండేదని.. అయితే చాలా మంది ధనవంతులు ఆ దేశం నుంచి పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించిందని చెప్పారు. దుబాయ్ వంటి దేశాలకు వెళ్లి పన్నులు చెల్లించకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు. అంబానీ, అదానీ, టాటా వంటి భారతదేశంలోని అత్యంత ధనవంతులు పన్ను లేని ఇతర దేశాలకు తరలివెళ్లే అవకాశం ఉందని.. ఫలితంగా భారతదేశానికి భారీ సంపద నష్టం జరుగుతుందని ఆయన సూచించారు.
READ MORE: Arvind Kejriwal: కేజ్రీవాల్ విడుదల.. ఎన్నికల సీజన్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోనున్నాయి?
Also Read
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
భారతదేశంలో వారసత్వపు పన్నును ప్రవేశపెట్టే ప్రతిపాదనపై తన వివరణ ఇచ్చారు. ఎఎన్ఐ (ANI)కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. చాలా మంది ధనవంతులు భారతదేశం నుంచి దుబాయ్కి తరలిపోతారని సేన్ అన్నారు. ఇప్పటికే చాలా మంది భారతీయ మిలియనీర్లు వాస్తవానికి దుబాయ్కి వెళ్లారని తెలిపారు. దుబాయ్లో ఆదాయపు పన్ను లేనందున వారు యుఏఈలో తమ వ్యాపారాలను ప్రారంభించేందుకు దేశాన్ని విడుస్తున్నారన్నారు. స్వీడన్ చాలా ఎక్కువ వారసత్వ పన్నును కలిగి ఉందన్నారు. స్వీడన్ ఒకప్పుడు అత్యధిక పన్ను విధించిన దేశమని.. అక్కడి నుంచి చాలా మంది ధనికులు పారిపోతున్నందున వారసత్వ పన్నును తొలగించారన్నారు. ఉదాహరణకు ఐకియా(Ikea) యజమానులు స్వీడన్ నుంచి తరలివెళ్లారని తెలిపారు.
కాంగ్రెస్ నాయకుడు శామ్ పిట్రోడా ఇటీవల USలో ప్రబలంగా ఉన్న వారసత్వ పన్ను మాదిరిగానే భారతదేశం వారసత్వ పన్నును అనుసరించాలని సూచించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను అదాని సమాధానమిచ్చారు. అమెరికా ను భారత్ కు ఉదాహరణగా తీసుకోవడం సరికాదన్నారు. నిజానికి భారతదేశంలో గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి వెయ్యి సంవత్సరాలలో జరగలేదన్నారు. మొట్టమొదటిసారిగా గ్రామీణ భారతదేశం సంక్షేమంలో భారీ పెరుగుదలను చూశామని తెలిపారు.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..