Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News From Defence To Health How India Has Played Maldives Perfect Neighbour For Decades

India-Maldives Row: తాగు నీరు, కోవిడ్, తిరుగుబాట్ల అణిచివేతలో భారత్ సాయం.. అయినా, చైనా రాగం ఎత్తుకుంటున్న మాల్దీవ్స్..

Published Date :January 8, 2024 , 8:23 pm
By BV Reddy
India-Maldives Row: తాగు నీరు, కోవిడ్, తిరుగుబాట్ల అణిచివేతలో భారత్ సాయం.. అయినా, చైనా రాగం ఎత్తుకుంటున్న మాల్దీవ్స్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India-Maldives Row: భారత్-మాల్దీవ్స్ మధ్య వివాదం తారాస్థాయికి చేరుకుంది. లక్షద్వీప్‌ పర్యటన తర్వాత ప్రధాని నరేంద్రమోడీపై ఆ దేశ మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. మాల్దీవ్స్ స్వాతంత్రాన్ని పొందినప్పటి నుంచి భారత్ అన్ని విధాలుగా ఆపన్న హస్తం అందిస్తున్నా.. ఆ దేశం మాత్రం చైనా పాట పాడుతూనే ఉంది. తాజాగా ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జూ చైనా అనుకూల, భారత వ్యతిరేఖ వైకరి ప్రదర్శిస్తున్నాడు.

మాల్దీవ్స్‌కి భారత్ సాయం:

1988లో మాల్దీవుల్లో శ్రీలంక మిలిటెంట్ సంస్థ మద్దతుతో ఓ గ్రూప్ తిరుగబాటు చేసింది, ఆ సమయంలో భారత్ ఆ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడింది. 2004 సునామీలో 100 మంది చనిపోయిన సమయంలో, డిసెంబర్ 2014 మాలేలో నీటి సంక్షోభం తలెత్తిన సమయంలో భారత్ మాత్రమే సాయం చేసింది. చివరకు కోవిడ్ వ్యాక్సిన్లు ఎగుమతి చేసి తన పెద్ద మనసును చాటుకుంది భారత్. అయినా కూడా అక్కడి మయిజ్జూ ప్రభుత్వంలో మాత్రం భారత్ అంటే విపరీతమైన ద్వేషం నెలకొంది. ప్రజల్ని కూడా తప్పుదోవపట్టిస్తోంది.

70 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న మాల్దీవులకు అత్యంత పొరుగు, సమీప దేశం భారత్ కావడం వల్ల ఆ దేశ రక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలకు సాయం చేస్తోంది. 1965లో మాల్దీవ్స్ స్వాతంత్రం పొందిన తర్వాత, ఆ దేశంలో దౌత్య సంబంధాలు పెట్టుకున్న మొదటి దేశం భారత్.

ఇక 1988 నుంచి భారత్, మాల్దీవ్స్ మధ్య సహకారానికి పునాది పడింది. ఏప్రిల్ 2016లో రక్షణ కార్యచరణ ప్రణాళికలో ఇరు దేశాలు సంతకం చేశాయి. మాల్దీవియన్ నేషనల్ డిఫెన్స్ ఫోర్స్‌కి 70 శాతం రక్షణ అవసరాలను భారత్ అందిస్తోంది. గత దశాబ్ద కాలంలో భారత్ 1500 మందికి శిక్షణ ఇచ్చింది. తీవ్రవాదం, పైరసీ, మాదక ద్రవ్యాలు, ఇతర నేరాల్లో ఇరుతదేశాలు సహకరించుకుంటున్నాయి.

భారత్ ప్రస్తుతం మాల్దీవుల్లో చేపడుతున్న అతిపెద్ద ప్రాజెక్టుల్లో గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఉంది. దీని పొడవు 6.75 కిలోమీటర్లు. రాజధాని మాలే పక్కనే ఉన్న మూడు ద్వీపాలు విల్లింగ్లీ, గుల్హిఫల్హు, థిలాఫుషి ద్వీపాలను కలుపుతోంది. దీని కోసం భారత్ 500 మిలియన్ డాలర్లను మంజూరు చేసింది.

భారతదేశం-మాల్దీవులు వాణిజ్యం:

2014లో ప్రధాని నరేంద్రమోడీ అధికారం చేపట్టిన తర్వాత భారత్-మాల్దీవ్స్ మధ్య వాణిజ్యం నాలుగు రెట్లు పెరిగింది. 2022లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 173.50 మిలియన్ డాలర్లు ఉంటే.. 2014 ఇది 501.82 మిలియన్ డాలర్లు పెరిగింది. 2021లో భారత్, మాల్దీవుల మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా మారింది. వ్యాపార ప్రయోజనాల కోసం మాల్దీవులకు చేరుకునే భారతీయులకు 2022లో వీసా రహిత కార్యక్రమాన్ని తీసుకురావడంతో 2020 సెప్టెంబర్ లో రెండు దేశాల మధ్య కార్గో నౌకా సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో వాణిజ్యం పెరిగింది.

బియ్యం, గోధుమ పిండి, పంచదార, బంగాళదుంపలు మరియు ఉల్లిపాయలు, గుడ్లు, కూరగాయలు మరియు నిర్మాణ సామగ్రి వంటి అనేక నిత్యావసర వస్తువుల కోసం భారతదేశంపై ఆధారపడి ఉంది. ఇక స్క్రాప్ మెటల్స్, సీఫుడ్స్ భారత దిగుమతుల్లో ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ దేశంలో అతిపెద్ద బ్యాంకుగా ఉంది. 1974 నుంచి రిసార్టులు, సముద్ర ఎగుమతులు, వ్యాపారాల కోసం రుణాలు అందించడంలో కీలక పాత్ర పోషించింది.

ఇక మాల్దీవుల ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా పర్యాటకంపై ఆధారపడి ఉంది. ఈ దేశానికి వెళ్తున్న పర్యాటకుల్లో అత్యధిక మంది భారతీయులే.2023ల ఏకంగా 2 లక్షలకు పైగా ఇండియన్ టూరిస్టులు మాల్దీవ్స్ సందర్శించారు. కోవిడ్ సమయంలో ఆ దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిన క్రమంలో 63,000 మంది భారతీయులు ఆ దేశాన్ని సందర్శించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • India-Maldives Issue
  • India-Maldives row
  • Lakshadweep
  • PM Modi

తాజావార్తలు

  • SSC Exams: నేటి నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు.. విద్యార్థులు, పేరెంట్స్ తప్పక పాటించాల్సిన ముఖ్య సూచనలు

  • Trump: రష్యా క్లారిటీ ఇచ్చినా.. అమెరికా అనుమానాలు.. పుతిన్‌పై ట్రంప్ సంచలన ఆరోపణలు..

  • Janasena Party Formation Day: నేడే “జనసేన” పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. పాడేరు పర్యటనలో డిప్యూటీ సీఎం..!

  • Saturday Horoscope: శనివారం రాశి ఫలాలు.. ఆ రాశివారు పిల్లల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉండాల్సిందే..!

  • Sachin Tendulkar: సచిన్ రిటైర్మెంట్ వెనుక ఇంత కథ ఉందా.. డ్రెస్సింగ్ రూంలోనే ప్లాన్..?

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions