Indian Air Force: పాక్ దాడిలో మరో భారత జవాన్ వీరమరణం..
- నిన్న భారత్లోని అనేక ప్రాంతాలలో డ్రోన్ దాడులు
- ఉధంపూర్ వైమానిక దళ స్టేషన్ లక్ష్యంగా దాడులు
- డ్రోన్ను గాల్లోనే కూల్చివేసిన సైన్యం, రక్షణ వ్యవస్థ
- ఈ దాడిలో సురేంద్ర సింగ్ మోగా వీరమరణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శనివారం ఉదయం భారత్లోని అనేక ప్రాంతాలలో పాకిస్థాన్ డ్రోన్ దాడులను నిర్వహించింది. జమ్మూ కశ్మీర్లోని ఉధంపూర్ జిల్లాలో ఉన్న వైమానిక దళ స్టేషన్ను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం చేసింది. అయితే.. భారత సైన్యం, రక్షణ వ్యవస్థ శత్రు డ్రోన్ను గాల్లోనే కూల్చివేశాయి. ఈ సమయంలో వైమానిక దళ స్టేషన్లో విధుల్లో ఉన్న ఒక సైనికుడు వీరమరణం పొందాడు. పాకిస్థాన్ డ్రోన్ ముక్కను ఢీకొట్టడంతో అమరుడయ్యారు.
READ MORE: Bangladesh: షాకింగ్.. షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ను నిషేధించిన యూనస్ ప్రభుత్వం!
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ అమరవీరుడి పేరు సురేంద్ర సింగ్ మోగా. అతను రాజస్థాన్లోని ఝుంఝును నివాసి. ఉధంపూర్ వైమానిక దళ స్టేషన్లో విధుల్లో నిర్వహించారు. ఉదయం పాకిస్థాన్ డ్రోన్ దాడి చేసింది. భారత వాయు రక్షణ వ్యవస్థ డ్రోన్ను గాల్లోనే విజయవంతంగా ధ్వంసం చేసిందని అధికారులు తెలిపారు. కానీ శిథిలాల జవాన్ సురేంద్ర సింగ్ను ఢికొట్టాయి. అతను తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ మరణించాడు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ అమరవీరుడైన సైనికుడికి నివాళులర్పించి, ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.
READ MORE: Cease Fire Violation : భారత్లోకి చొరబడేందుకు పాక్ యత్నం.. తిప్పికొట్టిన సైన్యం!
“రాజస్థాన్ కుమారుడు, ఝుంఝును నివాసి, భారత సైనికుడు సురేంద్ర సింగ్ మోగా ఉధంపూర్ వైమానిక దళం స్టేషన్లో జాతీయ భద్రతా విధిని నిర్వర్తిస్తూ.. అమరుడయ్యారు. ఈ వార్త చాలా విచారకరం. శ్రీరాముడు ఆ సద్గురువుకు పాదాల చెంత స్థానం కల్పించి, వారి బంధువులకు ఈ అపారమైన దుఃఖాన్ని భరించే శక్తిని ప్రసాదించుగాక.” అని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా.. భారతదేశం, పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రకటించడానికి ముందే ఈ సంఘటన జరిగింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!