India-Maldives row: ఇండియా-మాల్దీవ్స్ వివాదం మధ్యలో “ఇజ్రాయిల్”.. లక్షద్వీప్ గురించి కీలక ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Maldives row: ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ని సందర్శించడం, అక్కడి టూరిజాన్ని ప్రమోట్ చేయడం మాల్దీవుల్లో ప్రకంపలను రేపుతోంది. మోడీ టూర్ని ఉద్దేశిస్తూ అక్కడి మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వివాదం ముదిరింది. ఇండియన్స్ తమ మాల్దీవ్స్ టూర్లను క్యాన్సల్ చేసుకుంటున్నారు. ఆ దేశంలోని హోటల్స్ బుకింగ్ రద్దవ్వడమే కాదు, టూర్ కోసం ముందుగా చేసుకున్న ఫ్లైట్ టికెట్స్ని క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక లక్షద్వీప్పై భారత నెటిజన్లతో పాటు విదేశీయులు కూడా సెర్చ్ చేస్తున్నారు.
Read Also: Gurugram: హాట్ కేకుల్లా లగ్జరీ హోమ్స్.. 3 రోజుల్లోనే 868 మిలియన్ డాలర్ల విలువైన ఇళ్లు విక్రయం..
Also Read
- Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
- PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
- Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
ఇదిలా ఉంటే ఈ వివాదం నడుమ భారత మిత్ర దేశం ఇజ్రాయిల్ కీలక ప్రకటన చేయడం ఆసక్తి రేపింది. మంగళవారం ‘డిసాలినేషన్’(సముద్ర నీటిని మంచినీటిగా మార్చే విధానం) ప్రోగ్రాంని ప్రారంభించినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇజ్రాయిల్ ఎంబసీ సోషల్ మీడియా ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రకటించింది. ఇంతే కాకుండా లక్షద్వీపాలకు సంబంధించిన అందమైన బీచ్లకు ఫోటోలను పోస్ట్ చేస్తూ.. లక్షద్వీప్ అందాలని చూడని వారి కోసం మంత్రముగ్ధుల్ని చేసే కొన్ని చిత్రాలు ఉన్నాయంటూ కామెంట్ చేసింది.
మాల్దీవుల్లో ఏర్పడిన మహ్మద్ ముయిజ్జూ ప్రభుత్వం చైనా అనుకూల విధానాన్ని అవలంభిస్తూ, భారత వ్యతిరేకంగా ప్రవర్తిస్తోంది. పూర్తిగా టూరిజంపై ఆధారపడిన ఈ ద్వీపదేశానికి భారత టూరిస్టులే ఆధారం. అయితే, పీఎం మోడీ లక్షద్వీపాలకు వెళ్లడంతో ఆ దేశం తన అక్కసును వెళ్లగక్కింది. ముగ్గురు మాల్దీవ్స్ మంత్రులు మోడీని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. మాల్దీవ్స్ బదులుగా లక్షద్వీప్ వెళ్లాలని వారంతా సోషల్ మీడియాలో ‘‘బాయ్కాట్ మాల్దీవ్స్’’ని ట్రెండ్ చేస్తున్నారు. గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గుగూల్లో లక్షద్వీప్ గురించి సెర్చ్ జరుగుతోంది. ఇక మేక్ మైట్రిప్ సైట్లో లక్షద్వీప్ కోసం సెర్చ్ 3400 శాతం పెరిగింది.
We were in #Lakshadweep last year upon the federal government's request to initiate the desalination program.
Israel is ready to commence working on this project tomorrow.
For those who are yet to witness the pristine and majestic underwater beauty of #lakshadweepislands, here… pic.twitter.com/bmfDWdFMEq
— Israel in India (@IsraelinIndia) January 8, 2024
తాజావార్తలు
-
Wedding Fight: మటన్ పెడతామని ఒప్పుకొని.. చికెన్ పెడతారా?.. పెళ్లి విందులో పొట్టు పొట్టు తన్నుకున్న వైనం
-
Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
-
Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే జోడీగా ‘శ్రీశ్రీ’.. క్లాసిక్ లవ్ స్టోరీతో వస్తోన్న పాన్ ఇండియా మూవీ
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
Lenin Day 1 Collections : అయ్యగారు అదిరిపోయే స్టార్ట్.. లెనిన్ డే-1 ఎంతంటే?
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!