NIA: భారత్ పై దాడికి ఖలిస్థానీ ఉగ్రవాదుల కుట్ర
ప్రపంచంలోని 5 దేశాల్లో ఉన్న ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్)కి చెందిన 5 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు భారత్పై భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారు. వారు విదేశాలలో నుంచి ప్లాట్లు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుంచి వచ్చిన వివరాల ఆధారంగా, హోం మంత్రిత్వ శాఖ NIA విచారణకు ఆదేశించింది. దీంతో వెంటనే ఎన్ఐఏ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ఇన్పుట్ ఆధారంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, విదేశాల్లో సమావేశమై భారతదేశానికి వ్యతిరేకంగా కుట్ర చేస్తున్న ఖలిస్తాన్ ఉగ్రవాదులపై దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఉగ్రవాదులకు భారత్ నుంచి హవాల ద్వారా డబ్బు చేరుతోందని గుర్తించింది. 5 మంది ఖలిస్థానీలు NIA రాడార్లో ఉన్నట్లు తేల్చింది.
READ MORE: ‘ఛలో ఏపీ’ అంటూ.. రాజకీయ నాయకుల తలరాతలు మార్చడానికి సిద్దమైన బెంగళూరు ఆంధ్ర ఓటర్లు..
Also Read
- West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
- TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
- Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
- RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం.. యూఏఈలో నివసిస్తున్న బల్జీత్ సింగ్ అలియాస్ బల్జీత్ మౌర్, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న గుర్జంత్ సింగ్, కెనడాలో నివసిస్తున్న ప్రిన్స్ చౌహాన్, అమెరికాలో నివసిస్తున్న అమన్ పూరేవాల్, పాకిస్థాన్కు చెందిన బిలాల్ మన్షేర్ ఈ కేసులో ప్రధాన కుట్రదారులు. ఈ ఐదుగురు నిందితులు ఖలిస్థానీ టైగర్ ఫోర్స్ (కేటీఎఫ్) అనే సంస్థతో సంబంధం కలిగి ఉన్నారు. పంజాబ్లోని పాటియాలా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖలిస్థానీ ఉగ్రవాది కమల్జీత్ శర్మతో ఈ ఐదుగురు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ఉద్దేశంతో జైలులో ఉన్న ఖైదీలను KTF కోసం రిక్రూట్ చేయడానికి కమల్జీత్ శర్మ పనిచేస్తున్నాడు. కమల్జీత్పై ఇప్పటికే 3 ఇతర ఎన్ఐఏ కేసుల్లో ఛార్జిషీట్ దాఖలైంది. వీరంతా కలిసి పంజాబ్లో ఖలిస్థానీ నెట్వర్క్ను బలోపేతం చేయడం, ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్, ఉగ్రవాద కార్యకలాపాలకు డబ్బు వసూలు చేయడం వంటివి చేస్తున్నారు.
తాజావార్తలు
-
PEDDI Press Meet : ‘పెద్ది’ షూటింగ్ ఫినిష్.. నేడు మేకర్స్ భారీ ప్రెస్ మీట్.. రిలీజ్ డేట్ ఛేంజ్
-
Virat Kohli: అంపైర్లతో విరాట్ కోహ్లీ వాగ్వాదం.. కింగ్ ఆగ్రహం సరైందేనా?, నిబంధనలు ఏమంటున్నాయి?
-
West Bengal Elections 2026: ఫలితాలకు ముందే రణరంగా మారిన బెంగాల్.. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర దీదీ ధర్నా..
-
TTD Laddu Report: తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక.. కీలక అంశాలు వెలుగులోకి తెచ్చిన ఏక సభ్య కమిటీ..
-
Mamata Banerjee: బీహార్, మహారాష్ట్ర కాదు.. ఇది బెంగాల్.. ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ విమర్శలు
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!