ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీస్ మ్యాచ్ ఆరంభమైంది. మూడు లీగ్ మ్యాచుల్లో ఘన విజయాలు సాధించిన రోహిత్ సేన.. ఆస్ట్రేలియాపై అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. టీమిండియా ఈ మ్యాచులో గెలిచి ఫైనల్ చేరాలని భావిస్తోంది. అంతేకాదు 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. అయితే స్టార్ ఆటగాళ్ల గైర్హాజరీలో ఆసీస్ కొంత బలహీన పడ్డట్లు కనిపిస్తున్నా.. ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే నాకౌట్ మ్యాచ్ అంటేనే ఆస్ట్రేలియా ఆటగాళ్లు పూనకం వచ్చినట్లు ఊగిపోతారు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్.. 144 పరుగులు వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన జోష్ ఇంగ్లిస్ (11)
టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్ లో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అర్థ శతకంతో మెరిశాడు. 68 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 26.3 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్ 141/3
మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. మార్నస్ లబుషేన్ ను ఔట్ చేసిన రవీంద్ర జడేజా.. 29 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టిన లబుషేన్
తన బౌలింగ్లో స్టీవ్ స్మిత్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను మహ్మద్ షమీ అందుకోలేక పోయాడు.. మ్యాచ్ ప్రారంభంలో ట్రావిస్ హెడ్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను కూడా అతడి ఒడిసిపట్టలేకపోయాడు. 22 ఓవర్లకు ఆస్ట్రేలియా స్కోర్ 110/2
ఆచితూచి ఆడుతున్న ఆస్ట్రేలియా బ్యాటర్లు.. నెమ్మదిగా పరుగులు రాబడుతున్న ఆసీస్.. క్రీజులో స్టీవ్ స్మిత్ (26), లబుషేన్ (9).. 15.4 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 80/2
భారత్ కు తలనొప్పిగా మారిన హెడ్ ఔట్.. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో ట్రావిస్ హెడ్ అవుట్.. భారీ షాట్ ఆడబోయి గిల్ కి క్యాచ్ ఇచ్చిన హెడ్.. 9 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 58/2
రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 33 బంతుల్లో 39 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్.. 8.2 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 54/1
సెమీస్ లో తమ మొదటి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా.. 4 పరుగుల వద్ద కూపర్ ఔట్.. షమీ బౌలింగ్లో కీపర్ రాహుల్కు క్యాచ్ ఇచ్చిన కూపర్..
సెమీస్ మ్యాచులో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా కూపర్, ట్రావిస్ హెడ్ క్రీజులోకి వచ్చారు. భారత్ బౌలింగ్ను షమీ మొదలెట్టాడు.
తొలి సెమీస్లో ఆస్ట్రేలియా జట్టులో ఆరుగురు స్పిన్నర్లు ఉన్నారు. జంపా, తన్వీర్, కూపర్, మ్యాక్స్వెల్, హెడ్, లబుషేన్ స్పిన్ బౌలింగ్ వేయనున్నారు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
ఆస్ట్రేలియా: కూపర్ కొన్నెల్లీ, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), అలెక్స్ కేరీ, గ్లెన్ మ్యాక్స్వెల్, బెన్ డ్వారిషూస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా.
భారత్ వరుసగా 14వ సారి టాస్ ఓడింది. కెప్టెన్గా ఇది రోహిత్ శర్మకు 11వ సారి కావడం గమనార్హం.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: సెమీస్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. తుది జట్టులో రెండు మార్పులు చేసిన ఆసీస్ కెప్టెన్ స్మిత్.. మ్యాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్, జాన్సన్కి బదులుగా సంఘా.. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయని భారత సారథి రోహిత్ శర్మ
ఆస్ట్రేలియా ఓపెనర్ మ్యాథ్యూ షార్ట్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుంచి వైదొలిగాడు. అతడికి బదులు కూపర్ రిప్లేస్ను సీఏ తీసుకుంది. అయితే కూపర్ బదులుగా జేక్ ఫ్రేజర్ మెక్గుర్క్ను తుది జట్టులోకి తీసుకోవాలని మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సూచించాడు.
సెమీస్లో అందరి దృష్టి ట్రావిస్ హెడ్ పైనే ఉంది. భారత్ అంటే చెలరేగిపోయే హెడ్ను కట్టడి చేస్తే.. సగం విజయం సాధించినట్లేనని అని మాజీలు, ఫాన్స్ అంటున్నారు.
రవీంద్ర జడేజాను తప్పించి వాషింగ్టన్ సుందర్కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. గాయపడిన మమ్మద్ షమీ కోలుకోకపోతే.. అర్ష్దీప్ సింగ్ లేదా హర్షిత్ రాణాకి చోటు దక్కుతుంది.
మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్ ఆరంభం కానుంది. కేఎల్ రాహుల్ స్థానంలో రిషబ్ పంత్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆస్ట్రేలియాపై పంత్కు మంచి రికార్డు ఉండడం, లీగ్ దశలో కీపర్గా రాహుల్ విఫలమవడం ఇందుకు కారణం అని సమాచారం.