India-Russia : తప్పుడు కథనాలతో.. భారత్పై బురద చల్లేందుకు యత్నిస్తున్న అంతర్జాతీయ మీడియా!
- భారత్ నుంచి మందుగుండు సామగ్రి ఉక్రెయిన్కు చేరుతోందని రాయిటర్స్ నివేదిక
- తప్పుడు కథనాలతో.. భారత్పై బురద చల్లేందుకు యత్నం
- ఖండించిన భారత ప్రభుత్వం
భారతదేశం నుంచి మందుగుండు సామగ్రి ఉక్రెయిన్కు చేరుతోందని అంతర్జాతీయా వార్తా సంస్థ రాయిటర్స్ కథనంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాయిటర్స్ నివేదికపై మీడియా ప్రశ్నలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. ‘మేము రాయిటర్స్ నివేదికను చూశాం. ఇది ఊహాజనిత, తప్పుదారి పట్టించే వార్త. ఇది భారతదేశ నిబంధనల ఉల్లంఘనను సూచిస్తుంది. దీనిని ఖండిస్తున్నాం.” అని పేర్కొన్నారు.
READ MORE: Amitabh Bachchan: మరాఠీవాసులకు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు.. ఎందుకంటే?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఐరోపా దేశాలకు పంపిన రక్షణ వస్తువులు ఉక్రెయిన్కు చేరుతున్నాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్కు సంబంధించిన రాయిటర్స్ నివేదికను భారత్ తిరస్కరించింది. ఈ వార్తల కారణంగా భారత్, మిత్ర దేశం రష్యా మధ్య చిచ్చు రేగే అవకాశం ఉంది. అయితే, మిలిటరీ మరియు ద్వంద్వ వినియోగ వస్తువుల ఎగుమతిపై అంతర్జాతీయ బాధ్యతలను పాటించడంలో భారతదేశం తప్పుపట్టలేని ట్రాక్ రికార్డ్ కలిగి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంపై తన అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా, చట్టపరమైన నియంత్రణ ఫ్రేమ్వర్క్ ఆధారంగా భారత్ తన రక్షణ ఎగుమతులను కొనసాగిస్తోందని తెలిపింది. తుది వినియోగదారు జవాబుదారీతనం, ధృవీకరణతో సహా సంబంధిత నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని పేర్కొంది.
READ MORE:US: అమెరికాలో ఏపీ విద్యార్థి గుండెపోటుతో మృతి.. విషాదంలో కుటుంబ సభ్యులు
రాయిటర్స్ తన కథనంలో ఇలా పేర్కొంది. “భారత్, ఐరోపా ప్రభుత్వాల మధ్య జరిగిన డిఫెన్స్ ఇండస్ట్రీ ఒప్పందం ప్రకారం.. తయారైన షెల్స్ యూరప్ దేశాలకు పంపడం గమనార్హం. భారతీయ ఆయుధ తయారీదారులు విక్రయించే ఫిరంగి ఆయుధాలను యూరోపియన్ కస్టమర్లు ఉక్రెయిన్కు పంపారు. మాస్కో నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, వాణిజ్యాన్ని ఆపడానికి న్యూఢిల్లీ జోక్యం చేసుకోలేదు. మూలాలు, కస్టమ్స్ డేటా ప్రకారం.. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు మందుగుండు సామగ్రిని పంపే పని ఒక సంవత్సరానికి పైగా కొనసాగుతోంది. భారతీయ ఆయుధాల ఎగుమతి నియమాలు ఆయుధాల వినియోగాన్ని ప్రకటించిన కొనుగోలుదారులకు మాత్రమే పరిమితం చేస్తాయి. ఇందులో అక్రమ కొనుగోలు మరియు అమ్మకాలు జరిగితే భవిష్యత్తులో అమ్మకాలు ముగిసే ప్రమాదం ఉంది.” అని రాయిటర్స్ పేర్కొంది.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!