హైదరాబాద్ నడిబొడ్డున… అదీ జూబ్లీహిల్స్.. ఫిల్మ్నగర్ ప్రాంతంలో దర్జాగా భూ దందా..! ఒకటి కాదు రెండు కాదు… అక్షరాలా 15 వందల కోట్ల రూపాయల స్కామ్ వెలుగు చూసింది.. గిమ్మిక్కులతో జిమ్మిక్కులు చేసి… లొసుగుల్ని అనుకూలంగా మలుచుకుని ఫిల్మ్నగర్లోని పదెకరాలు కారుచౌకగా కొట్టేయడమే కాకుండా… మరో నాలుగున్నర ఎకరాలకు ఎసరుపెట్టింది ఎవరు? రెడ్ఫోర్ట్ అక్బర్ సంస్థ వెనక ఉన్నదెవరు అంటే ఇద్దరు బడా నేతలన్నది జగమెరిగిన సత్యం. వారిద్దరూ కలిసి ఈ ప్రైమ్ ల్యాండ్లో చక్రం తిప్పారు.…
రంగారెడ్డి : రాజేంద్రనగర్ మైలార్ దేవిపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటర్ సైకిల్ ను సిమెంట్ రెడీ మిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ చక్రాల కింద ముగ్గురు యువకులు నలిగిపోయారు. మైలార్ దేవిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ రోడ్డు ప్రమాదం ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు… హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రోడ్డు…
కరోనా మహమ్మారి వెటకారంగా మాట్లాడుతున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ, బీజేపీ నేత విజయశాంతి… జూబ్లీహిల్స్ శ్రీరాంనగర్లోని వ్యాక్సిన్ సెంటర్ను పరిశీలించిన ఆమె.. వ్యాక్సినేషన్ ప్రక్రియను దగ్గరుండి పరిశీలించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా గురించి సీఎం కేసీఆర్ వెటకారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. ఇప్పటికైనా కేసీఆర్ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించిన ఆమె.. సీఎం బాధ్యతగా ఉండి ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవికావన్నారు. పారాసిట్మాల్ తో కరోనా తగ్గితే యశోదా ఆస్పత్రిలో ఎందుకు చికిత్స…
మూడు రోజుల క్రితం వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి. మూడు రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. మూడో రోజు కూడా ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ.44,200కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగి 48,220 కి చేరింది. గత మూడు రోజులుగా…
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్.. తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరానికి పురమాయిస్తూ ఉంటారు… తాజాగా, రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన శంకర్ గౌడ్ అనే వ్యక్తి తన ఇంటి అనుమతి కోసం వేధిస్తున్నారంటూ సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్లో తన ఆవేదన వ్యక్తపరిచాడు. ఇంటి అనుమతి కోసం నిబంధనల ప్రకారం డబ్బులు చెల్లించినప్పటికి ఇక్కడ కొందరు డబ్బుల కోసం తనకు అనుమతి ఇవ్వడం లేదంటూ…
భారత దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు తెలియనివారుండరు.. ఆయన వ్యూహాలతో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి.. మొన్నటి మొన్న పశ్చిమ బెంగాల్లో దీదీ వరకు ఎంతో మంది పీఠాన్ని ఎక్కారు.. నితీష్ కుమార్, వైఎస్ జగన్, స్టాలిన్.. ఇలా చాలా మందికే వ్యూహ రచన చేశారు పీకే.. ఆయన ఎక్కడ అడుగు పెట్టినా.. తన టీమ్ను రంగంలోకి దింపి పనిమొదలు పెడతారు. అయితే, బెంగాల్ ఫలితాల తర్వాత తన వృత్తిని వదిలేస్తున్నట్టు సంచలన…
భూ లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్.. ఆ తర్వాత టీఆర్ఎస్, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇక, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో.. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు.. గత ఆరేళ్లుగా ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగిన ఆయన.. తాజా పరిణామాల తర్వాత ఆ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే, ఇవాళ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు అవినీతి నిరోధక…
తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడంలో మాటల యుద్ధం రోజురోజుకీ తారస్థాయికి చేరుతోంది… ఏపీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ విద్యుత్శాఖ మంత్రి జగదీష్రెడ్డి… ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ సీఎం లేఖ రాయడంపై మండిపడ్డ ఆయన.. తండ్రిని మించిన దుర్మార్గుడు వైఎస్ జగన్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. సమస్యను సృష్టించిందే ఆంధ్ర సర్కార్ అని విమర్శించిన ఆయన.. హైదరాబాద్ నీటి అవసరాలు పట్టవా? కోర్టుకిచ్చిన మాటను తప్పిందేవరు.? సర్వేల పేరిట నిర్మాణాలు…
తెలంగాణ పోలీసులకు, కౌంటర్ ఇంటెలజెన్స్ లకు మల్లేపల్లి ఓ సవాల్ గా మారింది. కానీ ఆ మల్లేపల్లి పై కొరవడింది పోలీసుల నిఘా. అక్కడ పోలీసుల సెర్చ్ ఆపరేషన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. మర్కాజ్ ఘటన తర్వాత మల్లేపల్లి పై దృష్టి పెట్టారు పోలీసులు. అయినా పోలీసులకు మాలిక్ బ్రదర్స్ చిక్కలేదు. హైదరాబాద్ లో స్లీపర్ సేల్స్ కు అడ్డాగా మల్లేపల్లి మారింది అంటున్నారు. మల్లేపల్లి లో న 20 సంవత్సరాల నుండి ఉంటున్నార ఉగ్రవాదులు మాలిక్ సోదరులు.…
హైదరాబాద్ లో మరో కారు బీభత్సం సృష్టించింది. ప్రేమావతి పేటలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడి పైకి దూసుకు వెళ్ళింది కారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారు బలంగా ఢీ కొట్టడంతో బాలుడు ఒక్కసారిగా గాలిలో ఎగిరి కింద పడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే బాలుడి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు. బయట పెద్ద శబ్దం రావడంతో ఇంట్లో నుండి రోడ్డు పైకి వచ్చిన కాలనీ వాసులు……