IND vs AUS: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్
- ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో భారత్.
- సెమి ఫైనల్ లో ఆస్ట్రేలియాపై 4 వికెట్ల విజయం సాధించిన భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AUS: ఉత్కంఠ ఫలితంగా సాగిన భారత్ – ఆస్ట్రేలియా సెమి ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా ఘనవిజయం సాధించింది. చివరి వరకు నువ్వా.. నేనా.. అన్నట్లుగా సాగిన మ్యాచ్లో చివరకు టీమిండియా ఆధిపత్యం కొనసాగించింది. దీంతో టీం ఇండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫైనల్లో అడుగు పెట్టింది. ఇక మ్యాచ్ భారీ లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ మరోమారు తనదైన శైలి బ్యాటింగ్ తో 84 పరుగులు చేసి టీమిండియా విజయానికి బాటలు వేశాడు.
మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆల్ అవుట్ అయింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ 73 పరుగులు, అలెక్స్ క్యారీ 61 పరుగులతో ఆస్ట్రేలియా భారీ స్కోర్ ను సాధించింది. ఇక టీమ్ ఇండియా బౌలర్లలో మహమ్మద్ షమీ మూడు వికెట్లు.. రవీంద్ర జెడేజా, వరుణ్ చక్రవర్తిలు రెండు వికెట్లు తీసుకోగా.. అక్షర పటేల్, హార్దిక్ పాండ్యాలు చెరో వికెట్ సాధించారు.
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఇక లక్ష్య ఛేదనలో దూకుడుగా ఆటను మొదలుపెట్టిన టీమిండియా బ్యాట్స్మెన్స్ శుభమన్ గిల్ 30 పరుగుల వద్ద మొదటి వికెట్ రూపంలో వెనుతిరిగాడు. ఆ తర్వాత 28 పరుగులు చేసిన రోహిత్ శర్మ కూడా వెనుతిరిగాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ టీమిండియా స్కోర్ బోర్డ్ పై ఒక్కో పరుగు చేరుస్తు.. టీమ్ ఇండియాను విజయానికి చేరువ చేశారు. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ 45 పరుగుల వద్ద అవుట్ అవ్వగా.. స్కోర్ బోర్డ్ వేగం నెమ్మదించింది. ఆ తర్వాత అక్షర్ పటేల్ 27 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో హార్దిక్ పాండ్యా 24 బంతుల్లో 28 పరుగులు చేసి కీలక సమయంలో టీమిండియాను ఆదుకున్నాడు. ఇక కీపర్ కేఎల్ రాహుల్ 34 బంతుల్లో 42 పరుగులు చేసి విజయానికి అవసరమైన పరుగులు సాధించి టీమిండియాను ఛాంపియన్ ట్రోఫీ 2025 ఫైనల్ కు చేర్చాడు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..