నేడు ఏపీ కేబనెట్ భేటీ.. కీలక అజెండాపై చర్చ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఇవాళ జరుగనుంది. ఉదయం 11 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరుగనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకం విధి విధానాలకు ఆమోద ముద్ర వేయనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల పథకం లబ్ధిదారులు, పథకానికి అర్హుల ఎంపిక,…
Kartarpur Sahib Corridor Agreement: ఇటీవల విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ SCO సదస్సులో పాల్గొనేందుకు పాకిస్థాన్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కర్తార్పూర్ సాహిబ్ కారిడార్పై భారత్ – పాకిస్తాన్ తమ ఒప్పందం చెల్లుబాటును మరో ఐదేళ్ల పాటు పొడిగించాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సిక్కు యాత్రికులకు ఇది నిజంగా శుభవార్త. ఈ దౌత్య నిర్ణయం కారిడార్ నిరంతర ఆపరేషన్కు మార్గం సుగమం చేస్తుంది. ఇది పాకిస్తాన్లోని…
PM Modi- Xi Jinping: బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమ్మిట్ కోసం రష్యాలోని కజాన్ నగరానికి వెళ్లిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (బుధవారం) చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో ద్వైపాక్షిక సమావేశం కానున్నారు.
Air India Kanishka bombing case: 1985 ఎయిర్ ఇండియా కనిష్క బాంబు పేలుడు ఘటనలో అనుమానితుడిగా ఉండీ, నిర్దోషిగా విడుదలైన సిక్కు వ్యక్తి రిపుదమన్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్యకు పాల్పడిన వ్యక్తులు ఇద్దరూ తమ నేరాన్ని అంగీకరించారుర. వీరికి కెనడియన్ కోర్టులో సెకండ్ డిగ్రీ హత్య కేసు నమోదైనట్లు మీడియా నివేదికలు తెలిపాయి.
కశ్మీర్లోని గందర్బాల్ జిల్లాలో సొరంగం నిర్మాణ సంస్థ క్యాంప్సైట్పై ఆదివారం రాత్రి ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఒక వైద్యుడు, ఆరుగురు కార్మికులు మరణించారు.
వక్ఫ్ బిల్లుపై మంగళవారం జరిగిన సంయుక్త పార్లమెంటరీ సమావేశంలో మరోసారి దుమారం చెలరేగింది. సమావేశంలో బీజేపీ, టీఎంసీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీపై బాటిల్ విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలో అతని చేతికి గాయమైంది. సమావేశం అనంతరం గది నుంచి బయటకు వస్తుండగా కళ్యాణ్ బెనర్జీ బొటన వేలికి గాయమైంది. నివేదిక ప్రకారం, బీజేపీ ఎంపీ అభిజీత్ గంగోపాధ్యాయతో వాగ్వాదం జరిగింది. దీనికి ముందు కూడా జేపీసీ…
India China LAC: భారత్ – చైనా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి తూర్పు లడఖ్లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) పై పెట్రోలింగ్కు సంబంధించి ఒక ముఖ్యమైన ఒప్పందంపై సంతకం చేశాయి ఇరు దేశాలు. ఇరుదేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడంలో, సరిహద్దు నుండి దళాల ఉపసంహరణ ప్రక్రియను తగ్గించడంలో ఈ ఒప్పందం ప్రధాన చర్యగా పరిగణించబడుతుంది. Read Also: Bomb Threat: 30 విమానాలను పైగా బాంబు బెదరింపులు.. 8 రోజుల్లో 120కి…
గ్లాస్గోలో జరిగే 2026 కామన్వెల్త్ క్రీడల నుంచి 9 గేమ్స్ను తొలగించారు. క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, స్క్వాష్, రెజ్లింగ్, షూటింగ్, నెట్ బాల్, రోడ్ రేసింగ్ను తొలగించారు. ఈ మేరకు కామన్వెల్త్ క్రీడల సమాఖ్య ఓ ప్రకటన విడుదల చేసింది. ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఈసారి 10 గేమ్స్ను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. గ్లాస్గోలోని నాలుగు వేదికలు మాత్రమే ఆటలకు ఆతిథ్యం ఇస్తాయి. కామన్వెల్త్ క్రీడలు నాలుగేళ్లకొసారి జరుగుతాయన్న విషయం తెలిసిందే. 2026లో స్కాట్లాండ్లోని…