Hyderabad Fog: కాశ్మీర్ను తలపించేలా హైదరాబాద్.. శివారు ప్రాంతాలను కమ్మేసిన పొగమంచు..
- కాశ్మీర్ను తలపించేలా హైదరాబాద్..
- శివారు ప్రాంతాలను కమ్మేసిన పొగమంచు..
- ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Fog: హైదరాబాద్ శివారు ప్రాంతాలు ఇవాళ ( జనవరి 2న) ఉదయం దట్టమైన పొగమంచుతో కమ్మేశాయి. తెల్లవారుజాము నుంచి కనిపించిన ఈ పొగమంచు కారణంగా పరిసర ప్రాంతాలు పూర్తిగా కాశ్మీర్ లోయను తలపించేలా కనిపించాయి. రోడ్లు, చెట్లు, భవనాలు పొగమంచు తెర వెనక కనుమరుగు అయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ హైవే తో పాటు శామీర్పేట్, మేడ్చల్, తూముకుంట, షామ్షాబాద్, ఆదిబట్ల, గండిపేట, మోకిల, కొంపల్లి, సంగారెడ్డి, రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, కిస్మత్ పూర, పటాన్ చెరు, ఆర్సీపుర్, వికారాబాద్ వైపు వెళ్లే శివారు ప్రాంతాల్లో పొగమంచు తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఉదయం 6 గంటల వరకు దృశ్యమానత (విజిబిలిటీ) బాగా తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
Read Also: Amaravati: అమరావతిలో పంపింగ్ స్టేషన్-2 నిర్మాణానికి టెండర్లు ఖరారు
Also Read
- Secunderabad Bonalu 2026: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలపై క్లారిటీ.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- ACB Raids: ఆదాయానికి మించిన ఆస్తులు.. డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ దాడులు.!
- Hyderabad: ఘనంగా మిస్ యూనివర్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2026 గ్రాండ్ ఫినాలే.!
- CM Revanth Reddy : SIRపై సీఎం రేవంత్ సీరియస్.. గాంధీ భవన్లో వార్ రూమ్.!
అయితే, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నాగార్జునసాగర్ హైవేతో పాటు పలు ప్రధాన రహదారుల వాహనదారులు ఉదయం 8 గంటలు అయినా పొగ మంచుతో 10 అడుగుల దూరం ఉన్న వాహనాల రాకపోకలు కనిపించకపోవడంతో.. లైట్లు వేసుకొని తమ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాయి. ఇక, ఆర్టీసీ బస్సు డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం డిపో సేఫ్టీ అధికారి వెంకటేశం సూచనలు చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో భారీ ఎత్తున అటవీ ప్రాంతం ఉండడంతో రోజువారీ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉంటుంది.
Read Also: Mumbai: ఓ యువతి ఘాతుకం.. ప్రియుడు అందుకు నిరాకరించాడని ఏం చేసిందంటే..!
అలాగే, రాజేంద్రనగర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, కిస్మత్ పూర్, ఔటర్ రింగు రోడ్డుతో పాటు వికారాబాద్ వైపు జాతీయ రహదారి మొత్తాన్ని పొగమంచు కప్పేసింది. దట్టమైన పొగమంచుతో తీవ్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముందు వెళుతున్న వాహనాలు కనిపించక పోవడంతో నెమ్మదిగా ముందుకు కదులుతున్న పరిస్థితి నెలకొంది. ఫాగ్ లైట్స్ వేసినప్పటికి రహదారి కనిపించడం లేదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. అహ్లాదకరమైన వాతావారణాన్ని మార్నింగ్ వాకర్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్టులో పొగమంచు కారణంగా పలు విమానాలు రద్దు అయ్యాయి. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి, శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం రద్దు అయింది. అలాగే, శంషాబాద్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన ఇండిగో విమానం అలస్యంగా నడుస్తుంది. మరోవైపు, సంగారెడ్డి జిల్లాలోని ముంబై జాతీయ రహదారి ఆర్సీపురం నుంచి పటాన్ చెర్వు మీదుగా ఇస్నాపూర్, రుద్రారం, ముత్తంగి, ఇంద్రేశం వరకు పొగ మంచు కమ్మేసింది. ఈ పొగ మంచు వల్ల విద్యార్థులు, ఉద్యోగస్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?