India-US: “ట్రంప్ భారీ తప్పు చేశాడు, భారతీయులు తలవంచరు”.. సుంకాలపై యూఎస్ ఎక్స్పర్ట్..
- భారత్పై ట్రంప్ సుంకాలు..
- స్వదేశంలోనే విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్..
- భారతీయులు ఎవరికీ తలవంచరు..
- భారీ తప్పు చేశారని ట్రంప్ని విమర్శించిన యూఎస్ నిపుణుడు..
India-US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన 50 శాతం సుంకాలను ఆర్థిక, రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీస్తోందని హెచ్చరిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు, చికాగో విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అయిన జాన్ మెయర్షీమర్, ట్రంప్ వైఖరిని తప్పుపట్టారు. ట్రంప్ పరిపాలన భారత విధానాన్ని ‘‘భారీ తప్పు’’గా అభివర్ణించారు. రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్పై సెకండరీ టారిఫ్స్ పనిచేయవని అన్నారు.
Read Also: Uttar Pradesh: మూడు విశ్వవిద్యాలయాలలో 468 కాంట్రాక్ట్, 480 అవుట్సోర్సింగ్ పోస్టులకు ఆమోదం
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
‘‘ ఇది మన వైపు(యూఎస్ఏ) వైపు నుంచి జరిగిన భారీ తప్పు. నమ్మడం కష్టం కానీ, భారత్పై ఆంక్షలు పనిచేయవు. రష్యా నుంచి చమురు నిలిపేయబోమని భారతీయులు స్పష్టం చేశారు. భారతీయులు తలవంచరు’’ అని ఆయన గత వారం పాడ్కాస్ట్ ఫ్లాట్ఫామ్ ‘‘డేనియల్ డేవిస్ డీప్ లైవ్’’తో అన్నారు. ట్రంప్ భారత్తో ఉన్న ‘‘అద్భుతమైన’’ సంబంధాలను విషపూరితం చేశారని మెయర్షీమర్ ఆరోపించారు. జనవరిలో ట్రంప్ అధికారం చేపట్టినప్పుడు భారత్తో యూఎస్ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని, చైనాను నియంత్రించడానికి భారత్తో మంచి సంబంధాలు కలిగి ఉండాలని, కానీ ఆంక్షలు, సుంకాలతో భారత్తో సంబంధాలను దెబ్బతీశారని ఆయన అన్నారు.
‘‘భారతీయులు మాపై కోపంగా ఉన్నారు. మోడీకి ఫోన్ ట్రంప్ నాలుగు సార్లు ఫోన్ చేయడానికి ప్రయత్నించారు. మోడీ అతడితో మాట్లాడటానికి నిరాకరించారు. మోడీ చైనా, రష్యాకు దగ్గర అవుతున్నారు. ఇది నిజంగా ప్రతీకూలంగా మారింది’’ అని మెయర్షీమర్ అన్నారు. వైట్హౌజ్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారోపై కూడా షీమర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తి తప్పుడు చర్యల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి, దీనికి సుఖాంతం ఎలా వస్తుందో అర్థం కావడం లేదని అన్నారు. భారత్ని మోకాళ్లపై నిలబెట్టాలని నమ్మిన వారు ఎవరు నాకు తెలియదు, కానీ ప్రతీసారి ఇది తప్పు అని తేలిందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!