India-Maldives Row: తాగు నీరు, కోవిడ్, తిరుగుబాట్ల అణిచివేతలో భారత్ సాయం.. అయినా, చైనా రాగం ఎత్తుకుంటున్న మాల్దీవ్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Maldives Row: భారత్-మాల్దీవ్స్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. లక్షద్వీప్ పర్యటన తర్వాత ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాల్దీవ్స్ స్వాతంత్రాన్ని పొందినప్పటి నుంచి భారత్ అన్ని విధాలుగా ఆపన్న హస్తం అందిస్తున్నా.. ఆ దేశం మాత్రం చైనా పాట పాడుతూనే ఉంది. తాజాగా ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ చైనా అనుకూల, భారత వ్యతిరేఖ వైకరి ప్రదర్శిస్తున్నాడు.
మాల్దీవ్స్కి భారత్ సాయం:
Also Read
1988లో మాల్దీవుల్లో శ్రీలంక మిలిటెంట్ సంస్థ మద్దతుతో ఓ గ్రూప్ తిరుగబాటు చేసింది, ఆ సమయంలో భారత్ ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. 2004 సునామీలో 100 మంది చనిపోయిన సమయంలో, డిసెంబర్ 2014 మాలేలో నీటి సంక్షోభం తలెత్తిన సమయంలో భారత్ మాత్రమే సాయం చేసింది. చివరకు కోవిడ్ వ్యాక్సిన్లు ఎగుమతి చేసి తన పెద్ద మనసును చాటుకుంది భారత్. అయినా కూడా అక్కడి మయిజ్జూ ప్రభుత్వంలో మాత్రం భారత్ అంటే విపరీతమైన ద్వేషం నెలకొంది. ప్రజల్ని కూడా తప్పుదోవపట్టిస్తోంది.
70 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న మాల్దీవులకు అత్యంత పొరుగు, సమీప దేశం భారత్ కావడం వల్ల ఆ దేశ రక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలకు సాయం చేస్తోంది. 1965లో మాల్దీవ్స్ స్వాతంత్రం పొందిన తర్వాత, ఆ దేశంలో దౌత్య సంబంధాలు పెట్టుకున్న మొదటి దేశం భారత్.
ఇక 1988 నుంచి భారత్, మాల్దీవ్స్ మధ్య సహకారానికి పునాది పడింది. ఏప్రిల్ 2016లో రక్షణ కార్యచరణ ప్రణాళికలో ఇరు దేశాలు సంతకం చేశాయి. మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్కి 70 శాతం రక్షణ అవసరాలను భారత్ అందిస్తోంది. గత దశాబ్ద కాలంలో భారత్ 1500 మందికి శిక్షణ ఇచ్చింది. తీవ్రవాదం, పైరసీ, మాదక ద్రవ్యాలు, ఇతర నేరాల్లో ఇరుతదేశాలు సహకరించుకుంటున్నాయి.
భారత్ ప్రస్తుతం మాల్దీవుల్లో చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టుల్లో గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఉంది. దీని పొడవు 6.75 కిలోమీటర్లు. రాజధాని మాలే పక్కనే ఉన్న మూడు ద్వీపాలు విల్లింగ్లీ, గుల్హిఫల్హు, థిలాఫుషి ద్వీపాలను కలుపుతోంది. దీని కోసం భారత్ 500 మిలియన్ డాలర్లను మంజూరు చేసింది.
భారతదేశం-మాల్దీవులు వాణిజ్యం:
2014లో ప్రధాని నరేంద్రమోడీ అధికారం చేపట్టిన తర్వాత భారత్-మాల్దీవ్స్ మధ్య వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగింది. 2022లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 173.50 మిలియన్ డాలర్లు ఉంటే.. 2014 ఇది 501.82 మిలియన్ డాలర్లు పెరిగింది. 2021లో భారత్, మాల్దీవుల మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది. వ్యాపార ప్రయోజనాల కోసం మాల్దీవులకు చేరుకునే భారతీయులకు 2022లో వీసా రహిత కార్యక్రమాన్ని తీసుకురావడంతో 2020 సెప్టెంబర్ లో రెండు దేశాల మధ్య కార్గో నౌకా సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో వాణిజ్యం పెరిగింది.
బియ్యం, గోధుమ పిండి, పంచదార, బంగాళదుంపలు మరియు ఉల్లిపాయలు, గుడ్లు, కూరగాయలు మరియు నిర్మాణ సామగ్రి వంటి అనేక నిత్యావసర వస్తువుల కోసం భారతదేశంపై ఆధారపడి ఉంది. ఇక స్క్రాప్ మెటల్స్, సీఫుడ్స్ భారత దిగుమతుల్లో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ఉంది. 1974 నుంచి రిసార్టులు, సముద్ర ఎగుమతులు, వ్యాపారాల కోసం రుణాలు అందించడంలో కీలక పాత్ర పోషించింది.
ఇక మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా పర్యాటకంపై ఆధారపడి ఉంది. ఈ దేశానికి వెళ్తున్న పర్యాటకుల్లో అత్యధిక మంది భారతీయులే.2023ల ఏకంగా 2 లక్షలకు పైగా ఇండియన్ టూరిస్టులు మాల్దీవ్స్ సందర్శించారు. కోవిడ్ సమయంలో ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిన క్రమంలో 63,000 మంది భారతీయులు ఆ దేశాన్ని సందర్శించారు.
తాజావార్తలు
-
Puri: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి.. 120 మందికి గాయాలు
-
Fauji: ప్రభాస్ ‘ఫౌజీ’ చుట్టూ బిగ్ గేమ్.. ఆ సినిమాల రిలీజ్ డేట్లు మారతాయా?
-
AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధం..
-
US-Iran War: ‘ట్రంప్ను చంపేస్తాం’.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
-
ICC Fined: బిగ్షాక్.. టీమిండియా యువ పేసర్కు భారీ జరిమానా విధించిన ఐసీసీ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!