IND vs AUS: ఉత్కంఠ ఫలితంగా సాగిన భారత్ – ఆస్ట్రేలియా సెమి ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది. చివరి వరకు నువ్వా.. నేనా.. అన్నట్లుగా సాగిన మ్యాచ్లో చివరకు టీమిండియా ఆధిపత్యం కొనసాగించింది. దీంతో టీం ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్లో అడుగు పెట్టింది. ఇక మ్యాచ్ భారీ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ మరోమారు తనదైన శైలి బ్యాటింగ్ తో 84 పరుగులు చేసి టీమిండియా విజయానికి బాటలు…
దుబాయ్ తమ సొంతగడ్డ కాదు అని, ఇక్కడ భారత్ ఎక్కువ మ్యాచ్లేమీ ఆడలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. దుబాయ్ పిచ్ ప్రతిసారీ భిన్న సవాళ్లను విసురుతోందని, తాము ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక్కోసారి ఒక్కో రకంగా స్పందించిందన్నాడు. దుబాయ్ మైదానంలో నాలుగు పిచ్లు ఉన్నాయని, సెమీ ఫైనల్ దేనిపై ఆడిస్తారో తెలియదని హిట్మ్యాన్ చెప్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ ఒకే మైదానంలో ఆడుతోందని, భారీ లాభం పొందుతోందని కొందరు మాజీలు, క్రికెటర్లు అంటున్న…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నాకౌట్ మ్యాచ్లకు సమయం ఆసన్నమైంది. మొదటి సెమీస్లో టాప్ టీమ్స్ భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది. లీగ్ దశలో మూడుకు మూడు మ్యాచ్లలో ఘన విజయాలు సాధించిన రోహిత్ సేనకు సెమీస్ అంత ఈజీ కాదు. ఎందుకంటే ఐసీసీ టోర్నీల్లో నాకౌట్లో కంగారూలు రెచ్చిపోతారు. అయితే దుబాయ్లో ఇప్పటికే మూడు మ్యాచ్లు ఆడిన అనుభవం, పిచ్కు తగ్గ బలమైన స్పిన్ ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశం.…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ ఆరంభమైంది. మూడు లీగ్ మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. టీమిండియా ఈ మ్యాచులో గెలిచి ఫైనల్ చేరాలని భావిస్తోంది. అంతేకాదు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీలో ఆసీస్ కొంత బలహీన పడ్డట్లు కనిపిస్తున్నా.. ఆ జట్టును తక్కువ అంచనా…
IND vs AUS: ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మొదటి సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 4న జరగనుంది. ఐసీసీ టోర్నమెంట్ లలో ఇరు జట్లకు సెమీఫైనల్లో మూడోసారి తాడోపేడో తేల్చుకోనున్నారు. క్రితం రెండు సార్లు ఐసీసీ టోర్నమెంట్ సెమీఫైనల్లో ఇరు జట్లు ఎప్పుడు తలపడ్డాయి? అందులో ఎవరు గెలిచారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటూనే.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మొదటి సెమీఫైనల్లో గెలుపు ఎవరిది అనేది చూద్దాం. Read Also: IOB Recruitment…
Champions Trophy 2025: ప్రస్తుతం పాకిస్తాన్లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మెగా టోర్నమెంట్లో ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే జట్లు తలపడనున్నాయి. క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీపై ఇప్పటికే అనేక అంచనాలు మొదలయ్యాయి. తాజాగా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్లో తలపడతాయని.. ఈసారి భారత్ విజేతగా నిలుస్తుందని పేర్కొన్నాడు. అదికూడా, భారత్ కేవలం ఒక్క పరుగు…
జస్ ప్రీత్ బుమ్రా.. బుల్లెట్ లాంటి బంతులతో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి ప్లేయర్స్ కు ముచ్చెమటలు పట్టిస్తాడు. మెరుపు బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లను చతికిలపడేస్తాడు. టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషిస్తుంటాడు. క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు జస్ ప్రీత్ బుమ్రా. ఇప్పుడు మరోసారి అరుదైన గౌరవాన్ని దక్కించుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2024కి గానూ ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. ఇంటర్నేషనల్ క్రికెట్…
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల కోల్పోయిన తన ఫామ్ను తిరిగి పొందేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు కోసం తాజాగా రోహిత్ రంజీ జట్టుతో ప్రాక్టీస్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రోహిత్ ముంబయి రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. గత కొంతకాలంగా ఫామ్ లో లేకపోవడంతో అతడు జట్టులో చోటు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు పూర్తిగా విఫలమైంది. ఇకపోతే మరోవైపు, రోహిత్ శర్మ ఈ నెల…
Pat Cummins: క్రికెటర్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉండడం సహజమే. ముఖ్యంగా టీమిండియా లాంటి ఆటగాళ్లకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇకపోతే, ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్కు కేవలం వారి దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఉన్నారు. అందులో ఎందరో మహిళా అభిమానులు కూడా ఉన్నారు. ఇకపోతే తాజాగా, ‘డేట్ విత్ ఏ సూపర్ స్టార్’ అనే టీవీ షోలో కమిన్స్ తనపై ఉండే ఫీమేల్ అటెన్షన్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.…
ఇటీవలి కాలంలో టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు టెస్టుల్లో విఫలమవుతున్నారు. సొంతగడ్డపై న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో తీవ్రంగా నిరాశపర్చారు. దాంతో కోహ్లీ, రోహిత్లపై పలువురు టీమిండియా మాజీలు, అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీమ్ నుంచి తప్పుకుని యువకులకు అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే టీమిండియా మాజీ ఆల్రౌండర్, సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్ వీరికి మద్దతుగా నిలిచారు. కోహ్లీ, రోహిత్లపై విమర్శలు సరికావని.. గతంలో వారు ఏం సాధించారో ఫాన్స్…