ఇండోర్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీకి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ ఒక బ్రౌన్ కలర్ డ్రింక్ తాగడం, ఆ తర్వాత అతను ఇచ్చిన వింత ఎక్స్ప్రెషన్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా కోహ్లీ ముఖంలో కనిపించిన హావభావాలు ఈ ఆసక్తిని మరింత పెంచాయి. దీంతో ఆ డ్రింక్ ఏంటనే విషయంపై నెట్టింట ఆసక్తికర చర్చ మొదలైంది. ఆ వీడియోను…
భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ బుధవారం (జనవరి 21) నుంచి ప్రారంభమవుతుంది. నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 37 సంవత్సరాల తర్వాత భారతదేశంలో వన్డే సిరీస్ విజయం అందుకున్న కివీస్.. టీ20 సిరీస్ కూడా కొట్టాలని చూస్తోంది. వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ పొట్టి సిరీస్ అయినా పట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా తొలి…
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ముగిసింది. మూడు వన్డేల సిరీస్ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది. గతంలో భారత గడ్డపై టీమిండియాను టెస్టుల్లో ఓడించిన న్యూజిలాండ్.. ఇప్పుడు వన్డేల్లో కూడా ఓడించింది. ఇరు జట్ల మధ్య బుధవారం (జనవరి 21) నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ నాగ్పూర్లో జరగనుంది. ఈ పొట్టి సిరీస్ రెండు జట్లకు టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహకంగా ఉపయోగపడనుంది. టీ20ల్లోనూ రెండు జట్ల మధ్య…
ఇండోర్ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో న్యూజిలాండ్ విజయం సాధించి భారత గడ్డపై వన్డే సిరీస్ గెలుచుకుంది. కివీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన డారిల్ మిచెల్.. తమ విజయ రహస్యం ఏంటో చెప్పాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను మొదటి బంతి నుంచే దాడి చేయాలని తాము ముందే నిర్ణయించుకున్నామని వెల్లడించాడు. కుల్దీప్ లాంటి ప్రపంచ స్థాయి స్పిన్నర్ ఒకసారి రిథమ్లోకి వస్తే మ్యాచ్నే నియంత్రించగలడని, అందుకే అతడిని మొదటి బంతి నుంచే ఒత్తిడిలోకి…
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య చివరి మ్యాచ్ నేడు జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో మూడో వన్డే ప్రత్యక్ష ప్రసారం కానుంది. తొలి వన్డేలో భారత్ గెలవగా.. రెండో వన్డేలో న్యూజిలాండ్ విజయాన్ని అందుకుంది. స్వదేశంలో మరో సిరీస్ను చేజిక్కించుకోవాలనే పట్టుదలతో భారత్ ఉండగా.. భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ సాధించాలని కివీస్ తహతహలాడుతోంది. ఈ…
మూడు వన్డేల సిరీస్లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. న్యూజిలాండ్ కెప్టెన్ మైఖేల్ బ్రేస్వెల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తుది జట్టులో ఒక మార్పు చేశామని చెప్పాడు. జాడెన్ లెన్నాక్స్ అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు భారత్ కూడా ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ శుభ్మన్ గిల్ తెలిపాడు. గాయపడిన వాషింగ్టన్ సుందర్ స్థానంలో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వచ్చాడు. న్యూజిలాండ్తో…
మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఈరోజు రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ జట్టు తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని బలమైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. ఈ మ్యాచ్కు భారత జట్టులో ఒక మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. యువ బ్యాటర్ ఆయుష్ బదోనికి ఈ మ్యాచ్తో భారత్ తరఫున అరంగేట్రం చేసే అవకాశం…
మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య నేడు రెండో వన్డే జరగనుంది. రాజ్కోట్లో మధ్యాహ్నం 1.30 నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి వన్డేలో గెలిచిన భారత్.. ఈ మ్యాచ్లోనూ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైయిపు మొదటి వన్డేలో ఓడిన న్యూజిలాండ్.. తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని సిరీస్ను సమం చేయాలని చూస్తోంది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఓ రేర్ రికార్డు సాధించే…
భారత్–న్యూజిలాండ్ వన్డే సిరీస్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మిగతా వన్డే మ్యాచ్లకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ ఆల్రౌండర్ ఆయుష్ బదోనిని జట్టులోకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. 26 ఏళ్ల బదోని భారత జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. బుధవారం రాజ్కోట్లో జరిగే రెండో వన్డేకు అతడు అందుబాటులోకి రానున్నాడు. బదోని బ్యాటర్ మాత్రమే కాదు.. ఆఫ్ స్పిన్నర్ కూడా. మొదటి వన్డేలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్…
వన్డే క్రికెట్లో భారీ లక్ష్యాల్ని ఛేదించడంలో ‘కింగ్’ విరాట్ కోహ్లీకి ఎవరూ సాటిలేరని గణాంకాలు చెబుతున్నాయి. భారత్ 300 రన్స్ పైగా లక్ష్యాలను విజయవంతంగా ఛేదించిన మ్యాచ్ల్లో కోహ్లీ చూపించిన స్థిరత్వం, క్లాస్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. 300+ రన్స్ లక్ష్యం ఉన్న విజయవంతమైన చేజ్లలో కోహ్లీ ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్లు ఆడాడు. ఈ 12 ఇన్నింగ్స్ల్లో 1091 పరుగులు చేశాడు. కేవలం పరుగులే కాదు.. సగటు కూడా అద్భుతంగా ఉంది. ఛేజింగ్ మ్యాచ్ల్లో…