Kavitha : హైదరాబాద్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద బీహెచ్ఆర్ఎస్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు పోలీసులు అడ్డుపడ్డారు. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అవకతవకలు, నిరుద్యోగ సమస్యలపై విద్యార్థులతో చర్చించేందుకు కవిత లైబ్రరీకి వెళ్లగా, పోలీసులు ఆమెను ఆపేశారు. అయితే, లైబ్రరీలోకి అనుమతి ఇవ్వకపోవడంతో జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైబ్రరీ గేటు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కవితతో పాటు ఉన్న…
Dabirpura: హైదరాబాద్ పాతబస్తీలోని డబీర్పురాలోని పోలీస్స్టేషన్ పరిధిలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పవిత్ర ఖురాన్ను పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక యువకుడు ఆనందంగా తాను జ్యూస్ తాపిస్తున్నానంటూ పలు దుకాణాలు, అపార్టుమెంట్లు చుట్టూ తిరిగి జనాలకు జ్యూస్ ఇచ్చిన ఘటన స్థానికులను షాక్కు గురిచేసింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఆ జ్యూస్ను ఎలాంటి అభ్యంతరం లేకుండా తీసుకుని తాగారు. మరికొందరు మాత్రం తాగడానికి నిరాకరించారు. అయితే, ఇక్కడే ట్విస్ట్ ఉంది. Raja Singh: కిషన్ రెడ్డి…
Crime News: హైదరాబాద్ లోని బాలానగర్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, ఆ తర్వాత భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో మృతురాలు చల్లారి సాయిలక్ష్మీ (27)గా గుర్తించారు అధికారులు. ఆమె భర్త అనిల్ కుమార్ తో కలిసి పద్మారావు నగర్ ఫేజ్–1, బాలానగర్ లో నివాసం ఉంటోంది. సాయిలక్ష్మీకి ఇద్దరు కవల పిల్లలు చేతన్ కార్తికేయ, లాస్యత…
S*xual Harassment: హైదరాబాద్ లోని సైదాబాద్ బాలసదన్లో జరిగిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై బాలసదన్ సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్, దర్యాప్తు అధికారి మైథిలీ (మహిళా సూపరింటెండెంట్) స్పందించారు. ఇందులో భాగంగా వారు పలు వివరాలను వెల్లడించారు. బాల సదన్ సూపరింటెండెంట్ సయ్యద్ అఫ్జల్ అందించిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 11న సైదాబాద్ పోలీసులు బాల సదన్కు వచ్చి బాధిత బాలుడి ఫోటో చూపించి వివరాలు అడిగారు. ఆ బాలుడు పండుగ…
Konda Lakshma Reddy: కొండా లక్ష్మారెడ్డి (84) ఇక లేరు. తెలంగాణ రాజకీయాల్లో విషాదం నింపుతూ.. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి సోమవారం ఉదయం ఆరు గంటలకు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదర్గూడలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. నేడు మధ్యాహ్నం మూడు గంటలకు మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. IND vs AUS: వన్డే చరిత్రలోనే అతిపెద్ద ఛేజ్.. టాప్ 5లో నాలుగు రికార్డులు ఆస్ట్రేలియావే! చేవెళ్ల మాజీ…
వైద్యులను దైవంతో సమానంగా కొలుస్తుంటారు. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న పలు ఘటనలు వైద్యులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయంటున్నారు పలువురు వ్యక్తులు. తాజాగా గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఏఐజీలో చేరాడు. వైద్యం చేసేందుకు రూ. 35 లక్షల ప్యాకేజీ మాట్లాడుకున్నారని బాధిత కుటంబం తెలిపింది. బాధితులు ఇల్లు అమ్ముకుని మరి హాస్పిటల్ లో లక్షల్లో బిల్లు చెల్లించామని తెలిపారు. Also Read:Rashi Khanna :…
రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎన్నికల సంఘం రేపు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. రేపటి నుంచి మొదలు 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. 22 న నామినేషన్లు పరిశీలన కాగా.. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసిన జిల్లా ఎన్నికల సంఘం. షేక్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. Also Read:…
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు మారడం లేదు. వనస్థలిపురం గుర్రంగూడ వద్ద కారు బీభత్సం సృష్టించింది. యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్ ను ఢీకొట్టి డివైడర్ దాటి మరో కారును ఢీ కొట్టి బోల్తా పడింది థార్ కారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. థార్ కారు ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Also…
టోలిచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహుల్ కాలనీలో ఒక డీసీఎం డ్రైవర్ లేబర్ లతో కలిసి సత్య మ్యాగ్నము నుంచి రాహుల్ కాలనీలో రెండవ అంతస్తుకి లిఫ్ట్లో సామాన్లు తీసుకెళ్లారు. ఇది గమనించిన కామ్రాన్ అనే వ్యక్తి లేబర్ల పై దుర్భాషలాడి వారిపై చేయి చేసుకున్నాడు. లేబర్లను ఎందుకు కొట్టారని డీసీఎం డ్రైవర్ ఫారుక్ వెళ్లి ప్రశ్నించగా కామ్రాన్ ఫారూఖ్ ని ఎయిర్ గన్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు. భయాందోళనకు గురైన డీసీఎం డ్రైవర్ ఫారుఖ్ వెంటనే…
కుటుంబ కలహాలు, ఆస్తుల పంచాయితీలతో తల్లిదండ్రులపై పిల్లలు దాడులకు పాల్పడడం చూస్తూనే ఉన్నాం. కొన్ని సందర్భాల్లో పిల్లల వేధింపులు భరించలేక తల్లిదండ్రులు అంతమొందిస్తున్నారు. తాజాగా ఉమానగర్, పంజాగుట్టలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిద్రలో ఉన్న యువకుడిని స్వంత తల్లి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులతో కలిసి గొంతు నులిమి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు హర్ష వర్ధన్ (27) గా పోలీసులు గుర్తించారు. ఆయన తల్లి గంగులమ్మ (50) ఇళ్లలో పనులు చేస్తూ…