చెన్నైలో బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. కాగా.. హోంగ్రౌండ్లో అశ్విన్ సెంచరీతో చెలరేగాడు. 108 బంతుల్లో శతకం సాధించాడు.
Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తన హత్యకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ సివిల్ దావా వేసిన నేపథ్యంలో అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది.
Jamili Elections: దేశంలో జమిలి ఎన్నికలపై రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది. అనుకూల, ప్రతికూల వాదనలు ఎలా ఉన్నా జమిలి ఎన్నికల సాధ్యంపై మోడీ సర్కార్ ముందు పలు సవాళ్లున్నాయి. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సిన పరిస్థితి ఏర్పాడింది.
Israeli–Palestinian conflict: పాలస్తీనాలో ఆక్రమిత ప్రాంతం నుంచి ఇజ్రాయెల్ తప్పుకోవాలని ఐక్యరాజ్యసమితి బుధవారం నాడు తీర్మానం చేసింది. ఇందు కోసం 12 నెలల పాటు గడువు ఇచ్చింది.
భారత్లో రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. కేరళ ప్రభుత్వం బుధవారం దీనిని ధృవీకరించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) నుండి ఇటీవల తిరిగి వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు. మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి యూఏఈ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పాజిటివ్గా తేలిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
సింధు నదీ జలాల ఒప్పందాన్ని సమీక్షించాల్సిందిగా భారత ప్రభుత్వం పాకిస్థాన్ ప్రభుత్వానికి గట్టిగా నోటీసు పంపింది. ఈ ఒప్పందం చాలా పాతదని, మార్పులు కోరుకుంటున్నామని పాకిస్థాన్కు పంపిన నోటీసులో భారత్ పేర్కొంది.
New Chinese Heliport: అరుణాచల్ ప్రదేశ్లోని సున్నితమైన 'ఫిష్టెయిల్స్' ప్రాంతానికి సమీపంలో వాస్తవ నియంత్రణ రేఖకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో కొత్త హెలిపోర్ట్ ను డ్రాగన్ కంట్రీ నిర్మిస్తుంది. మారుమూల ప్రాంతంలోకి సైనికు వేగంగా తరలించే సామర్థ్యాన్ని చైనా సాయుధ దళాలు రెడీ చేసుకుంటున్నాయి.