India Maldives Row: మాల్దీవుల రాయబారిని పిలిచిన భారత ప్రభుత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇవాళ ఉదయం భారత్-మాల్దీవుల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మాల్దీవుల రాయబారిని పిలిపించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహిబ్ను పిలిపించింది. ఢిల్లీలోని సౌత్ బ్లాక్లోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన సందర్భంగా.. మాల్దీవులకు సంబంధించిన పలువురు మంత్రులు చేసిన వ్యాఖ్యలపై వివరణ తీసుకునే అవకాశం ఉంది.
Read Also: Rafael Nadal: ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి తప్పుకున్న రాఫెల్ నాదల్!
Also Read
కాగా, ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటనపై చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం గట్టి వైఖరి ప్రదర్శిస్తుంది. దీంతో ఆగ్రహించిన దాదాపు నాలుగు వేల మంది భారతీయులు మాల్దీవుల్లో హోటల్ బుకింగ్స్ను క్యాన్సిల్ చేసుకున్నారు. ఇప్పటికే మూడు వేల విమాన టిక్కెట్లు రద్దయ్యాయి. భారత హైకమిషనర్ కూడా మాల్దీవుల ప్రభుత్వంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. భారతదేశం యొక్క కఠినమైన వైఖరితో మాల్దీవుల ప్రభుత్వం ముగ్గురు డిప్యూటీ మంత్రులు షియునా, మల్షా షరీఫ్, మహ్జూమ్ మజీద్లను సస్పెండ్ చేసింది. ప్రపంచంలోనే ఒక దేశానికి చెందిన మంత్రులను మరో దేశ నాయకుడిపై వ్యాఖ్యలు చేయడంతో సస్పెండ్ కావడం ఇదే తొలిసారి అని నిపుణులు అంటున్నారు.
Read Also: BJP: నేడు బీజేపీ కీలక సమావేశాలు.. శాసన సభ పక్ష నేతను ఎన్నుకునే అవకాశం..!
ఇక, మాల్దీవుల విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు పలువురు మంత్రులు, అధికారులు చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలపై మాల్దీవుల ప్రభుత్వానికి తెలిసిన వాటిని సమర్థించడం లేదు.. కాగా భారత్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో నెమ్మదిగా దిగి వచ్చి విమర్శలు చేసింది వారి సొంత ఆలోచన మాత్రమే మాల్దీవుల ప్రభుత్వానికి సంబంధం లేదని తేల్చి చెప్పారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రజాస్వామ్యబద్ధంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలని మా ప్రభుత్వం విశ్వసిస్తుంది.. ఇది ద్వేషాన్ని, ప్రతికూలతను వ్యాప్తి చేయకూడదు.. అలాగే, మరే ఇతర దేశాలతో మాల్దీవుల సంబంధాలను ప్రభావితం చేయకూడదు అని చెప్పుకొచ్చింది.
Maldivian envoy seen at MEA office in Delhi, amid diplomatic row over ministers' remarks on PM Modi
Read @ANI Story | https://t.co/3uM7OsojKv#Maldives #MinistryofExternalAffairs #PMNarendraModi #India #IbrahimShaheeb pic.twitter.com/dTS9T1WX42
— ANI Digital (@ani_digital) January 8, 2024
తాజావార్తలు
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
-
Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
-
Ganja Smuggling : శంషాబాద్లో అంతర్రాష్ట్ర గంజాయి రాకెట్ గుట్టురట్టు..
-
PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!