China: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య, సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసిన చైనా..
- ఇండియా-పాక్ ఉద్రిక్తతల మధ్య చైనా సైనిక కార్యకలాపాలు..
- తైవాన్కి సమీపంగా పీపుల్ లిబరేషన్ ఆర్మీ విమానాలు, నౌకలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China: పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పీఓకే ప్రాంతాల్లోని తీవ్రవాద క్షేత్రాలపై దాడులు నిర్వహించింది. దీని తర్వాత, భారత్పైకి డ్రోన్లు, క్షిపణులతో పాకిస్తాన్ దాడి చేసింది. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల్ని పెంచాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం ఆందోళన మధ్య శనివారం సాయంత్రం నుంచి రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి.
Read Also: Pope Leo: భారత్-పాక్ కాల్పుల విరమణను స్వాగతించిన కొత్త పోప్..
Also Read
ఈ ఉద్రిక్తతలు ఇలానే ఉన్న సమయంలో.. పాక్ మిత్రదేశం చైనా తన సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. చైనా తన విమానాలు, నావికా దళ నౌకలను తైవాన్ సమీపంలోకి తీసుకెళ్లాయి. ఈ విషయాన్ని తైవాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. పరిస్థితుల్ని క్షుణ్ణంగా గమనిస్తున్నట్లు తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. అంతకుముందు , శుక్రవారం తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పీపుల్ లిబరేషన్ ఆర్మీ(PLA)కి చెందిన 7 విమానాలు, 8 నేవీ నౌకలు, ఒక అనధికారిక నౌక తైవాన్ చుట్టూ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపింది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!