PM Modi: జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోడీ.. ఈ అంశాలపైనే మాట్లాడే అవకాశం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఏ అంశంపై ప్రసంగిస్తారు అనే సమాచారం లేదు. అయితే.. రేపుటి నుంచి జీఎస్టీ 2.0 అమలు కానుంది. ఈ జీఎస్టీ సంస్కరణలపై ప్రధాని మోడీ సమాచారం అందించవచ్చని భావిస్తున్నారు. జీఎస్టీ 2.0లో భాగంగా.. అనేక ఉత్పత్తులపై రేట్లు తగ్గనున్నాయి. గతంలో జీఎస్టీలో నాలుగు స్లాబులు ఉండటా.. ప్రస్తుతం 5%, 18% స్లాబులకు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఇందులో 12%, 28% పన్ను స్లాబ్లు తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 12% స్లాబ్లోని చాలా ఉత్పత్తులను 5% స్లాబ్లో ఉంచగా, 28% స్లాబ్లోని ఉత్పత్తులను 18% స్లాబ్లోకి చేర్చారు. కొన్ని నిత్యవరసర సరకులపై జీఎస్టీ రేటు సున్నాకి తగ్గించారు.
Also Read
మరోవైపు.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం అమెరికాకు నచ్చడం లేదు. భారత్పై అమెరికా అదనపు సుంకాల మోత మోగించింది. దీంతో అమెరికాతో భారతదేశం సంబంధాలు దెబ్బతిన్న తరుణంలో ప్రధాని మోడీ ప్రసంగం వార్త వచ్చింది. అంతే కాకుండా.. ట్రంప్ పరిపాలన కొత్త H-1B వీసా దరఖాస్తుల వార్షిక రుసుమును US$100,000 (సుమారు రూ. 88 లక్షలు) కు పెంచింది. దీని వలన భారతీయులు, ముఖ్యంగా H-1B వీసాదారులలో ఆందోళన మొదలైంది. ఈ సుంకాలు విధించాలనే యూఎస్ నిర్ణయం, H-1B వీసాలపై భారీ రుసుము పెంపుపై ఇప్పటికే మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. అందరితో మిత్రత్వం, సత్సంబంధాలు కోరుకునే, కొనసాగించే భారత్కు ప్రపంచంలో ప్రత్యేకంగా శత్రువంటూ ఎవరూ లేరనే చెప్పాలి. కానీ ఇతర దేశాలపై ఆధారపడటం అనే వైఖరి మనకు పెద్ద శత్రువులా తయారైంది. ఇలా మనపై పైచేయి సాధిస్తున్న పరాదీనతను మనందరం కలసికట్టుగా ఓడిద్దాం. విదేశాలపై అతిగా ఆధారపడితే అంతగా స్వదేశం విఫలమవుతుందని మోడీ గుజరాత్ ప్రసంగంలో తెలిపారు.. ఈ అంశంపై ఇప్పుడు మాట్లాడే అవకాశం ఉంది.
READ MORE: The last Solar Eclipse : ఈ ఏడాదిలో నేడు కనిపించనున్న చివరి సూర్య గ్రహణం..
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!