India-Maldives row: ఇండియా-మాల్దీవ్స్ వివాదం మధ్యలో “ఇజ్రాయిల్”.. లక్షద్వీప్ గురించి కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Maldives row: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ని సందర్శించడం, అక్కడి టూరిజాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవుల్లో ప్రకంపలను రేపుతోంది. మోడీ టూర్ని ఉద్దేశిస్తూ అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. ఇండియన్స్ తమ మాల్దీవ్స్ టూర్లను క్యాన్సల్ చేసుకుంటున్నారు. ఆ దేశంలోని హోటల్స్ బుకింగ్ రద్దవ్వడమే కాదు, టూర్ కోసం ముందుగా చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక లక్షద్వీప్పై భారత నెటిజన్లతో పాటు విదేశీయులు కూడా సెర్చ్ చేస్తున్నారు.
Read Also: Gurugram: హాట్ కేకుల్లా లగ్జరీ హోమ్స్.. 3 రోజుల్లోనే 868 మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు విక్రయం..
Also Read
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
- Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
ఇదిలా ఉంటే ఈ వివాదం నడుమ భారత మిత్ర దేశం ఇజ్రాయిల్ కీలక ప్రకటన చేయడం ఆసక్తి రేపింది. మంగళవారం ‘డిసాలినేషన్’(సముద్ర నీటిని మంచినీటిగా మార్చే విధానం) ప్రోగ్రాంని ప్రారంభించినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఎంబసీ సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రకటించింది. ఇంతే కాకుండా లక్షద్వీపాలకు సంబంధించిన అందమైన బీచ్లకు ఫోటోలను పోస్ట్ చేస్తూ.. లక్షద్వీప్ అందాలని చూడని వారి కోసం మంత్రముగ్ధుల్ని చేసే కొన్ని చిత్రాలు ఉన్నాయంటూ కామెంట్ చేసింది.
మాల్దీవుల్లో ఏర్పడిన మహ్మద్ ముయిజ్జూ ప్రభుత్వం చైనా అనుకూల విధానాన్ని అవలంభిస్తూ, భారత వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. పూర్తిగా టూరిజంపై ఆధారపడిన ఈ ద్వీపదేశానికి భారత టూరిస్టులే ఆధారం. అయితే, పీఎం మోడీ లక్షద్వీపాలకు వెళ్లడంతో ఆ దేశం తన అక్కసును వెళ్లగక్కింది. ముగ్గురు మాల్దీవ్స్ మంత్రులు మోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. మాల్దీవ్స్ బదులుగా లక్షద్వీప్ వెళ్లాలని వారంతా సోషల్ మీడియాలో ‘‘బాయ్కాట్ మాల్దీవ్స్’’ని ట్రెండ్ చేస్తున్నారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గుగూల్లో లక్షద్వీప్ గురించి సెర్చ్ జరుగుతోంది. ఇక మేక్ మైట్రిప్ సైట్లో లక్షద్వీప్ కోసం సెర్చ్ 3400 శాతం పెరిగింది.
We were in #Lakshadweep last year upon the federal government's request to initiate the desalination program.
Israel is ready to commence working on this project tomorrow.
For those who are yet to witness the pristine and majestic underwater beauty of #lakshadweepislands, here… pic.twitter.com/bmfDWdFMEq
— Israel in India (@IsraelinIndia) January 8, 2024
తాజావార్తలు
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
-
Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
-
Srisailam Water Release: గుడ్న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
-
Rahul Gandhi: రాహుల్గాంధీతో కిరణ్ రిజిజు భేటీ.. కీలక ప్రతిపాదనను తిరస్కరించిన ప్రతిపక్ష నేత
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!