Maharashtra Navnirman Sena: పదేళ్ల తర్వాత భారత్లో పాకిస్థాన్ సినిమా.. తన్నులు తప్పవు!
- పాకిస్థానీ నటులు ఫవాద్ ఖాన్.. మహిరా ఖాన్లు నటించిన చిత్రం
- త్వరలో భారత్ లో విడుదల కానున్నట్లు ప్రకటన
- తన్నులు తప్పవన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థానీ నటులు ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్లు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ‘ది లెజెండ్ ఆఫ్ మౌలా జట్’ త్వరలో భారతదేశంలో విడుదల కానుందని ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) మరోసారి పాకిస్థానీ కళాకారులు, చిత్రాలకు వ్యతిరేకంగా ముందుకొచ్చింది. పాకిస్థానీ సినిమాను భారతదేశంలో విడుదల చేయడానికి అనుమతించబోమని మహారాష్ట్ర నవనిర్మాణ సేన నేత అమయ్ ఖోప్కర్ స్పష్టం చేశారు. అంతేకాదు పాకిస్థానీ నటులెవరైనా భారత్కు వస్తే కొడతామని హెచ్చరించారు.
READ MORE: Israel-Hamas war: గాజా ఆశ్రయంపై ఇజ్రాయెల్ దాడి.. 22 మంది మృతి
Also Read
అమయ్ ఖోప్కర్ ఓ ఇంటర్వ్యూలో పాకిస్థాన్ నుంచి వచ్చిన కళాకారులపై మాట్లాడుతూ.. “మన దేశంపై పాకిస్థాన్ నిరంతరం దాడులు చేస్తోంది. గత వారం కూడా మన సైనికులు వీరమరణం పొందిన దాడులు జరిగాయి. మన దేశంలోని అనేక నగరాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. మన దేశ సైనికులు అమరులయ్యారు. అటువంటి పరిస్థితిలో పాకిస్థాన్ నుంచి మనకు కళాకారులు ఎందుకు అవసరం? మన దేశంలో కళాకారులు లేరా? ఇక్కడ సినిమాలు చేయలేదా? ముంబయిలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారుల ఇళ్లలో టీవీని ఆన్ చేసినప్పుడు… వారు ఈ పాకిస్థానీ కళాకారుల ప్రదర్శనలను చూస్తారా? వారి కళాకారులు మాకు వద్దు. పాకిస్థాన్కు చెందిన ఏ ఆర్టిస్ట్ని లేదా సినిమాను ఇక్కడ విడుదల చేయడానికి మేము అనుమతించం. ఇతర రాష్ట్రాలు కూడా తమ నగరాల్లో పాకిస్థానీ చిత్రకారుడు లేదా సినిమా విడుదల చేయకూడదని నేను చెబుతున్నాను. తప్పకుండా నిరసన తెలుపుతాం. ” అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
READ MORE:Indus Water Treaty: మోడీ మాస్టర్ స్ట్రోక్.. ఇదే జరిగితే పాకిస్తాన్ ఎడారిగా మారడం ఖాయం..
పాకిస్థానీ నటులతో పాటు బాలీవుడ్ తారలను కూడా అమయ్ ఖోప్కర్ విమర్శించారు. పాకిస్థానీ కళాకారులతో కలిసి పనిచేయడానికి మద్దతిచ్చే బాలీవుడ్ ప్రముఖులకు ఆయన సందేశం ఇచ్చారు. “బాలీవుడ్ నిర్మాతలు సిగ్గుపడాలి” అని అన్నారు. మన దేశంలో చాలా టాలెంట్ ఉంది. అలాంటప్పుడు బయటి నుంచి.. ముఖ్యంగా పాకిస్థాన్ నుంచి కళాకారులను తీసుకురావాల్సిన అవసరం ఏమిటి? మీరు ఎంత ప్రయత్నించినా పాకిస్థానీ ఆర్టిస్టులెవరూ ఇక్కడికి వచ్చి ప్రదర్శనలు ఇవ్వడానికి లేదా సినిమాలను ప్రదర్శించడానికి అనుమతించం. ప్రస్తుతం పాకిస్థానీ కళాకారులు ఇక్కడికి వచ్చి తమ సినిమాను ప్రమోట్ చేస్తారనే చర్చలు జరుగుతున్నాయి. ఆ తరహాలో అస్సలు ఆలోచించవద్దని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను. ప్రమోషన్ గురించి ఆలోచించకండి. లేకపోతే దెబ్బలు తింటారు. చేతులు, కాళ్లు విరిగిపోతాయి అని ఆయన హెచ్చరించారు.
తాజావార్తలు
-
NTR Neel: యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ప్రశాంత్ నీల్ గిఫ్ట్ రెడీ.. ఇక రచ్చ రచ్చే!
-
West Bengal: కలకత్తా హైకోర్టులో మమతా బెనర్జీకి ఘోర అవమానం..
-
RCB: పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నా.. ఆర్సీబీ కంటే ఆ జట్టుకే ప్లే ఆఫ్ అవకాశాలు..
-
White House: చైనాలో ట్రంప్ టూర్.. హార్ముజ్ జలసంధిపై వైట్హౌస్ కీలక ప్రకటన
-
Health Tips : పార్టీ చేసుకున్న మరుసటి రోజే జిమ్కు వెళ్తున్నారా..? అయితే జాగ్రత్త..!
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?