ఓవైపు దాడులు చేస్తూనే.. మరోవైపు భారత్లో కాళ్ల బేరానికి వచ్చినట్టే కనిపిస్తోంది.. పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్ దార్.. భారత్ ముందు ఓ కీలక ప్రతిపాదన పెట్టారు.. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధమని ప్రకటించారు పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. పాకిస్తాన్పై భారత్ దాడులు ఆపితే.. తామూకూడా ఆపుతాం అని వెల్లడించారు.. భారత్ దాడులు ఆపితే ఉద్రిక్తతల తగ్గింపునకు సిద్ధం అని పేర్కొన్నారు.
సహరిద్దు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు సైరన్లు మోగిస్తూ.. బ్లాకౌట్లు ప్రకటిస్తూ.. ప్రజలను అప్రమత్తం చేస్తోంది ఇండియన్ ఆర్మీ.. అయితే, ఈ సమయంలో మీ ఫోనే.. మీకు శ్రీరామ రక్షగా నిలవబోతోంది.. Androidతో పాటు iPhoneలలో అత్యవసర హెచ్చరికలను జారీ చేస్తోంది.. ఈ అత్యవసర హెచ్చరికలు జారీ చేసేందుకు ప్రత్యేక నెట్వర్క్ ఛానెల్ని ఉపయోగిస్తారు.. నెట్వర్క్లు రద్దీగా ఉన్నప్పుడు కూడా అవి మీ ఫోన్ను చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి. మనం చేయాల్సిందల్లా.. మన ఫోన్లో సెట్టింగ్లు కాస్తా మార్చుకుని.. ఆ…
Bangladesh: పాకిస్తాన్తో ప్రతిస్పందనల మధ్య భారత్ మరోవైపు బంగ్లాదేశ్పై కూడా దృష్టి సారించింది. భారత్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న 4 బంగ్లాదేశీ మీడియా సంస్థలపై చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని బంగ్లాదేశీ మీడియానే స్వయంగా వెల్లడించింది. భారత్ తీసుకున్న ఈ చర్యతో బంగ్లాదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢాకా ట్రిబ్యూన్ కథనం ప్రకారం, బంగ్లాదేశ్కు చెందిన 4 వార్తా ఛానెళ్లను భారతదేశంలో బ్లాక్ చేయాలని నిర్ణయించారు. బ్లాక్ చేయాలని నిర్ణయించిన ఛానెళ్లలో జమునా టీవీ, యాక్టర్ టీవీ,…
Vyomika Singh : పాకిస్తాన్ తన దుర్మార్గపు చర్యలను ఏమాత్రం విరమించడం లేదు. పశ్చిమ సరిహద్దుల్లో వరుసగా మిస్సైల్ దాడులకు పాల్పడుతోంది. అంతేకాకుండా పాక్ ఫైటర్ జెట్లు పదేపదే భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నాయి. పంజాబ్లోని పలు కీలకమైన ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకున్నాయి. మానవత్వం మరిచి శ్రీనగర్లోని స్కూళ్లు, ఆసుపత్రులపై కూడా దాడులకు తెగబడుతోంది. రాడార్ కేంద్రాలు, ఆయుధ నిల్వ కేంద్రాలను కూడా టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ తన పిరికి చర్యలకు పాల్పడుతోందని వింగ్ కమాండర్ వ్యోమిక…
'ఆపరేషన్ సిందూర్'పై బాలీవుడ్ సినిమా రాబోతోంది.. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం చేపట్టిన శక్తివంతమైన ప్రతీకార చర్య అయిన 'ఆపరేషన్ సిందూర్' ఆధారంగా ఈ బాలీవుడ్ చిత్రం రాబోతోంది. 'ఆపరేషన్ సిందూర్' పేరుతోనే అధికారికంగా ఈ సినిమాను ప్రకటించారు.. అంతేకాదు.. ఓ పవర్ఫుల్ పోస్టర్ను.. అంటే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ను కూడా విడుదల చేశారు.
రాజౌరి పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ కాల్పులు జరపడంతో.. రాజౌరి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ రాజ్ కుమార్ అధికారి నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడుల్లో ఆయన మరణించారు.
Pakistani Drone Strike: పాకిస్తాన్ శుక్రవారం నాడు చీకటి పడగానే. భారత్ పై డ్రోన్లతో దాడికి దిగింది. ఇండియాలోని 26 ప్రదేశాలను టార్గెట్ గా చేసుకుని డ్రోన్లు ప్రయోగించింది.
ఇదిలా ఉంటే, దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి కాల్పులను తీవ్రం చేసింది. వీటికి ధీటుగా ఇండియా స్పందించింది. పాకిస్తాన్ ప్రయోగించిన మిస్సైల్ ఫతే-1ని భారత గగనతల రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డుకుంది. ఉత్తర భారతదేశంలో ఉన్న వ్యూహాత్మక భారత సైనిక స్థావరంపైకి ప్రయోగించిన క్షిపణిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది.
ఇదిలా ఉంటే, ఈ రోజు తెల్లవారుజామున 10 గంటలకే ఇండియన్ మిలిటరీ మీడియా సమవేశం ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. పాకిస్తా్న్ వ్యాప్తంగా ఎలాంటి విధ్వంసం సృష్టించిందనే వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సౌత్ బ్లాక్ లో మీడియా సమావేశం జరగబోతోంది.
Operation Sindoor: భారత్ పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తోంది. శుక్రవారం పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంది. ఏకంగా భారత్, పాకిస్తాన్ ఆర్మీ హెడ్క్వార్టర్స్ ఉన్న రావల్పిండిని టార్గెట్ చేసింది. రావల్పిండిలోని కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై భీకర దాడి చేసింది.