ఇప్పటివరకు జరిగిన రెండు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ)లోనూ భారత్ ఫైనల్కు చేరుకున్న విషయం తెలిసిందే. వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరిన భారత్.. మూడోసారి కూడా ఆ దిశగా దూసుకెళ్లింది. అయితే భారత్కు న్యూజిలాండ్కు భారీ షాక్ ఇచ్చింది. సొంతగడ్డపై వరుసగా రెండు టెస్టుల్లోనూ కివీస్ చేతిలో ఓడడంతో టీమిండియా అవకాశాలపై ప్రభావం చూపింది. అంతేకాదు ఫైనల్ ఆశలు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్కు ముందు 73 గెలుపు శాతంతో భారత్ అగ్రస్థానంలో ఉంది.…
సొంతగడ్డపై ఎదురులేని భారత్.. న్యూజిలాండ్తో మూడు టెస్టు సిరీస్ను సునాయాసంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. టీమిండియాకు ప్రధాన అస్రం అయిన స్పిన్ ఉచ్చులోనే పడి భారత బ్యాటర్లు తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. కివీస్ రెండు టెస్టుల్లోనూ విజయం సాధించి.. భారత గడ్డపై మొదటిసారి టెస్టు సిరీస్ను సొంతం చేసుకుంది. నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా జరిగే మూడో టెస్టులో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలోనే పిచ్ విషయంలో టీమిండియా కఠిన నిర్ణయం…
భారత్తో మూడో టెస్ట్కు ముందు న్యూజిలాండ్కు బిగ్ షాక్ తగిలింది. కివీస్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ మూడో టెస్ట్కు సైతం దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గజ్జల్లో గాయం కారణంగానే బెంగళూరు, పూణేలో జరిగిన మొదటి రెండు టెస్టులకు సైతం కేన్ మామ దూరమయిన విషయం తెలిసిందే. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో కేన్ విలియమ్సన్ గజ్జల్లో గాయం అయింది. పూర్తిస్థాయి ఫిట్నెస్…
న్యూజిలాండ్తో జరిగిన రెండు టెస్టుల్లో ఓడిన భారత్ ఇప్పటికే సిరీస్ కోల్పోయింది. నవంబర్ 1 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు ఆరంభం కానుంది. చివరి టెస్టులో అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా చూస్తోంది. ఈ నేపథ్యంలో మూడో టెస్టుకు తుది జట్టులో మార్పులు చేర్పులు చేసే అవకాశముంది. రెండో టెస్టులో మూడు మార్పులతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే. టాప్-4ను భారత్ కొనసాగించనుంది. కఠినమైన ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో రోహిత్ శర్మ, యశస్వి…
సుదీర్ఘకాలం అనంతరం స్వదేశంలో భారత్ టెస్ట్ సిరీస్ను కోల్పోయింది. న్యూజిలాండ్పై మొదటి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా.. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ను కివీస్కు అప్పగించింది. సొంతగడ్డపై చెత్త ప్రదర్శన చేసిన రోహిత్ సేనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పిన్ ఆడటంలో విఫలమైన బ్యాటర్ల ఆట తీరును ఎత్తిచూపుతున్నారు. కొందరు రోహిత్ శర్మ కెప్టెన్సీ పైనా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ పేసర్ సైమన్ డౌల్ హిట్మ్యాన్కు మద్దతు పలికాడు. న్యూజిలాండ్పై సిరీస్ ఓటమికి రోహిత్…
భారత గడ్డపై న్యూజిలాండ్ మొదటిసారి టెస్ట్ సిరీస్ గెలిచింది. సొంతగడ్డపై ఎదురులేకుండా పోతున్న టీమిండియాకు ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు చేతులేయడంతోనే బెంగళూరు, పూణే టెస్టుల్లో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ముంబైలో మూడో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అనంతరం రోహిత్ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో మూడో టెస్టులో మార్పులు చేయాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండో టెస్టులో కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్కు…
న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో భారత్ ఓటమికి సీనియర్ ఆటగాళ్లదే బాధ్యత అని టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ అన్నాడు. జట్టుపై కోచ్ ప్రభావం చాలా తక్కువ అని నా అభిప్రాయపడ్డాడు. కెప్టెన్ మైదానంలో అడుగు పెట్టడని, కెప్టెనే అన్నీ చూసుకుంటాడన్నాడు. ఓటములు ఎదురైనపుడు విమర్శలు వస్తే.. వాటినీ తీసుకోవాలని డీకే పేర్కొన్నాడు. రోహిత్ సేన మూడు మ్యాచుల టెస్టు సిరీస్ను న్యూజిలాండ్కు కోల్పోయిన విషయం తెలిసిందే. ‘న్యూజిలాండ్ సిరీస్ ఓటమి బాధ్యతను సీనియర్లకు…
పుణె టెస్టులో భారత జట్టును ఓడించి న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. భారత్లో కివీస్ జట్టు తొలిసారి టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది. 12 ఏళ్లలో 18 సిరీస్ల తర్వాత భారత్ సొంతగడ్డపై టెస్టు సిరీస్ను కోల్పోయింది. బెంగళూరు టెస్టులో ఓడిపోయిన భారత్.. స్పిన్ ట్రాక్ పైనే ఆడాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం టీమిండియాకి ఎంతో నష్టాన్ని మిగిల్చింది. మిచెల్ సాంట్నర్ లాంటి స్పిన్నర్ల ముందు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు.
IND vs NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ చాలా రసవత్తంగా కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్సింగ్స్ లో కివీస్ ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో 259 రన్స్ చేసిన న్యూజిలాండ్.. రెండు ఇన్నింగ్స్ లో 255 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా విజయానికి 359 పరుగులు చేయాల్సి ఉంది.