India-Canada: భారత్పై కెనడా గూఢచార సంస్థ సంచలన ఆరోపణలు..
India-Canada: ఖలిస్తాన్ మద్దతుదారులకు, ఇండియా వ్యతిరేకులకు మద్దతుగా వ్యవహరిస్తోంది కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం. ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఈ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ ప్రమేయం ఉందని కెనడా పీఎం ట్రూడో ఆరోపించడంతో ఒక్కసారిగా భారత్, కెనడాల మధ్య దౌత్యపోరు మొదలైంది. అయితే, ఆయన వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా తిరస్కరించింది. రాజకీయ ప్రేరేపిత, అసంబద్ధ వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. కెనడా తీవ్రవాదులకు స్థావరంగా మారిందని మండిపడింది.
ఇదిలా ఉంటే మరోసారి కెనడా భారత్పై తీవ్ర ఆరోపణలు చేసింది. కెనడాలో భారత్ జోక్యం చేసుకుంటుందని, గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపించింది. కెడడియన్ గూఢచార సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) ఈ వారం విడుదల చేసిన 2023 పబ్లిక్ రిపోర్ట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. కెనడాతో పాటు ఇతర పాశ్యాత్య దేశాల్లో విదేశీజోక్యంతో పాటు గూఢచర్యానికి భారత్, చైనా, రష్యా, ఇరాన్ పాల్పడుతున్నాయని నివేదిక వెల్లడించింది. ఈ దేశాలు తమ లక్ష్యాల కోసం, ఆసక్తుల కోసం విదేశీ జోక్యం చేసుకుంటున్నాయని ఆరోపించింది.
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
- Afghanistan: తాలిబన్లకు దొరికిన వేల కోట్ల నిధి.. భారత్కు అత్యంత తక్కువ ధరకే ఆయిల్ సప్లై చేసే ఛాన్స్!
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
Read Also: Jasmine flowers: మల్లెపూలను ఎక్కువగా పెట్టుకుంటున్నారా? మీకో షాకింగ్ న్యూస్..
సదరు గూఢచార సంస్థ చట్టం ప్రకారం, విదేశీ ప్రభావిత కార్యకలాపాలను కెనడా ప్రయోజనాలకు హానికరం, రహస్యంగా లేదా మోసపూరితంగా లేదా ఏదైనా వ్యక్తికి ముప్పు కలిగిస్తుందని అని నిర్వచించింది. కెనడా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించిన తర్వాత కెనడాకు వ్యతిరేకంగా సైబర్ కార్యకలాపాలు నిర్వహించబడినట్లు గమనించామని, అయితే ఇందులో భారత ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేసింది.
ఖలిస్తాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ని కెనడాలోని సర్రే నగరంలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్చి చంపారు. అయితే, ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపిస్తూ ఇటీవల ముగ్గురు భారతీయులను కెనడా అధికారులు అరెస్ట్ చేశారు. అయితే, దీనికి సంబంధించి కెనడా అధికారులు తమతో ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు మరో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు అమెరికా ఆరోపిస్తోంది. అమెరికా ఎఫ్బీఐ భారత దేశ ప్రభుత్వ అధికారితో కలిసి నిఖిల్ గుప్తా అనే వ్యక్తి హత్యకు ప్లాన్ చేసినట్లు ఆరోపించింది. ప్రస్తుతం నిఖిల్ గుప్తాను ఎఫ్బీఐ ఆదేశాల మేరకు చెక్ రిపబ్లిక్ దేశంలో అరెస్ట్ చేశారు. అతడిని తమకు అప్పగించాలని చెక్ రిపబ్లిక్ని అమెరికా కోరుతోంది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో