Lakshadweep: మాల్దీవ్స్ వివాదం నడుమ ఇంటర్నెట్లో దుమ్మురేపుతున్న “లక్షద్వీప్”.. 20 ఏళ్లలో ఇదే అధికం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lakshadweep: ఇండియా-మాల్దీవ్స్ వివాదం నడుమ ‘‘లక్షద్వీప్’’ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారతదేశంలో మొన్నటి వరకు పెద్దగా భారతీయులే పట్టించుకోని ఈ ద్వీపాల గురించి ప్రస్తుతం ప్రపంచమే సెర్చ్ చేస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఒక్క పర్యటన లక్షద్వీప్ ముఖచిత్రాన్నే మార్చేస్తోంది. ప్రపంచ టూరిస్టులు ఈ ఐలాండ్స్ గురించి ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. సరైన విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరో మాల్దీవ్స్ అవుతాయంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
Read Also: 12th Fail: “12th ఫెయిల్”పై ఐఏఎస్ అవనీష్ శరణ్ ప్రశంసలు.. అద్భుతం అంటూ కితాబు..
Also Read
- Petrol, Diesel Prices Hiked: మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పదిరోజుల్లో మూడోసారి
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Twisha Sharma: ట్విషా శర్మ మరణానికి ముందు ఎక్కడకెళ్లిందంటే.. వెలుగులోకి వీడియో
గూగుల్ ట్రెండ్స్ ప్రకారం.. ఆన్లైన్లో లక్షద్వీప్ గురించి సెర్చ్ చేస్తున్నట్లు వెల్లడైంది. వరసగా రెండో రోజు కూడా లక్షద్వీప్ గురించి చాలా మంది శోధిస్తున్నారు. దీంతో గత 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా గరిష్ట స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వ సమాచార విభాగాలు వెల్లడించాయి. మరోవైపు ప్రముఖ టూరిజం, ట్రావెల్ ప్లాట్ఫాం ‘మేక్ మై ట్రిప్’లో లక్షద్వీప్ గురించి వెతకడం 3400 శాతం పెరిగిందని ఆ సంస్థ తెలిపింది. మాల్దీవ్స్ బుకింగ్స్ రద్దు చేయాలని నెటిజన్లు కోరుతున్నారు. ఒక్క శుక్రవారం రోజే 50 వేల మంది గూగుల్ లో వెతికారు. ఇక మోడీ పర్యటన తర్వాత ఈ సంఖ్య ఏకంగా గణనీయంగా పెరిగింది.
ఇటీవల ప్రధాని మోడీ పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు లక్షద్వీప్లో పర్యటించారు. అక్కడ కవరత్తితో పాటు పలు బీచుల సౌందర్యాన్ని ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో మాల్దీవ్స్లో ఒక్కసారిగా ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. చైనా అనుకూలంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జులో ప్రభుత్వంలోని ముగ్గురు మంత్రులు ప్రధానిమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇరు దేశాల మధ్య దౌత్యవివాదం నెలకొంది. ముగ్గురు మంత్రుల్ని అక్కడి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అయితే దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాల్దీవ్స్ హోటల్, ఫ్లైట్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు.
తాజావార్తలు
-
Pat Cummins: “అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం”.. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
TulsiGabbard: అమెరికా ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవికి తులసి గబ్బార్డ్ రాజీనామా.. కారణం ఏంటంటే?
-
Mega158: ‘మెగా158’ టైటిల్పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
-
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..
-
Patriot: 18 ఏళ్ల తర్వాత మమ్ముట్టి – మోహన్ లాల్ కలయిక.. ‘పేట్రియాట్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!