భారత్తో వివాదం ముదిరిన తర్వాత మాల్దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. భారత్ లోనే వందలాది మంది తమ పర్యటనలను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో పాటు మేక్ మై ట్రిప్, ఈజ్ మై ట్రిప్ మాల్దీవుల బుకింగ్లను రద్దు చేశాయి.
Maldives Row: భారత్-మాల్దీవుల మధ్య తీవ్ర దౌత్యవివాదం చెలరేగింది. ఆ దేశ మంత్రులు ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ అవమానకర వ్యాఖ్యలు చేయడంపై భారతీయులు భగ్గుమన్నారు. ఇటీవల ప్రధాని లక్షద్వీప్ వెళ్లిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ మాల్దీవుల మంత్రులు వివాదాస్పద పోస్టులను పెట్టారు. దీంతో చాలా మంది భారతీయ పర్యాటకులు మాల్దీవ్స్ యాత్రల్ని రద్దు చేసుకుంటున్నారు. ఇప్పటికే 10 వేల హోటల్ బుకింగ్స్తో పాటు ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.
Lakshadweep vs Maldives: భారతదేశంలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి ఇది విదేశాల కంటే తక్కువ కాదు. ఇక్కడ అనేక అందమైన ద్వీపాలు, బీచ్లు ఉన్నాయి. వీటిని చూడటానికి ప్రజలు సుదూర ప్రాంతాలు, విదేశాల నుంచి పర్యాటకులు వస్తారు. ఇటీవల అటువంటి అందమైన భారతదేశ ద్వీపం నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ స్నార్కెలింగ్ చేస్తూ కనిపించారు. ఆయన పర్యటన అనంతరం లక్షద్వీప్ నిరంతరం ముఖ్యాంశాలలో ఉంది. అదే సమయంలో,…
వెకేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది మాల్దీవులే. సెలబ్రిటీలు కూడా తరచూ మాల్దీవులకు వెళ్తుంటారు. అక్కడి బీచ్లు, రిసార్ట్స్లో సేద తీరుతుంటారు. ట్రిప్కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇవి చూసిన చాలా మంది అక్కడి లొకేషన్స్కు ఫిదా అయ్యి.. మాల్దీవ్స్ వెకేషన్కు వెల్లాలన్నది పెద్ద డ్రీమ్గా పెట్టుకుంటుంటారు.
India-Maldives row: భారత్-మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో భారత వ్యాపార సంఘమైన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) మాల్దీవులతో వ్యాపారం చేయడం మానుకోవాలని కోరింది. ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం లేదని వ్యాపార వర్గాలు అన్నాయి. మాల్దీవుల చర్యలకు వ్యతిరేకంగా ఈ బహిష్కరణకు పిలుపునిచ్చింది.
India-Maldives Row: భారత్-మాల్దీవ్స్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. లక్షద్వీప్ పర్యటన తర్వాత ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాల్దీవ్స్ స్వాతంత్రాన్ని పొందినప్పటి నుంచి భారత్ అన్ని విధాలుగా ఆపన్న హస్తం అందిస్తున్నా.. ఆ దేశం మాత్రం చైనా పాట పాడుతూనే ఉంది. తాజాగా ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ చైనా అనుకూల, భారత వ్యతిరేఖ వైకరి ప్రదర్శిస్తున్నాడు.
Lakshadweep: ఇండియా-మాల్దీవ్స్ వివాదం నడుమ ‘‘లక్షద్వీప్’’ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారతదేశంలో మొన్నటి వరకు పెద్దగా భారతీయులే పట్టించుకోని ఈ ద్వీపాల గురించి ప్రస్తుతం ప్రపంచమే సెర్చ్ చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఒక్క పర్యటన లక్షద్వీప్ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ప్రపంచ టూరిస్టులు ఈ ఐలాండ్స్ గురించి ఇంటర్నెట్లో తెగవెతికేస్తున్నారు. సరైన విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరో మాల్దీవ్స్ అవుతాయంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
India-Maldives row: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ని సందర్శించడం, అక్కడి టూరిజాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవుల్లో ప్రకంపలను రేపుతోంది. మోడీ టూర్ని ఉద్దేశిస్తూ అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. ఇండియన్స్ తమ మాల్దీవ్స్ టూర్లను క్యాన్సల్ చేసుకుంటున్నారు. ఆ దేశంలోని హోటల్స్ బుకింగ్ రద్దవ్వడమే కాదు, టూర్ కోసం ముందుగా చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక లక్షద్వీప్పై భారత నెటిజన్లతో పాటు విదేశీయులు కూడా సెర్చ్ చేస్తున్నారు.
ఇవాళ ఉదయం భారత్-మాల్దీవుల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మాల్దీవుల రాయబారిని పిలిపించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహిబ్ను పిలిపించింది.
India-Maldives: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ పర్యటనతో మాల్దీవులు వణికిపోతున్నాయి. ఇటీవల ఎన్నికల్లో అక్కడ అధ్యక్షుడిగా మహ్మద్ మయిజ్జూ గెలిచిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వం భారత వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తోంది. ఎన్నికల వాగ్దానాల్లో ఎక్కువగా భారత వ్యతిరేకతను ప్రదర్శించి మయిజ్జూ గెలిచారు. చైనాకు అత్యంత అనుకూలుడని ఇతనికి పేరుంది. ఇప్పటికే ఆ దేశంలో ఉన్న 77 మంది భారత సైనికులను మీ దేశం వెళ్లాల్సిందిగా ఆదేశించాడు.