India-Russia : తప్పుడు కథనాలతో.. భారత్పై బురద చల్లేందుకు యత్నిస్తున్న అంతర్జాతీయ మీడియా!
- భారత్ నుంచి మందుగుండు సామగ్రి ఉక్రెయిన్కు చేరుతోందని రాయిటర్స్ నివేదిక
- తప్పుడు కథనాలతో.. భారత్పై బురద చల్లేందుకు యత్నం
- ఖండించిన భారత ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశం నుంచి మందుగుండు సామగ్రి ఉక్రెయిన్కు చేరుతోందని అంతర్జాతీయా వార్తా సంస్థ రాయిటర్స్ కథనంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాయిటర్స్ నివేదికపై మీడియా ప్రశ్నలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. ‘మేము రాయిటర్స్ నివేదికను చూశాం. ఇది ఊహాజనిత, తప్పుదారి పట్టించే వార్త. ఇది భారతదేశ నిబంధనల ఉల్లంఘనను సూచిస్తుంది. దీనిని ఖండిస్తున్నాం.” అని పేర్కొన్నారు.
READ MORE: Amitabh Bachchan: మరాఠీవాసులకు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు.. ఎందుకంటే?
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
ఐరోపా దేశాలకు పంపిన రక్షణ వస్తువులు ఉక్రెయిన్కు చేరుతున్నాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్కు సంబంధించిన రాయిటర్స్ నివేదికను భారత్ తిరస్కరించింది. ఈ వార్తల కారణంగా భారత్, మిత్ర దేశం రష్యా మధ్య చిచ్చు రేగే అవకాశం ఉంది. అయితే, మిలిటరీ మరియు ద్వంద్వ వినియోగ వస్తువుల ఎగుమతిపై అంతర్జాతీయ బాధ్యతలను పాటించడంలో భారతదేశం తప్పుపట్టలేని ట్రాక్ రికార్డ్ కలిగి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంపై తన అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా, చట్టపరమైన నియంత్రణ ఫ్రేమ్వర్క్ ఆధారంగా భారత్ తన రక్షణ ఎగుమతులను కొనసాగిస్తోందని తెలిపింది. తుది వినియోగదారు జవాబుదారీతనం, ధృవీకరణతో సహా సంబంధిత నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని పేర్కొంది.
READ MORE:US: అమెరికాలో ఏపీ విద్యార్థి గుండెపోటుతో మృతి.. విషాదంలో కుటుంబ సభ్యులు
రాయిటర్స్ తన కథనంలో ఇలా పేర్కొంది. “భారత్, ఐరోపా ప్రభుత్వాల మధ్య జరిగిన డిఫెన్స్ ఇండస్ట్రీ ఒప్పందం ప్రకారం.. తయారైన షెల్స్ యూరప్ దేశాలకు పంపడం గమనార్హం. భారతీయ ఆయుధ తయారీదారులు విక్రయించే ఫిరంగి ఆయుధాలను యూరోపియన్ కస్టమర్లు ఉక్రెయిన్కు పంపారు. మాస్కో నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, వాణిజ్యాన్ని ఆపడానికి న్యూఢిల్లీ జోక్యం చేసుకోలేదు. మూలాలు, కస్టమ్స్ డేటా ప్రకారం.. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్కు మందుగుండు సామగ్రిని పంపే పని ఒక సంవత్సరానికి పైగా కొనసాగుతోంది. భారతీయ ఆయుధాల ఎగుమతి నియమాలు ఆయుధాల వినియోగాన్ని ప్రకటించిన కొనుగోలుదారులకు మాత్రమే పరిమితం చేస్తాయి. ఇందులో అక్రమ కొనుగోలు మరియు అమ్మకాలు జరిగితే భవిష్యత్తులో అమ్మకాలు ముగిసే ప్రమాదం ఉంది.” అని రాయిటర్స్ పేర్కొంది.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?